కుంభాల్ ఘర్ ఫోర్ట్ 15 వ శతాబ్దంలో రాజు రానా కుంభాచే నిర్మించారు. ఈ మేవార్ కోట బాణా నది ఒడ్డున ఉంది. ఇది రాజస్థాన్ లోని రెండవ అతి ముఖ్యమైన కోట. పెద్ద సంఖ్యలో పర్యాటకులుకోట కువస్తారు. ఈ భారీ కోట 13 శిఖరాలను, వాచ్ టవర్లను, మరియు బురుజులను చుట్టూ కలిగి...
రాజస్ధాన్ లోని ఇతర ప్రదేశాలవలెనే, కుంభాల్ ఘర్ లో కూడా అందమైన ప్యాలెస్ లు ఉన్నాయి. వాటిలో బాదల్ మహల్ ఒకటి. దీనిని మేఘాల ప్యాలెస్ అని అంటారు. దీనిలోనే మర్దనా మహల్ మరియు జనానా మహల్ అనేవి కలవు. ప్యాలెస్ లోని సుందరమైన గదులు పేస్టెల్ రంగు కుడ్య చిత్రాలచే...
వేది దేవాలయం కుంభాల్ ఘర్ కోటలోని హనుమాన్ పోల్ కు సమీపంలో కలదు. రఈ జైన దేవాలయాన్ని రాణా కుంభ నిర్మించాడు. మహారాణా ఫతే సింగ్ తర్వాతి కాలంలో పునరుద్ధరించాడు.
ఈ దేవాలయం కుంభాల్ ఘర్ కోట సమీపంలో కలదు. ఈ గుడిలో ఆరు అడుగుల శివలింగం ఉంది. ఇక్కడ ఇది ఒకే దేవాలయం. చరిత్ర మేరకు రాణా కుంభ రాజు దీనిని అర్చించే వాడు. అయితే, దురదృష్టవశాత్తూ ఒకసారి తాను లింగాన్ని అర్చించే సమయంలో తన స్వంత కుమారుడిచే వధించబడినట్లు...
ఈ దేవాలయాన్ని రాణా కుంభ రాజు 1460లో నిర్మించారు. ఈ గుడి కుంభాల ఘర్ కోట కింది భాగంలో కలదు. పర్యాటకులు దీనిపై మేవార్ చరిత్రను శిలా శాసన రూపంలా వ్రాసి ఉండటం గమనిస్తారు. ఇక్కడ వ్రాసిన శాసనం మేరకు చరిత్ర గుహిల్ కాలం నుండి రాణా కుంభ పాలన...
ఈ దేవాలయం పురాతన గుహలో కలదు. దీనిలో పరశురామ రుషి విగ్రహం ఉంటుంది. పురాణం మేరకు పరశురాముడు ఇక్కడ ధ్యానం చేశాడని, శ్రీరాముడి ఆశీర్వాదం పొందాడని చెపుతారు. ఈ గుహను చేరాలంటే పర్యాటకులు సుమారు 500 మెట్లు కిందకు దిగాలి.