మాల్దీవులలో మాలే ద్వీపం ఒక స్వర్గం లాంటిది అంటారు. మరి మీరు ఇండియా లోని కేరళ కు ఉత్తర దిశగా అంటే సుమారు 250 కి. మీ.ల దూరం తప్పక ప్రయాణించాలని మేము సూచిస్తున్నాం. ఈ విహార ప్రదేశానికి వెళ్ళటానికి మీ ఇండియన్ వీసా సైతం మీకు అనుకూలిస్తుంది.
లక్ష ద్వీపాలను గతం లో లక్క దీవులు అని కూడా అనేవారు. ఇవి మొత్తంగా 39 అతి చిన్న దీవులు. ఇవి మారుతున్న ప్రపంచంలో అతి వేగంగా ఒక పర్యాటక ప్రదేశాలుగా మారిపోయాయి. ప్రత్యేకించి బీచ్ ల వెంట షికార్లు కొట్టి ఆనందించాలనుకునేవారికి ఇవి ఎంతో ఆనందాన్ని అందిస్తాయి. సుమారు 132 కి. మీ.ల కోస్తా తీరం కలిగి 4200 చ. కి. మీ.ల సముద్ర భాగం కలిగిన ఈ దీవులు మీకు అనేక వితలు, విశేషాలు, అంటే మీరు కోరే సాహస క్రీడలు, బీచ్ వినోదాలు, ఆనందాలు అందిస్తాయి.
లక్షద్వీపాల చరిత్ర పరిశీలిస్తే,
భారత దేశం ఆగష్టు 15, 1947 నాడు స్వాతంత్రం పొందిన తర్వాత అప్పటి వరకు బ్రిటిష్ వారి ఆధిపత్యం లో వున్న ఈ దీవులు ఇండియన్ యూనియన్ లో చేరాయి. అయితే, ఈ ద్వీపాలలో ప్రధానంగా ముస్లిం ప్రజలు అధికంగా వుండటం చేత, ఈ దీవుల పై ఆధిపత్యాన్ని పాకిస్తాన్ కోరుతుందని భావించారు. వెంటనే, భారత దేశ హోం మంత్రి భారత నౌకా దళ ఓడలను అక్కడ కు పంపి భారత దేశ జాతీయ జండా ను ఎగుర వేయించారు. దాని తర్వాత పాకిస్తాన్ నౌకా దళం కూడా ఆ ప్రాంతం లో అవకాశాల కొరకు సంచరించింది.
నేడు లక్ష ద్వీపాలు , ఇండియన్ నేవీ కి ఒక బేస్ గా వుంది మిడిల్ ఈస్ట్ ప్రాంతం నుండి ఇండియా కు వచ్చే ముప్పు ను పరి రక్షించేవి గా వున్నాయి.
ఈ ద్వీపాల విహారం ...ఇక్కడ కల పర్యాటక ప్రదేశాలు. ఈ ప్రదేశ ప్రకృతి అందాలు లక్షద్వీపాల ను మంచి పర్యాటక ప్రదేశంగా చేసాయి. అవి కనుగొన్న నాటి నుండి నేటికి కూడా వాటి ప్రకృతి సౌందర్యం అలాగే కాపాడ బడింది. లక్ష దీవులలో ప్రధానమైనవి 'ఆగట్టి 'ద్వీపం మరియు బంగారం ద్వీపం. ఆగట్టి లో ఎయిర్ పోర్ట్ కలదు. బంగారం ద్వీపం లో ఆల్కహాల్ తాగేందుకు అనుమతులు కలవు.
ఈ ద్వీవులలో మీకు లభించే చేపలు, ఇతర సముద్రపు ఆహారాలు మంచి నాణ్యమైన వి గా వుంటాయి. అంతేకాదు వీటిని ఇక్కడ నుండి ఎగుమతులు కూడా చేస్తారు. తునా చేప కు ఈ దీవి ప్రసిద్ధి. నగర జీవితాలు కు ఎంతో దూరం గా వుండి అలసిన నగర వాసులకు చక్కని ప్రశాంతతను ఆహ్లాదాన్ని కలిగించేవిగా వుంటాయి. ఆనందించ టానికి ఇక్కడ ఫిషింగ్ ఒక గొప్ప అవకాశం. ఇంకనూ స్కూబా డైవింగ్ మరొక పర్యాటక ఆకర్షణ.
అనుభవజ్ఞులైన డైవర్లు లక్షద్వీపాలలో గల బీచ్ ల డైవింగ్ ఎంతో ఆనందం ఇచ్చేదిగా భావిస్తారు. అందమైన ఇసుక తిన్నెలు, గల గల మనే చేపల గుంపులు, తాబేళ్లు, అక్కడ కల అనుభవం కల డైవర్లు అన్నీ కూడా డైవింగ్ ఆనందింప చేస్తాయి. సాధారణంగా డైవింగ్ ను 30 మీటర్ల తోతు వరకు అనుమతిస్తారు. కొన్ని మినహాయింపు కేసుల లో అంటే మే నెల 15 నుండి సెప్టెంబర్ నెల 15 వరకు టూరిస్టులు డి కంప్రెషన్ చాంబర్ ను వినియోగించుకునేటం దుకు అనుమతిస్తారు. స్కూబా డైవింగ్ లో పూర్తి అనుభవం వున్న వారైతే, ఈ ద్వీపం వారి ప్రయోగాలకు మరింత సహకరిస్తుంది. డైవింగ్ మాస్క్ ల తో మరింత లోతుల లోకి కూడా వెళ్ళవచ్చు.
ఇక్కడి సముద్ర భాగాలు నీలి రంగు లో వుండి అందులోని పగడాలు మెరుస్తూ వుంటాయి. లక్షద్వీపాల లోని రిసార్ట్ లు మీకు మరువలేని సౌకర్యా అనుభూతులు కలిగించగా, అక్కడి బీచ్ లు పాల తెలుపు రంగు తో చుట్టూ తాటి చెట్లు, కొబ్బరి చెట్లు కలిగి కన్నుల పండువచేస్తాయి. లక్షద్వీపాల పర్యటన మిమ్మల్ని ఆనంద అనుభూతులతో తేలియాడ చేసి, నిస్సందేహంగా భారత దేశం మీకు అందించే గొప్ప అనుభవంగా భావింప చేస్తుంది.
లక్షద్వీపాల ను సందర్శించే ఉత్తమ సమయం
లక్షద్వీపాల పర్యటన వర్షాకాలం చివరి లో అంటే వేసవి కి ముందు కాలం లో సూచించదగినది.