సూరత్ ఒక అందమైన గ్రామ౦. సూరత్ సభ గచ్చి మధువని, సూరత్ లో జరిగే అత్యంత ప్రధాన సంఘటన. ఇక్కడ మైతిల్ బ్రాహ్మలు జాతకాల ప్రకారం అబ్బాయిల, అమ్మాయిల పెళ్ళిళ్ళు ఖాయపరచడానికి పెద్ద సంఖ్యలో పోగవుతారు.
కపిలేశ్వరస్థాన్ అనేక ఆలయాలు, విగ్రహాలు కలిగిన ఒక ప్రసిద్ధ యాత్రాస్థలం. ఏడాది పొడవునా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు.
దుర్గామాత పేరునుండి భవానీపూర్ అనే పేరు వచ్చింది, యాత్రికులలో, పర్యాటకుల కోసం ఎంతో ప్రకాశవంతంగా ఈ అందమైన ఆలయాలు బాగా ప్రసిద్ది చెందాయి.
జైనగర్, మధువని జిల్లలో ఒక నగరం. ఇది మధువని పర్యటనలో అంతర్భాగంగా ఉంది. ఇది రైలుమార్గం ద్వారా అనుసంధానించబడి, నేపాల్ నుండి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. జైనగర్ సందర్సన ద్వారా పాత, కొత్త కలయికలను, ఇక్కడి ఆలయాలను చూడవచ్చు.
ఝాంఝార్పుర్ హిమాలయాల పదాల వద్ద ఉన్న ప్రదేశం, అది దాని స్థలాకృతి, వృక్షాల కారణంగా అందంగా ఉంది. ఝ౦ఝర్పుర్ ఇంద్ర పూజ, దుర్గ పూజ లను అసమానమైన ఉత్సాహంతో నిర్వహిస్తుంది. ఎంతో భక్తితో ఇంద్రుడిని పూజించే ఇందిరా పూజ పండుగను పడి రోజులు జరుపుకుంటారు. ఝ౦ఝర్పుర్ ఉప విభాగ...