మండు , మాండవ్ ఘర్ లేదా శాదియాబాద్, అంటే ఒక ఆనందాల భూమి. కాలం తో బాటు ప్రకృతి తెచ్చే అనేక పెను ముప్పులకు ఈ పట్టణం ఎంతో నష్ట పోయింది. అయినప్పటికీ మండు టూరిజం విహారాన్ని అందిస్తోంది. సాంప్రదాయక మాల్వా ఆహారాలు దాల్ బాత్ మరియు టూరిజం శాఖ నిర్వహించే మాల్పువా మాల్వా ఉత్సవాలు వంటివి అన్నీ కలసి, పర్యాటకులకు ఒక చక్కని సెలవుల విహార యాత్రని అందిస్తోంది.
మండు పట్టణం లోను మరియు దాని చుట్టుపట్ల కల పర్యాటక ఆకర్షణలు
మండు పట్టణం చాలా వరకు చరిత్ర ప్రసిద్ధ ప్రకృతి ప్రదేశాలు కలిగి వుంటుంది. టవున్ యొక్క గోడలు అద్భుత శిల్ప శైలి కలిగి వుంటాయి. ఎన్నో మసీదులు,మహళ్ళు అన్నీ కూడా గత చరిత్రను పునరుద్ధరిస్తాయి. ఇక్కడ చూడవలసిన వాటిలో రూపమతి మహల్, అద్భుత దర్వాజాలు, కోట యొక్క గేటు లు ,తాజ్ మహల్ వలే మార్బుల్ తో నిండిన హోశాంగ్ టూమ్బ్ , మొదలైనవి.
చరిత్ర లోకి వెళితే, ఇపుడు కనపడే ప్రతి ప్రదేశాన్ని చూసి ఆనాటి పాలకుల కళాత్మక దృష్టి ని అభినన్దించవచ్చు. ఒకప్పుడు మండు ఆఫ్ఘన్ పాలకుడైన దిలావార్ ఖాన్ పాలించిన చిన్న రాజ్యం. దిల్వార్ ఖాన్ కుమారుడైన హోశాంగ్ షా దీనిని బాగా అభివృద్ధి చెసాడు. అయితే అక్బర్ దీని రాజు బాజ్ బహాదోర్ ను ఓడించి తన మొగల్ రాజ్యం లో మరో మారు మరాఠాలు 1732 లో దీనిని జయైన్చేతంత వరకూ వుంచుకున్నాడు.
మండు ఎలా చేరాలి
మండుచేరేందుకు రైలు రోడ్డు వాయు మార్గాలు కలవు.
సందర్శనకు మంచి సమయం
మండు సందర్శనకు కొద్దిపాటి జల్లులు పడే వర్షాకాలం అనువైనది.