మాండ్వి గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ ఓడరేవు పట్టణము.సూరత్,ముంబై పోర్ట్ లు అభివృద్ధి చెందక మునుపు మాండ్వి ఓడరేవు ప్రసిద్ది గాంచింది.తూర్పు ఆఫ్రికా, పెర్షియన్ గల్ఫ్, మలబార్ తీరం మరియు ఆగ్నేయ ఆసియా దేశాల నౌకలకు అరేబియా సముద్రంలో స్థావరంగా ఈ ఓడరేవు ఉండేది.
ఓడరేవు పట్టణం యొక్క ప్రాముఖ్యత
మాండ్వి 1574 వ సంవత్సరంలో కచ్ రాజు అయిన ఖేన్గార్జి ఈ ఓడ రేవు పట్టణంను స్థాపించారు. ఇది గుజరాత్ లో చాలా ముఖ్యమైన నౌకాశ్రయంగా అవతరించింది మరియు మాండ్వి చాల త్వరగా అభివృద్ధి చెందింది.మాండ్వి లో సుందర్వర్ ఆలయం,జమ మస్జిద్, లక్ష్మినారాయాన్ ఆలయం, కజివాలి మసీదు మరియు రామేశ్వర్ ఆలయంలను చాలా తక్కువ సమయంలో నిర్మించారు.
ఒక ప్రముఖ నౌకాశ్రయం గా పేరుగాంచిన మాండ్వి నుండి ఇంగ్లండ్ కు మద్య సుమారు 400 నౌకలు రాకపోకలు సాగిస్తూ ఉండేవి. మాండ్వికి రక్షణగా 8 మీటర్ల ఎత్తైన కోట గోడ ఉండేది.ఆ కోట గోడకు అనేక ద్వారాలు మరియు 25 బురుజులు ఉండేవి.ప్రస్తుతం దాదాపు ఈ గోడ నాశనం అయింది,కానీ నైరుతి దిశలో ఉన్న ఒక కోట బురుజును ఇప్పటికి లైట్ హౌస్ గా వాడుతున్నారు.ఇప్పటి పెద్దగా ఉండే ఆధునిక నౌకలు ఈ ఓడరేవులో నిలిపే సదుపాయం లేకపోవుటచే మాండ్వి రేవు ప్రాముఖ్యత తగ్గింది.అయినప్పటికీ రుక్మావతి నది ఒడ్డున సాంప్రదాయ నౌకానిర్మాణం ఇప్పటికీ కొనసాగుతుంది.
జనాభా
వాస్తవానికి మాండ్వి లో సంస్కృతి కుట్చీ సంస్కృతిని సూచిస్తుంది. ఈ నగరంలో ప్రధానంగా వ్యాపారులు మరియు నావికులు నివసిస్తున్నారు.
సంస్కృతి
మాండ్వి దబెలి అని పిలవబడే డబుల్ రోటిస్ అనే వంటకానికి ప్రసిద్ది.ఈ వంటకాన్ని 1960 వ సంవత్సరం లో కశవ్జి గాభ చుదాసమ కనిపెట్టేను.