నదౌన్ , హిమాచల్ ప్రదేశ్ లో హమీర్పూర్ జిల్లాలో బియాస్ నది ఒడ్డున ఉన్న ఒక పేరొందిన పర్యాటక ప్రదేశం. సముద్ర మట్టానికి 508 మీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రాంతం పరిసరప్రాంతాల అందమైన దృశ్యాలను అందిస్తుంది. చారిత్రక కధనాల ప్రకారం నదౌన్ , నదౌన్ జాగీరుకు ప్రధాన కార్యాలయమే కాక వేసవిలో కాంగ్రా మహారాజు సంసార్ చంద్ కు సభా కార్యకలాపాలకు ఉపయోగపడేది.
ఈ పట్టణంలో శ్రీ గురుద్వారా సాహిబ్, బిల్-కాలేశ్వరాలయం, అంటార్-నదౌన్ కోట వంటి పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. శ్రీ గురుద్వార్ సాహిబ్ బియాస్ నదిఒడ్డున ఉన్న ఒక సిక్కు తీర్థయాత్ర కేంద్రం. నదౌన్ కు సందర్శించ తలచిన పర్యాటకులు బిల్-కాళేశ్వర్ ఆలయాన్ని తప్పనిసరిగా చూడాలి. జానపదాల ప్రకారం భారత పురాణగాధ మహాభారతం లోని ఐదుగురు అన్నదమ్ములు పాండవులు ఈ దేవాలయాన్ని కట్టించారు. శివునికి చెందిన ఈ ఆలయానికి ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు పూజలు చేయడానికి వస్తారు.
కటోచ్ వంశానికి చెందిన సంసార్ చంద్ మహారాజు రాచరిక వారసత్వాన్ని ప్రతిబింబించే పురాతన చిత్రాలు ఉన్న అంటార్-నదౌన్ కోట కూడా పర్యాటకులకు ఒక ముఖ్య పర్యాటక ప్రదేశం. భార్మోటి గ్రామంలో ఉన్న పీర్-సాహిబ్ సమాధి నదౌన్ లో మరో ముఖ్యమైన పర్యాటక ఆకర్షణ. పర్యాటకులు బియాస్ నదిలో చేపలుపట్టడం, తెప్పలపై ప్రయాణం చేయడం వంటివి కూడా వినోది౦చవచ్చు.
పర్యాటకులు నదౌన్ వాయు, రైలు, రోడ్డు మార్గాలద్వారా చేరవచ్చు. ఈ ప్రాంతానికి గగ్గల్, జ్వాలాముఖి సమీప విమానాశ్రయం, రైల్వే స్టేషన్. పర్యాటకులు మే నుండి జులై మాసాలాలో ఉండే వేసవిలో సందర్శించ వచ్చని సూచన. శీతాకాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కావున ఈ సమయంలో కూడా పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.