సముద్ర మట్టానికి 2155 అడుగుల ఎత్తున మైసూరు జిల్లాలో నంజన్ గూడ్ దేవాలయ పట్టణం ఎంతో వారసత్వ ప్రాశస్త్యాన్ని కలిగి ఉంది. ఈ పట్టణం ఒకప్పుడు గంగ వంశీకులు ప్రారంభంలో పాలించారు. వారి తర్వాత హోయసలులు, తర్వాతి కాలంలో మైసూర్ ఒడయార్లు దీనిని పాలించారు. శ్రీ రంగ పట్నాన్ని పాలించిన హైదర్ ఆలి మరియు టిప్పు సుల్తాన్ లు కూడా ఈ పట్టణంతో మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారని కూడా తెలుస్తోంది.
పట్టణం గురించిన కొన్ని వాస్తవాలు ఈ పట్టణం అక్కడ దేవాలయంలోని నంజుండేశ్వర స్వామి పేరుతో ఏర్పడింది. నంజుండేశ్వరుడంటే ఈ భూమిని కాపాడటానికిగాను విషాన్ని మింగిన శివ భగవానుడు. ఈ విషం సముద్రాన్ని చిలికినపుడు పైకి వచ్చింది. నంజన్ గూడ్ ను దక్షిణ కాశి అంటారు. ఈ దేవాలయ ప్రధాన దేవుడు శివుడు భక్తులను అనుగ్రహించి కాపాడుతూంటాడు.
నంజన్ గూడ్ లో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మరియు పరశురామ క్షేత్రం కూడా చూడదగిన ప్రదేశాలు. మఠంలో రాఘవేంద్ర స్వామి విగ్రహాలు కొన్ని కనపడతాయి.
నంజన్ గూడ్ పట్టణం బెంగుళూరుకు 163 కి.మీ.లు మైసూర్ కు 30 కి.మీ.ల దూరంలో ఉంది. రోడ్డు మరియు రైలు మార్గాలు కలవు. వాణిజ్య పరంగా కూడా ఈ పట్టణం అభివృద్ధి చెందుతోంది.