భారతదేశంలోని మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో తికంగర్ జిల్లాలో బెత్వ నది దగ్గర ఓర్చా ఉన్నది. బుందేల్ఖండ్ ప్రాంతంలో ప్రసిద్ధ రాజు రుద్ర ప్రతాప్ సింగ్ 1501 లో స్థాపించారు. ఓర్చా ఝాన్సీ మరియు ఉత్తర ప్రదేశ్ నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం యొక్క స్థాపకుడు అయిన మహారాజా రుద్ర ప్రతాప్ సింగ్ ఓర్చాను పాలించిన తొలి రారాజుగా చెప్పవచ్చు.
ఓర్చా మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు
ఓర్చా ను మొదట సృష్టించిన ఒక రాజు పరిపాలించాడు. దీనికి దాదాపుగా నిజమైన ప్రశంసల అర్హత ఖచ్చితంగా దాని నిర్మాణాల వల్ల వచ్చింది. చంద్రశేఖర్ ఆజాద్ మెమోరియల్, చ్చాత్రిస్ ,దుజి కి హవేలి, దిన్మన్ హర్దుల్ యొక్క ప్యాలెస్,ఫూల్ బాగ్ మొదలైనవి ఓర్చాలో ఉన్న కొన్ని అద్భుతమైన ప్రదేశాలు. ఓర్చా పర్యటనలో పర్యాటకులు రాజా మహల్, రాణి మహల్, సుందర్ మహల్, లక్ష్మి నారాయణ ఆలయం వంటి వాటిని తప్పనిసరిగా చూడాలి. ఓర్చా లో పర్యాటకులు నదిలో తెప్ప నడపటం వంటి సాహసకృత్యంను చేసి ఆనందమును పొందవచ్చు. ఓర్చా సంస్కృతి మరియు సంప్రదాయాల కొరకు ప్రసిద్ధి చెందింది. ఇది ఒక భారీ పట్టణం కాదు. అయినప్పటికీ ఓర్చాలో ప్రతి ఇద్దరి మద్య భాగస్వామ్యం, అవగాహన అనేవి ప్రజల వేడుకల సందర్భాలలో చూడవచ్చు.
ఓర్చా - అపారమైన అందం కలిగిన ప్రదేశం
ఓర్చా పర్యాటక రంగం సగర్వంగా ఈ ప్రసిద్ధ పట్టణం రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న అందం ఆస్వాదించడానికి ఖచ్చితంగా పర్యాటకులను ఆహ్వానిస్తుంది. ఓర్చా యొక్క అందమైన పట్టణం మరియు చుట్టూ చూసి ఆనందించండి. మహాల్స్, గుళ్ళు, రాజభవనాలు మరియు అందమైన నిర్మాణాల ఉన్నాయి. కనీసం నాలుగు రోజులు ఓర్చాను సందర్శించడం కోసం ప్లాన్ చేసుకొని అద్భుతమైన జ్ఞాపకాలను పదిలపరుచుకోండి.
ఓర్చా చేరుకోవడం ఎలా
ఝాన్సీ నుండి ఓర్చా సుమారు 16 km దూరంలో ఉంటుంది. రోడ్డు రవాణా ద్వారా సులభంగా చేరుకోవచ్చు.
ఓర్చా వాతావరణం
ఓర్చా వాతావరణం ఎక్కువ సమయం ఆహ్లాదకరంగా ఉంటుంది.