పవొంట సాహిబ్, ఇది యమున నది ఒడ్డున ఉన్నది. దీని ప్రకృతి సౌందర్యానికి పర్యాటకులు ఆకర్షితులవుతున్నారు. ఈ చారిత్రిక పట్టణం 10వ సిఖ్ గురువు, గురు గోవింద్ సింగ్, కనుగొన్నాడు. ఈయన సిర్మౌర్ యొక్క 'రాజ మైదిని ప్రకాష్' యొక్క ఆహ్వానం మీద ఇక్కడకు వొచ్చి, నాలుగు సంవత్సరాలకు ఫైగా ఇక్కడ నివసించారు. ఈయనకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇక్కడికి వొచ్చారని చెపుతారు. ఎటమాలజికల్లీ (శబ్దలక్షణ ప్రకారము) 'పాంట' అంటే 'స్థావరం కోసం స్పేస్' అని అర్థం. ఇది 350 మీ. వెడల్పు గల సరిహద్దుతో, చుట్టూ దట్టమైన ఆకుపచ్చని సాల్ చెట్ల సముదాయం కల అడవులతో ఉన్నది. చరిత్ర ప్రకారం గురు గోవింద్ సింగ్ 'దస్సం గ్రంథ' అనే సిఖిసమ్ పవిత్ర గ్రంథాన్ని వ్రాస్తున్నప్పుడు, ఈ ప్రాంతంలో ఉన్న యమున నదిని నిశబ్దంగా ప్రవహించమని ఆదేశించాడు. అప్పటినుండి ఇక్కడ యమున నిశబ్దంగా ప్రవహిస్తుంది. గురు గోవింద్ సింగ్ కూడా ఏ అంతరాయం లేకుండా గ్రంథ రచన చేశారు.
ఇక్కడ 'అస్సన్ సరస్సు' మరియు 'సహస్త్ర ధార' మొదలైన అనేక కనులకింఫైన ఆకర్షణలు ఉన్నాయి. పర్యాటకులు పాంట సాహిబ్ చూడటానికి వొచ్చినప్పుడు తప్పనిసరిగా అందమైన అస్సన్ సరస్సును చూసి తీరాలి. దీనిని హిమాచల్ ప్రదేశ్ టూరిజం డిపార్టుమెంటు ఒక ప్రముఖ పర్యాటక స్థలంగా పెంపొందిస్తున్నారు. ఇక్కడ సందర్శకులు స్పీడ్ బోటింగ్, రోయింగ్, తెడ్డు, మరియు తెరచాప బోటింగ్ వంటి వినోద కార్యకలాపాలలో పాలుపంచుకుంటారు. యమున నది మరియు టోంగ్ కలయిక కేంద్రమే సహస్త్ర ధార, దీనినే 'తంస' అని కూడా పిలుస్తారు.
పాంట సాహిబ్ పట్టణంలో 'గురుద్వారా పాంట సాహిబ్', 'గురుద్వారా తిర్ ఘర్ సాహిబ్', 'గురుద్వారా భంగని సాహిబ్' మరియు 'గురుద్వారా షేర్ ఘర్ సాహిబ్' అనే బాగా ప్రాచుర్యం చెందినా ప్రార్ధనా మందిరాలు ఉన్నాయి. ఇంకా, 'దెఇ-క-మందిర్', 'ఖాద్ర డాక్ పతర్', 'నాగనున దేవాలయం', 'రామ్ దేవాలయం', 'కటాసన్ దేవి ఆలయం', 'యమున దేవాలయం', 'శివ దేవాలయం' మరియు 'బాబా గరీబ్ నాథ్ పీఠం' అనే ముఖ్యమైనవి ఉన్నాయి.
యాత్రికులు పాంట సాహిబ్ విమానం,రైల్, బస్సుల ద్వారా సులభంగా చేరుకోవొచ్చు.వేసవి, శిశిరం, వసంత కాలాలు ఇక్కడికి రావటానికి అనుకూలంగా ఉంటాయి.