పాతానం తిట్ట కేరళలోని దక్షిణ భాగంలో కలదు. ఇది చాలా చిన్న జిల్లా. ఈ జిల్లా నవంబర్ 1, 1982 నాడు ఏర్పరచబడి బాగా అభివృధ్ధి చెందుతోంది. వాణిజ్యం అధికమవుతోంది. పాతానం మరియు తిట్ట అనే రెండు పదాలతో ఈ ఊరు ఏర్పడింది. దీని అర్ధం నది పక్కన కల పది ఇండ్ల సమూహం అని చెపుతారు.
ఈ పట్టణం బోట్ రేసులు, పుణ్య క్షేత్రాలు, ఇతర సాంస్కృతిక శిక్షణలకు కేంద్రంగా ఉంది. దీనిని కేరళకు యాత్రిక రాజధాని అని కూడా అంటారు. ఈ జిల్లాలో శబరిమల అయ్యప్ప దేవాలయం కలదు. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా వేలాది భక్తులు ఇక్కడకు వస్తారు.
కళలకు పుట్టినిల్లు. పాదయాని అనే నాట్యం ఇక్కడ ప్రసిద్ధి. దీనిని కాదమనిట్ట దేవి దేవాలయంలో చేస్తారు. పాతానమిట్ట లో వస్తువిద్య గురుకులం కూడా ప్రసిద్ధి చెందింది. కుడ్య చిత్రాలకు ప్రసిద్ధి. మరో ప్రసిద్ధి చెందిన వస్తువు అరన్ మూల కన్నడి అనే ఒక చేతితో చేసిన మెటల్ అల్లాయి మిర్రర్. ఈ అద్దాన్ని తయారు చేసే రహస్యం ఒక కుటుంబం వారు మాత్రమే కలిగి ఉన్నారు. తర తరాలుగా వారి నుండి మాత్రమే ఈ అద్దాలు లభిస్తున్నాయి.
శబరిమల దేవాలయమే కాక మీరు ఇక్కడ శ్రీ వల్లభ దేవాలయం, పరుమాలలో మలంకార ఆర్దోడాక్స్ చర్చి , కోడుమాన్ చిలాన్తియంబలం, పాలియక్కర చర్చి, కవియూర్ మహదేవ దేవాలయం మరియు ప్రఖ్యాత స్వాతంత్ర సమర యోధుడ్ అదూర్ వేలు తంపి దేవ విగ్రహం చూడవచ్చు. ఈ చిన్న పట్టణం ఉష్ణమండల వాతావరణం కలిగి ఉనన్నప్పటికి శీతాకాలం పర్యటనకు అనువైనది. వాయు, రైలు, మరియు రోడ్డు మార్గాలలో ప్రయాణించవచ్చు. పాతానంతిట్ట తప్పక సందర్శించి అక్కడి ప్రకృతి ఒడిలో సేద దీరండి, అక్కడే కల అనేక దేవాలయాలలో మోక్షాన్ని పొందండి.