పట్టడకాల్ కు ఒక్కసారి ప్రయాణం చేస్తేచాలు, దక్షిణ భారత దేశంలో చాళుక్యుల పాలనా కాలంనాటి వైభవం చూసినవారం అవుతాము. పట్టడకాల్ అంటే అర్ధం కెంపుల కిరీట నగరం అని చెపుతారు. చాళుక్యుల పాలనాకాలంలో ఈ నగరం వైభవంతో తులతూగేది. పట్టడకాల్ పట్టణం మాలప్రభ నది పై బాగల్ కోట జిల్లాలో ఉంది.
ఒకప్పుడు ఈ పట్టణంలో రాజులు నివసించేవారు. ఈ పట్టణం తొమ్మిది హిందూ దేవాలయాలకు, ఒకజైన్ మందిరానికి ప్రసిద్ధి. వీటిని చాళుక్య రాజులు 7వ మరియు 8వ శతాబ్దాలలో నిర్మించారు. ఈ దేవాలయాల శిల్ప కళా వైభవం అద్భుతంగా ఉండి, ఈ ప్రదేశం అంతా కూడా ప్రపంచ హెరిటేజ్ సైట్ గా యునెస్కో గుర్తించింది.
పట్టడకాల్ దేవాలయాలలో అద్భుతమైన ఉత్తర మరియు దక్షిణ భారత దేశ ప్రాంతాల శిల్ప కళా శైలి గోచరిస్తుంది. ఈ రెండు శైలుల కలయికే విరూపాక్ష దేవాలయం. ఈ దేవాలయాన్ని 740 సంవత్సరంలో రాణి లకుమాదేవి నిర్మించినట్లు చరిత్ర చెపుతోంది. పల్లవ రాజులపై తన భర్త రెండవ విక్రమాదిత్యుడి ఘన విజయానికిగాను ఆమె ఈ దేవాలయం నిర్మించింది.
పట్టడకాల్ ఐ హోళే నగరానికి 10 కి.మీ.లు, బాదామి కి 22 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ నగరాలు కూడా చాళుక్యుల రాజధానులే. చాళుక్య కళా వైభవం కలిగి ఉంటాయి. పట్టడకాల్ బస్ లేదా ట్రైన్ లో చేరవచ్చు. సమీప రైలు స్టేషన్ బాదామిలో కలదు.