బీచ్ ప్రాంతాల పర్యటనతో విసుగెత్తిన వారికి మహారాష్ట్ర - గోవాల సరిహద్దులో కల పేర్నెమ్ దర్శన హాయినిస్తుంది. ఛపోరా మరియు టిరకోల్ నదులు అద్బుత దృశ్యాల నందిస్తాయి. ఈ ప్రాంతంలో స్ధానికుల జీవన విధానాలు తెలుసుకుంటూ ముచ్చటించవచ్చు లేదా వారి చేపల వేటలో పాల్గొనవచ్చు. అనేక సంవత్సరాల క్రిందట గోవా ఎలా ఉండేది అనే దానికి పేర్నెమ్ ఉదాహరణగా నిలుస్తుంది. ముంబై, పూనే ల నుండి గోవా వెళ్ళే వారికి పేర్నెం కొద్దిసేపు గడపటానికి కూడా బాగుంటుంది.
పేర్నెంలో చూడవలసినవి రెండే ప్రదేశాలు. అవి ఒకటి శ్రీ భగవతి దేవాలయం కాగా రెండవది దేశ్ ప్రభు హౌస్ అనబడే ఒక పెద్ద విల్లా. సాధారణంగా పాశ్చాత్యులు ఈ నిర్మాణాలకు బాగా ఆకర్షితులవుతారు. భగవతి దేవాలయంలో కల ఏనుగుల కట్టడాలు ఆకర్షణీయంగా ఉంటాయి.
ఉత్తరం నుండి గోవా కు ప్రయాణించేవారికి పేర్నెం చూడటం తేలిక. రాష్ట్రంలోకి ప్రవేశిస్తే చాలు మీరు చూసే మొదటి ప్రదేశం అదే. పాణజిం నుండి ఇది 32 కి.మీ.ల దూరం మాత్రమే కనుక క్యాబ్ లో ప్రయాణించవచ్చు. అయితే, ఛార్జీల విషయంలో జాగ్రత్త. అధిక ఛార్జీలకు మోసపోకండి. ప్రత్యామ్నాయంగా, వాతావరణం అనుకూలిస్తే, ఒక బైక్ అద్దెకు తీసుకొని కూడా ప్రయాణించవచ్చు.