వర్షాకాలం లేదా శీతాకాలాలలో రాయ్ గఢ్ కోటను సందర్శించి ఆనందించవచ్చు.
వేసవిలో ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకు మారుతూంటాయి. ఇక్కడ కల రాతి నిర్మాణాలు, సహజ రాతి గుహలు, మరాఠా యోధులకు చల్లదనాన్ని కల్పించేవి.
వర్షాకాలంలో కోట పచ్చటి పరిసరాలతో ఎంతో అందంగా కనపడుతుంది. సరస్సులు నీటితో నిండుగా, పచ్చగా ఉంటాయి.
రాయ్ గఢ్ లో శీతాకాల ఉష్ణోగ్రతలు రాత్రులందు 12 డిగ్రీలు, నుండి పగలు 25 డిగ్రీలుగా మారుతూంటాయి. వర్షాకాలం తర్వాత శీతాకాలం ఈ ప్రదేశాన్ని దర్శించెందుకు రెండవ ఎంపికగా భావించవచ్చు.