రోడ్డు ప్రయాణం ముంబై, పూనే, గోవా, కొల్హాపూర్ వంటి పట్టణాలు, నగరాలనుండి రత్నగిరి తేలికగా చేరుకోవచ్చు. జాతీయ రహదారి 17 ఈ జిల్లాగుండా వేయబడింది. రత్నగిరి - నాగపూర్ జాతీయ రహదారిని నెం.204 గా గుర్తించారు. దీని ద్వారా రత్నగిరి తూర్పు నగరాలకు మరియు సోలాపూర్, నాందేడ్, నాగపూర్ లకు కలుపబడింది. రత్నగిరి నుండి ముంబైకి ప్రతిరోజూ ప్రభుత్వ మరియు ప్రయివేటు బస్సులు కలవు. బస్సు ప్రయాణ ఛార్జీ రూ. 1500. అయితే ఈ ఛార్జీలు బస్సు నాణ్యతను బట్టి మారుతూంటాయి.