భీష్మక్ నగరం, అరుణాచలప్రదేశ్ లోని ఒక ప్రముఖ పురావస్తు, వారసత్వ ప్రదేశం. రోయింగ్ నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీష్మక్ నగరం వలన ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత వచ్చింది. 8 వ శతాబ్దంలో కాలిన ఇటుకలతో నిర్మించిన ఈ కోట, రాష్ట్రంలోని అతి ప్రాచీన పురావస్తు ప్రదేశాలలో ఒకటి. అరుణాచల ప్రదేశ్లోని ఇదు మిష్మీ తెగ వారికి ఈ ప్రాంతం పవిత్ర వారసత్వ ప్రాంతం. ఈ ప్రాంతంలో జరిగిన తవ్వకాలలో ఈ కోట నుండి ఎన్నో టెర్రకోట ఫలకాలు, టెర్రకోట బొమ్మలు, అలంకరణ పలకలు, మృణ్మయ పాత్రలు వంటి కళాఖండాలను కనుగొన్నారు.