సింధుదుర్గ్ మహారాష్ట్ర లోని కొంకణ్ ప్రాంతంలో ఉంది. ఈ కోట మాల్వాన్ యొక్క తీరం వెంబడి చిన్న ధీవిలో ఉండి రత్నగిరి జిల్లాకి చెందివున్నది . ఒక వైపున పశ్చిమ కనుమలు మరియకవైపున అరేబియా సముద్రం చూడవచ్చు, సింధుదుర్గ్ దాని బీచ్లు, కయ్యి, జలపాతాలు, కోటలు మరియు తీర్ధయాత్ర కేంద్రాలు కలిగి దాని సహజ అందం ప్రసిద్ధి చెందింది.
సింధుదుర్గ్ అను పేరు రెండు పదాల కలయిక ద్వారా ఏర్పడినది సింధూ అనగా సముద్రం, మరియు దుర్గ్ అనగా కోట, అను పదాల యొక్క కలయిక. ఇది గొప్ప మరాఠా యోధుడు రాజా చత్రపతి శివాజీ నిర్మించారు. అతను విదేశీ శక్తులను ఎదుర్కోవడానికి తన వ్యూహాత్మక ప్రయోజనం సరిపోయేందుకు, మరియు శత్రువులనుఏధుర్కోవడానికి సిద్దిస్ యొక్క మురుద్-జంజీర ఉంచడానికి ఈ రాతి ద్వీపాన్ని ఎంచుకున్నాడు. ఈ కోట యొక్క అందం సహజసిద్ధంగా అరేబియా సముద్రం నుండి వచ్చినది, శత్రువులకు కనిపించే వీలు లేని పరిజ్ఞానంతో నిర్మించబడియున్నది.
ఇక్కడ ప్రధాన ఆకర్షణలు సముద్రతీరాలు (బీచ్లు) అని ప్రత్యేకంగ చెప్పనవసరంలేదు, అనేక సంఖ్యల్లో కోటలు ఉన్నాయి అవి సుమరు 17 వ శాతాబ్దంనాడు నిర్మించిబడినవి, సింధుదుర్గ్ మహారాష్ట్ర యొక్క అత్యంత ముఖ్యమైన సముద్రతీరపు కోటలలో ఒకటి.. సింధుదుర్గ్ కోట 42 కోట బురుజులతొ ఒక విచిత్రమైన కోట గొడతో నిర్మించబడి ఉంది. ఈ కోట యొక్క నిర్మాణ పదార్థం కూడా సుమారు 73.000 కిలోల ఇనుము కలిగి ఉంటుంది. ఒకానొక సమయంలో సముద్రం మార్గం ద్వారా ప్రయానం పవిత్ర హిందూ మతం గ్రంధములను ద్వారా నిషేధించారు,
ఈ భారీ నిర్మాణం మరాఠా రాజు యొక్క విప్లవాత్మక భావాలను సూచిస్తుంది. ఈ రోజు వరకు, ప్రపంచంలోని నుండి పర్యాటకులు ఈ మరాఠా కీర్తి వైభవాలకు సాక్ష్యాలైన పద్మాగర్హ్ కోట సందర్శించడం జరుగుతుంధి. దేవ్బౌగ్ వద్ద విజయ్దుర్గ్ కోట , తిలారి ఆనకట్ట, నవదుర్గ ఆలయం ఈ ప్రాంతంలో తప్పనిసరిగా చూడవలసిన ఇతర ఆకర్షణలు. సింధుదుర్గ్ కూడా భారతదేశం యొక్క పురాతన సాయి బాబా దేవాలయాలలో ఒకటిగా ఉంది.
సింధుదుర్గ్ - చరిత్ర, ప్రకృతి మరియు ప్రతిదీ సుందరమయం
ఈ ప్రాంతం అంతా గొప్ప పర్వతాలు, అసాధారణమైన సమూద్రం, మరియు ఒక అద్భుతమైన ప్రాకృతిక దృశ్యంతో , ఈ స్థలం అల్ఫోనొస్ మామిడికాయలు, జీడిపప్పు, జామకాయలు, మొదలగువాటితో ప్రసిద్దిచెందినది, ఒక మామూలు ఎండ రోజున దాదాపు 20 అడుగుల లోతు వరకు స్పష్టమైన సముద్ర-ఒడ్డుని చూడవచ్చు. భారతీయ మరియు విదేశీ పర్యాటకులు ఈ ప్రాంతం అన్వేషిస్తు స్కూబ డైవింగ్ మరియు స్నార్కెల్లింగ్ చేయడానికి వుత్సాహపడతారు ద్వీపం పొలిమేరలలో అన్యదేశ పగడపు దిబ్బలు చూసేవారికి కనులవింధుగా ఉంటుంది .
జిల్లా ప్రాంతంలో ఎక్కువ భాగం దట్టమైన అరణ్యాలతో వివిద వృక్షజాలం మరియు జంతుజాలం తో నిండి ఏ ప్రకృతి ప్రేమికులనైనా సమ్మోహపరచేవిదంగా ఉంతుంది .ఈ అడవిలో చిరుత, అడవి పంది, ముంగిస, అడవి కుందేలు, ఏనుగులు, అడవి దున్నలు మరియు కోతులు వంటి అడవి జంతువుల ఆతిద్యం ఇస్తాయి.
ఈ ప్రాంతం దాని యొక్క ప్రత్యేక మాల్వాని వంటకాలకు చాలా ప్రసిద్ధి చెందింది. పర్యటకులు తప్పనిసరిగా సందర్శించవలసిన ప్రదేశము. ఇక్కడ సముద్ర ఆహార పదార్ధాలు యొక్క విలాసవంతమైన వంటకాలను, ముఖ్యంగా చేపలు మరియు రొయ్యలు, వారి స్వంత స్థానిక రుచులతొ చేసిన వంటకాలను తప్పనిసరిగా రుచిచూడవలసిందే..
సింధుదుర్గ్ ఒక ఆనందకరమైన ప్రశాంతకరమైన ప్రదేశము ? ఎందుకు
సింధుదుర్గ్ యొక్క ప్రాంతం ఆర్ద్రత గల వాతావరణం కలిగి ఉన్నది .. వేసవిలో సాధారణంగా చాలా వేడిగా ఉంటుంది. పర్యటకులు ప్రయాణం చేయడానికి చలికాలం ఆహ్లాదకరంగా ఉంటుంది, ప్రత్యేకంగా డిసెంబరు మరియు జనవరి, నెలలలో ప్రయాణం చేయడమ్ సూచించదగినధి..
ముంబై నగరం నుండి 400 కి.మీ. దూరంలోఉన్న సింధుదుర్గ్ నకు సులభంగా వాయు , రోడ్ మరియు రైలు మార్గాలద్వారా చేరుకోవచ్చును. అధిక సంఖ్యలో బస్సులు మహారాష్ట్ర లోని నగరాలనుండి అలాగే మహారాష్ట్ర బయట నుండి అందుబాటులో ఉన్నాయి. జాతీయ రహదారి 17 ఈ ప్రాంతంలో గుండా వెళ్తుంది . సింధుదుర్గ్ ముంబై, గోవా మరియు మంగుళూరు వంటి ప్రధాన ప్రదేశాలలోంచి రైలు లేదా బస్సు ద్వారా చేరుకోవచ్చు. గోవా విమానాశ్రయం, 80 కి.మీ. దూరంలో ఉంది ,ఇది సింధుదుర్గ్ చేరుకోవడానికి దగ్గరధారి.
మనోహరమైన సముద్రతీరం వెంబడి నడుస్తూ దాని చారిత్రాత్మక వైభవం చూస్తూ సేదతీరవచ్చు - సింధుదుర్గ్ అన్నీరకాల యాత్రికుల కోసం సంసిద్దంగా ఉంది . ఈ కోట మీ కోసం భద్రపరచిన జ్ఞాపకాలను మిస్ అవకండి..