ఉత్తర ప్రదేశ్ లో శ్రావస్థి గౌతమ బుద్ధుని కాలంలో భారతదేశంలో ఉన్న ఆరు అతిపెద్ద నగరాలలో ఒకటిగా ఉన్నది. ఈ నగరంనకు మహాభారతంలోని పురాణ రాజు శ్రవస్త పేరు పెట్టబడింది అని నమ్ముతారు. అయితే బౌద్ధమత పురాణం ప్రకారం అక్కడ నివసించిన సేజ్ శావత్త పేరు నుండి పెట్టారని చెప్పుతారు.
శ్రావస్థి మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలుశ్రావస్థి బౌద్ధులు కోసం ఒక పెద్ద పుణ్యక్షేత్రం మరియు భారతదేశం నుండే కాక శ్రీలంక, జపాన్, చైనా, మరియు థాయిలాండ్, బౌద్ధమత ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను ఆకర్షిస్తుంది. బుద్ధుడు శ్రావస్థి లో తన నివసించే సమయంలో జేతవన ఆశ్రమంలో గరిష్ట సంవత్సరాల పాటు గడిపారు. నగరమునకు అయన మొదటి సందర్సన అనతపిందిక ఆహ్వానం మీద వచ్చారు. రాజ భవన కోటను అనతపిందిక నిర్మించారు. ఈ కోట రప్తి నది వెనక ఉండి అనేక ద్వారాలు మరియు నాలుగు ఉన్నత కోట భురుజులతో, ఇటుక గోడ తో అధిక మట్టితో కట్టబడి ఉంది.
ఈ ప్రాంతంలో ఆధార వేదికలు మరియు స్తూపాలు, మఠాలు మరియు ఆలయాలు ,అనేక బౌద్ధ నిర్మాణాల పునాదులు ,సహేత్ శిధిలాలు మొదలైనవి త్రవ్వకాలలో బయటపడినవి. ఈ జిల్లా ప్రాంతంలో బల్రాంపూర్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది. గొప్ప సాహిత్య ప్రకృతి దృశ్యంనకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మీరు కూడా పయగ్పూర్ మరియు ఖరగ్పూర్ ప్రాంతాల యొక్క చాలా అందమైన గ్రామాలను సందర్శించవచ్చు.
చరిత్రరాప్తి నది ఒడ్డున ఉన్న శ్రావస్థి రాజధాని అయిన కోసల రాజ పీఠాన్ని బుద్ధుని యొక్క శిష్యుడు అయిన రాజు పసేనది పాలించేను. ఇక్కడ జ్ఞానులు మరియు సన్యాసుల జీవితంలో ఎక్కువ భాగం గడుపుతారని నమ్మకము ఉన్నది. అనేక మఠాలు,పసేనది నిర్మించిన జేతవన,పుబ్బరమ మరియు రాజకరమ ఆశ్రమాలను ఇక్కడ ఉన్నాయి.
అనతపిందిక స్థూపం, అన్గులిమల స్థూపం, మరియు ఒక జైన తీర్థంకరుడుకి అంకితమైన ప్రాచీన దేవాలయం ఉన్నాయి. ఈ రోజుకి సవత్తి నగరం గోడలు, ఇంకా మూడు పురాతన భవనాలు అవశేషాలు కలిగి నిలిచి ఉన్నాయి. గేట్లు వెలుపల మరొక స్థూపం ట్విన్ మిరాకిల్ ఉంది.
బుద్ధుడు 25 వర్షాకాలాలలో శ్రావస్థి లో ఉన్న జేతవన ఆశ్రమంలో 19 కాలాలు, పుబ్బరమ ఆశ్రమంలో 6 కాలాలు గడిపారని భక్తుల విశ్వాసం. ఈ ప్రదేశంలో అయన సంభాషణలు మరియు సూచనలను గరిష్ట సంఖ్యలో ఇచ్చారు.
శ్రావస్థి జైన్ సంఘానికి ప్రాముఖ్యతను కలిగి ఉంది. మూడవ జైన తీర్థంకరుడైన సంభావ్నాథ్ ఇక్కడ జన్మించాడని నమ్ముతారు.
శ్రావస్థి వాతావరణము
శ్రావస్థి సందర్శించడానికి వాతావరణము ఆహ్లాదకరమైన మరియు తేలికపాటిగా ఉండే అనువైన సమయం నవంబర్ నుండి ఏప్రిల్ వరకు ఉంటుంది. శ్రావస్థి బౌద్ధుల మరియు జైనుల కు ప్రధాన పుణ్యక్షేత్రముగా ఉంది. సంవత్సరం పొడవునా సందర్శకులను ఆకర్షిస్తుంది.
శ్రావస్థి చేరుకోవడం ఎలా
శ్రావస్థిని రోడ్డు మరియు రైలు ద్వారా సమీపంలోని నగరాల ద్వారా చేరవచ్చు. సమీప విమానాశ్రయం లక్నో విమానాశ్రయం.