తడియాండమోల్ కర్నాటకలో రెండవ ఎత్తైన శిఖరం. ఇది పడమటి కనుమలలో ఉంది. కూర్గ్ జిల్లాలో కక్కాబే పట్టణానికి సమీపంలో ఉంది. ఇది సరిగ్గా కేరళ - కర్నాటక సరిహద్దులలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 1748 మీటర్ల పొడవున ఉంటుంది. ఈ శిఖరం ట్రెక్కర్లకు, పర్వతారోహకులకు ఎంతో సవాలుగా ఉంటుంది.
తడియాండమోల్ లో చూడదగిన ప్రదేశాలేమిటి? తడియాండమాల్ అంటే పెద్ద పర్వతం అని మళయాళ భాషలో అర్ధంగా చెపుతారు. ట్రెక్కింగ్ పట్ల ఆసక్తి లేనివారికి సగం దూరం కార్లలో వెళ్ళవచ్చు. అయితే, చివరి కొద్ది దూరం కష్టంగా ఉంటుంది. అయినప్పటికి శిఖరం పైకి ఎక్కి చూస్తే పడిన కష్టం అంతా పోయి ఎంతో ఆనందం కలుగుతుంది.
ఈ పర్వత మొదటి లేదా కింది భాగంలో గల నలక్కండ్ ప్యాలెస్ కు చారిత్రక ప్రాధాన్యం కలదు. దీనిని 1792 లో దొడ్డ వీర రాజేంద్ర తన సైనికులకు సురక్షిత వసతి కొరకు నిర్మించారు. శిఖరం చేరే కొద్ది కిలోమీటర్ల ముందరగా ట్రెక్కర్లు పురాతన పడిలఘుతప్ప దేవాలయంలో కొద్ది సేపు విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ దేవాలయం స్ధానికులకు ఎంతో పవిత్రమైన దేవాలయంగా చెపుతారు. శిఖర ఏటవాలులలోని షోలా అడవులు చాలా ప్రాచీనమైనవి మరియు ఇంతవరకు ఎవరూ చొరబడనివిగా చెపుతారు.
తడియాండమోల్ కు కేరళ మరియు కర్నాటక రాష్ట్రాలనుండి తేలికగా చేరవచ్చు. దీనికి సమీప ఎయిర్ పోర్ట్ 321 కి. మీ. ల దూరంలో బెంగుళూరు లో కలదు. దీనికి సమీప రైలు స్టేషన్ 263 కి.మీ.ల దూరంలో బెంగుళూరులో కలదు. బెంగుళూరు నుండి తడియాండమోల్ కు అయిదుగంటల సమయంలో టాక్సీలలో చేరవచ్చు.