తింగలూర్ ఒక చిన్న, అందమైన పట్టణం, ఇది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఈ పట్టణం తంజావూర్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది, మంచి నెట్వర్క్ ఉన్న రహదారి ద్వారా దీనిని తేలికగా చేరుకోవచ్చు, తింగలూర్, చెన్నై, కోయంబత్తూర్, కుంబకోణం, మదురై వంటి కొన్ని ప్రధాన నగరాలతో బాగా అనుసంధారించాబడి ఉంది.
ఈ స్థలం ఇక్కడున్న కైలాసనాధ ఆలయానికి దేశవ్యాప్తంగా ప్రసిద్ధిచెందింది. ఈ కైలాసనాథ్ ఆలయంలో చంద్రుని విగ్రహం ఉంది. శివుడు, దక్షప్రజాపతి శాపం నుండి చంద్రుడిని రక్షించి, తమ జాతకంలో చంద్రుడు సరైన స్థానంలో లేని కారణంగా ఎవరైతే బాధపడుతున్నారో వారికి సహాయం చేయడానికి తింగలూర్ లో ఉండమని శివుడు చంద్రుడిని కోరాడని పౌరాణిక కధనం. ఈరోజు, అనేక వేలమంది ప్రజలు తమ జ్యోతిశాస్త్ర జన్మ పట్టికలో చంద్రుడి వల్ల వచ్చే చెడు ప్రభావాలు పారద్రోలడానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు.
మతసంబంధ ప్రాముఖ్యతలు
పురాణాల ప్రకారం, తొమ్మిది నవగ్రహ ప్రాంతాలలో ఒకటిగా ఉన్న ఈ పట్టణం మతసంబంధ విషయాలకు ముఖ్యమైనది. ఈ ఆలయం కావేరీ నదిఒడ్డున ఉంది, ఈ నది డెల్టా ప్రాంతంలో ఉంది.
ప్రయాణానికి సౌకర్యవంతమైన & ఉత్తమ సమయం
తింగలూర్ కి రోడ్డుద్వారా తేలికగా చేరుకోవచ్చు, ఇక్కడ విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్ లేదు. తింగలూర్ వెల్లిరావడానికి రాష్ట్రప్రభుత్వ బస్సులు ఏర్పాటుచేయబడ్డాయి. బస్సులు క్రమ అంతరాలలో అనేక ప్రాంతాలకు తింగలూర్ ప్రధాన బస్ స్టాండ్ నుండి బయలుదేరుతాయి. అయితే, బస్సులు రద్దీగా ఉంటాయి కాబట్టి మీరు టికెట్లను ముందే బుక్ చేసుకోవడం ఉత్తమం. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల శీతాకాల సమయంలో ఈ పట్టణాన్ని సందర్శించడం ఉత్తమం.