భారత ఉపఖండం మొత్తం దేవాలయాలతో నిండిపోయి వుంది.
ప్రతీ కొన్ని మైళ్ళ దూరానికి చిన్నదో ! పెద్దదో ! ఆలయం వుంటుంది.
హిందు పురాణాల ప్రకారం కొన్ని దేవాలయాలు అత్యంత పురాతనమైనవి.
వీటిలో కొన్నింటిని ఒక్క రాత్రిలో నిర్మించారట.
ఆలయాలను నిర్మించాలంటే చాలా ఏళ్ళు శ్రమించాల్సి వుంటుంది.
వీటిని ఒక్క రాత్రిలోనే నిర్మించటం ఆషామాషీ కాదు.
మీకు తెలుసా? ఈ ఆలయాలన్నీ ఒక్కరాత్రిలోనే నిర్మించారు!
1. గోవిందదేవ్ జై మందిరం
ఉత్తరప్రదేశ్ లోని బృందావనంలో కృష్ణుడు కొలువుండే గోవిందదేవ్ జై మందిరాన్ని ఒక్క రాత్రిలోనే నిర్మించారట.
PC:youtube
గోవిందదేవ్ జై మందిరం
ఈ ఆలయం శ్రీకృష్ణ లీలల గురించి తెలియజేస్తుంది.
PC:youtube
గోవిందదేవ్ జై మందిరం
దేవతలు,రాక్షసులు కలిసి ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి.
PC:youtube
గోవిందదేవ్ జై మందిరం
దగ్గరగా చూస్తే ఇది అసంపూర్తి నిర్మాణంగా కనిపిస్తుంది.
PC:youtube
గోవిందదేవ్ జై మందిరం
ఆలయ నిర్మాణం జరుగుతుండగా ఏదో అలికిడి రావడంతో తమ ఉనికి బయటపడుతుందని దేవతలు దీనిని అర్ధాంతరంగా వదిలి వెళ్లారనే కధలు ప్రచారంలో వున్నాయ్.
PC:youtube
2. హతియాదేవల్ ఆలయం
ఉత్తరాఖండ్ లో హతియాదేవల్ ఆలయంలో శివలింగం దక్షిణాభిముఖంగా వుంటుంది.
PC:youtube
హతియాదేవల్ ఆలయం
ఈ శివాలయాన్ని కూడా ఒక్క వ్యక్తి ఒక్క రాత్రిలోనే నిర్మించాడట.
PC:youtube
భోజేశ్వర్ మందిరం
మధ్యప్రదేశ్ లోని భోజేశ్వర్ మందిరాన్ని ద్వాపరయుగంలో పాండవులు నిర్మించారట.
PC:youtube
భోజేశ్వర్ మందిరం
దీనికి వారి తల్లి కుంతీ కూడా సాయపడిందట.
PC:youtube
కాకన్ మఠ్ ఆలయం
మధ్యప్రదేశ్ లోని మోరేనా ప్రాంతంలో కాకన్ మఠ్ ఆలయాన్ని కూడా శివుని భక్తులైన రాక్షసుల ఆధ్వర్యంలో నిర్మాణం జరిగిందట.
PC:youtube
కాకన్ మఠ్ ఆలయం
ఒక్క రాత్రిలో జరిగిన ఈ ఆలయ నిర్మాణంలో ఎలాంటి సున్నం గానీ,సిమెంటు గానీ వాడలేదట.
PC:youtube
దేవఘడ్
జార్ఖండ్ లోని దేవఘడ్ నిర్మాణాన్ని విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి.
PC:youtube
దేవఘడ్
ఒకే రాత్రిలో నిర్మాణం జరిగిన వీటిలో పార్వతీదేవి మందిరం అసంపూర్తిగా వుండిపోయింది.
PC:youtube
విష్ణోబైద్యనాథ్ ఆలయాలు
అలాగే చుట్టూవుండే విష్ణోబైద్యనాథ్ ఆలయాలు కూడా చాలా చిన్నవి.
PC:youtube
బైద్యనాథ్ ఆలయం
జ్యోతిర్లింగాలలో ఒక్కటైన బైద్యనాథ్ ఆలయం కూడా ఒక్క రాత్రిలోనే నిర్మాణం జరిగిందట.
PC:youtube