Search
  • Follow NativePlanet
Share
» »శివుడు "బాబా వైద్యనాథ్" గా దర్శనమిచ్చే చితా భూమిని దర్శిస్తే సర్వరోగాలు మాయం

శివుడు "బాబా వైద్యనాథ్" గా దర్శనమిచ్చే చితా భూమిని దర్శిస్తే సర్వరోగాలు మాయం

శివుడు "బాబా బైద్యనాథ్" గా దర్శనమిచ్చే చితా భూమి

హిందూ పురాణాల ప్రకారం భారతదేశంలో ఉన్న కొన్ని దేవాలయాలు అత్యంత పురాతనమైనవి. వాటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకటి. కొన్ని ప్రత్యేక కారణాలతో ఆ పరమేశ్వరుడు కొన్ని స్థలాలలో జ్యోతి రూపంలో సాక్షాత్కరించిన వెలసిన వాటిని జ్యోతిర్లింగ స్థలాలుగా పేర్కొన్నారు. గతంలో ఇవి అరవైనాలుగుం ఉండేవి. కలియుగానికి పన్నెండుగా మిగిలాయని తెలుస్తోంది. వీటినే ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పిలుస్తుంటారు.

ద్వాదశ జ్యోతిర్లింగాలు వరుసగా సోమనాథ్(గుజరాత్), శ్రీశైలం (ఆంధ్రప్రదేశ్), మహాకాలేశ్వరం (ఉజ్జయిని, మధ్య ప్రదేశ్), ఓంకారేశ్వర్ (మధ్య ప్రదేశ్), కేదారనాథ్ (ఉత్తరా ఖండ్), భీమేశ్వరం(పూణే, మహారాష్ట్ర), వారణాశి (ఉత్తర ప్రదేశ్), త్రయంబకేశ్వరం (నాసిక్, మహారాష్ట్ర), నాగేశ్వరం (ద్వారకా, గుజరాత్), రామేశ్వరం (తమిళనాడు ), గృహ్నేశ్వరం (ఎల్లోరా, మహారాష్ట్ర), మరియు వైద్యనాధ్ ధామం ( దేవ ఘర్, ఝార్ఖండ్).

మిగిలిన పదకొండు క్షేత్రాలలో లేని కొంత సందిగ్థ పరిస్థితి వైద్యనాథ్ ధామం స్థల నిర్ణయం విషయంలో నెలకొని ఉంది. మహారాష్ట్రలోని పర్లిలో గల ఆలయాన్ని కూడా వైద్యనాథ్ ధామంగా పిలుస్తారు. దానినే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటని స్థానికులు వాదిస్తుంటారు. అయితే శివపురాణం , భవిష్యపురాణం , మత్సపురాణం, దేవీ భాగవతంతో పాటు జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆది శంకరులు రచించిన శ్లోకాల ఆధారంగా ఝార్ఖండ్ లో ఉన్న దానినే సరి అయిన ఆలయంగా నిర్ణయించడం జరిగింది.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరో బైద్యనాథ్ ఆలయం ఉండటం విశేషం. అక్కడి వారు దానిని ద్వాదశ లింగ రూపంగా భావిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో భాగం కాకపోయినా ఈ రెండూ కూడా మహిమాన్విత క్షేత్రాలే!! ఝార్ఖండ్ మరియు మహారాష్ట్రలలోని ఈ రెండు ఆలయాల పురాణ గాథ ఒకటే కావడం మరో విశేషం!

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో శ్రీ బైద్యనాథ్ క్షేత్రం ఒకటి

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో శ్రీ బైద్యనాథ్ క్షేత్రం ఒకటి

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో శ్రీ బైద్యనాథ్ క్షేత్రం ఒకటి. పూర్వం దేవగృహం అనే పేరు ఉన్న ఈ ప్రదేశాన్ని దేవఘర్ అని పిలిచేవారు . అది కాలక్రమంగా దియోగర్ గా మారింది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 12వ జ్యోతిర్లింగం బైద్యనాథ్.

 కట్నీపూర్ దగ్గరలో ఉన్న ఈ క్షేత్రంలో శివుడు

కట్నీపూర్ దగ్గరలో ఉన్న ఈ క్షేత్రంలో శివుడు "బాబా బైద్యనాథ్" గా

బైద్యనాథ్ పుణ్యక్షేత్రం జార్ఖండ్, మహారాష్ట్రలో "దియోఘ్" లో ఉంది. ఇది భారతదేశం యొక్క జ్యోతిర్లింగాలలో ఒకటి. కట్నీపూర్ దగ్గరలో ఉన్న ఈ క్షేత్రంలో శివుడు "బాబా బైద్యనాథ్" గా దర్శనమిస్తాడు. ఈ రెండింటి నేపథ్యమూ రామాయాణాంతర్గత రావణాసురిడి కథతో ముడిపడి ఉంది. ఈ లింగాన్ని పూజించే వారికి వ్యాధులు నయం కావడం వల్ల శ్రీ వైధ్యనాథేశ్వరుడిగా పిలుస్తున్నారు.

వైధ్యనాథుడేనే అమృతేశ్వరుడు

వైధ్యనాథుడేనే అమృతేశ్వరుడు

వైధ్యనాథుడేనే అమృతేశ్వరుడు -పర్లి (కాంతిపూర్), దేవొగడ్ బీహార్-బ్రహ్మ, వేణు, సరస్వతీ నదుల సమీపంలో ఉన్నది. సహ్యాద్రి కొండల అంచునున్న ఉంది. అమృతమధనానంతరము ధన్వంతరిని, అమృతమును ఈ లింగములో దాచారని, ఈ లింగాన్ని స్పృశించిన భక్తులకు అమృతము లభించుననే నమ్మకం భక్తులలో ఉంది.

 శ్రీ వైద్యనాథ్ ఆలయం ఎత్తుగా రాతితో నిర్మించి ఉంది

శ్రీ వైద్యనాథ్ ఆలయం ఎత్తుగా రాతితో నిర్మించి ఉంది

జ్యోతిర్లింగాల్లో ఒకటైన బైద్యనాథ్ ఆలయం ఒక రాత్రిలోనే నిర్మించారట. ఈ ఆలయానికి ఉత్తరదిశలో ఉన్న శివగంగ చెరువులో స్నానాలు ఆచరించి శ్రీ వైద్యనాథున్ని దర్శించుకుంటారు. శ్రీ వైద్యనాథ్ ఆలయం ఎత్తుగా రాతితో నిర్మించి ఉంది. లోపలికి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంటుంది. ఈ ఆలయం శిఖరం అంతా బంగారు తొడుగుతో మెరుస్తుంటుంది. బైద్యనాథ్ ఆలయ ప్రాంగణమంతా చాలా విశాలంగా ఉంటుంది.

ప్రధాన ఆలయంతో పాటు ఇక్కడ 21 దేవాలయాలు కలిసి ఒక సముదాయంగా

ప్రధాన ఆలయంతో పాటు ఇక్కడ 21 దేవాలయాలు కలిసి ఒక సముదాయంగా

"గిధవుర్" వంశ రాజు "రాజా పురాణ సింగ్" ప్రస్తుత ఆలయాన్ని నిర్మించినట్లుగా చెబుతారు. నివాస, వ్యాపార సముదాయాల మధ్యన ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయంతో పాటు ఇక్కడ 21 దేవాలయాలు కలిసి ఒక సముదాయంగా వున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్యులవారు , ద్వజస్తంభం, నంది మండపం, కేదారేశ్వర, ఓంకారేశ్వరుడు, మహాకాళేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు, భీమశంకరుడు, కుబేరుడు నరసింహస్వామి, దత్తాత్రేయ స్వామివారు, నాగనాద్ మందిరం కూడా ఉన్నాయి. నాగనాద్ మందిరం సమీపంలో శ్రీ వీరభద్ర స్వామి మందిరం కూడా ఉంది.

గర్భగుడిలో జయదుర్గ త్రిపుర సుందరీదేవీ అమ్మవారు

గర్భగుడిలో జయదుర్గ త్రిపుర సుందరీదేవీ అమ్మవారు

గర్భాలయం బయట వినాయకుడు, కుడివైపు తుల్జాభవానీ, రేణుకామాత దర్శనమిస్తారు. గర్భగుడిలో జయదుర్గ త్రిపుర సుందరీదేవీ అమ్మవారు దర్శనమిస్తారు. ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఒక్కడ సతీదేవి హృదయం పడిందని అంటుంటారు. గర్భగుడిలో రెండు అడుగుల శివలింగం ఉంటుంది. శివలింగం పక్కన పార్వతీదేవి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు.

వైద్యనాధ్ ధామం యొక్క ప్రత్యేకత మరోకటున్నది

వైద్యనాధ్ ధామం యొక్క ప్రత్యేకత మరోకటున్నది

వైద్యనాధ్ ధామం యొక్క ప్రత్యేకత మరోకటున్నది. ఇది యాభై ఒక్క శక్తి పీఠలాలో ఒకటిగా గుర్తింపు పొందినది. దక్ష యజ్ఞం సరంభానికి పిలవని పిలుపుగా పుట్టింటికి వెళ్ళిన సతీ దేవి అవమానానికి గురై యజ్ఞ గుండంలో దూకి ప్రాణత్యాగం చేసింది. దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన తరువాత సర్వేశ్వరుడు సతీ దేవి శరీరాన్ని భుజాన వేసుకొని విరాగిగా తిరగ సాగారు.

 శక్తి పీఠం

శక్తి పీఠం

లయకారుని తిరిగి ఇలలోనికి తేవడానికి శ్రీ మహా విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీ దేవి శరీరాన్ని ఖండించారు. ఆ శరీర భాగాలు భువిలోని వివిధ ప్రాంతాలలో పడినాయి. అవే శక్తి పీఠాలుగా పేరొందాయి.
వైద్యనాధ్ ధామం కాకుండా జ్యోతిర్లింగాలతో పాటు ఒక శక్తి పీఠాలుగా గుర్తింపు పొందిన క్షేత్రాలు వారణాశి మరియు శ్రీశైలం.

 భక్తులు తమ కోరిక నెరవేరిన తరువాత ఎఱ్ఱని దారాలతో

భక్తులు తమ కోరిక నెరవేరిన తరువాత ఎఱ్ఱని దారాలతో

ఇక్కడ అమ్మ వారి హృదయ భాగం పడినది. అందువలన గతంలో "హర్ష పీఠ"గా పిలిచేవారు. శ్రీ జయ దుర్గా దేవి అమ్మవారి ఆలయం శ్రీ వైద్యనాధ స్వామి ఆలయానికి ఎదురుగా ఉంటుంది. అర్ధనారీశ్వర తత్వానికి ప్రతి రూపమైన శివ శక్తి స్వరూపాలను కలపాలన్న తలంపుతో భక్తులు తమ కోరిక నెరవేరిన తరువాత ఎఱ్ఱని దారాలతో రెండు ఆలయాలను అనుసందిస్తారు.

ఈ దేవాలయం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది.

ఈ దేవాలయం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది.

ఈ దేవాలయం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. ఈ దేవాలయంలో శ్రీ బైద్యనాథ్ స్వామి వారికి నిత్య పూజలు, రుద్రాభిషేకాలు, ప్రతి సోమవారం రాత్రి సమయంలో స్వామివారి ఊరేగింపు, మహాశివరాత్రి సమయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి.శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం రోజున, అమావాస్య, పౌర్ణమి, మాస శివరాత్రి రోజులలో విశేష అభిషేకాలు నిర్వహిస్తారు.
శ్రావణ మరియు కార్తీక మాసాలలో శ్రీ వైద్యనాదునికి నిరంతర అభిషేకాలే!శ్రావణ మాసమంతా వైధ్యనాదంలో అధ్యాత్మికతో కూడిన పండుగ వాతావరణం నెలకొంటుంది.గంగాధరునికి నిరంతర గంగాభిషేకమే శ్రావణం అంతా !!

దేవఘర్ లో బైద్యనాథ్ మహాదేవుడు అని రావణేశ్వర వైద్యనాద్ అని పిలుస్తారు

దేవఘర్ లో బైద్యనాథ్ మహాదేవుడు అని రావణేశ్వర వైద్యనాద్ అని పిలుస్తారు

దేవఘర్ లో బైద్యనాథ్ మహాదేవుడు అని రావణేశ్వర వైద్యనాద్ అని పిలుస్తారు. దేవతలు, వైద్యుడైన ధనాత్మరునికి ఒకసారి జబ్బు చేయడంతో అశ్వని దేవతలు శివుడిని పూజింపగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి ఇక్కడ అందుకే శివుడు సర్వరోగాల నివారణ వైద్యనాధుడుగా పిలవబడుతున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X