ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిగురించి విన్నప్పుడల్లా అక్కడి తిరుపతి గురించి అక్కడ ఏడుకొండలపై వేంచేసిన వేంకటేశ్వరుని ఆలయమే గుర్తుకు వస్తుంది. భక్తులు కూడా అక్కడ వేంకటేశ్వరుని దర్శించుకునుటకే ఎక్కువగా అక్కడకు వెళ్తూవుంటారు. అయితే అదే తిరుపతి పరిసర ప్రాంతాల్లో గుడి మల్లం అనే ప్రాంతం ఒకటుంది. అక్కడ ప్రాచీన శివాలయం కూడా ఒకటి వుంది.
ఆ శివాలయం భూమికి 6అడుగుల లోతుకి కృంగిపోయివుంటుంది. ఈ శివాలయం 1వ శతాబ్దానికి చెందినదిగా అక్కడివారు చెబుతున్నారు.ప్రపంచంలోని ఏ శివాలయంలోనూ లేనివిధంగా ఇక్కడ 7అడుగుల శివలింగం వుంటుంది. ఈ శివ లింగం పురుషుని లింగం అనగా పురుషాంగాన్ని పోలివుండటం విశేషం. ఈ లింగంలోనే ఒక చేత్తో గొర్రెని పట్టుకుని యక్షునిభుజాలపై వున్న పరమశివుని ఆకారాన్ని చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
ఎక్కడ వుంది?
గుడిమల్లం, చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలానికి చెందిన ఓ గ్రామము. చారిత్రకంగా ప్రాముఖ్యమైనది. ఇచట ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం ఉంది. ఇది క్రీ .పూ 2 లేదా 3 శతాబ్దములో నిర్మించినట్లు ఇక్కడ బయలుపడిన శాసనాలద్వారా చరిత్రకారులు నిర్ణయించారు. ఈ ఆలయమునకు సంబంధించిన మరికొంత సమాచారము చంద్రగిరి కోటలో గల మ్యూజియంలో లభ్యమవుతున్నది.
PC:youtube
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
ఈ దేవాలయాన్ని కొంతకాలం చంద్రగిరి రాజులు ఉచ్ఛస్థితిలో నిలిపారు. తదనంతర కాలంలో ముస్లిం పాలకులు చంద్రగిరి సంస్థానంతో పాటు ఈ దేవాలయాన్ని కూడా చాలా వరకు పాడు చేసారు. కాకుంటే మూలవిరాట్ స్వామికి మాత్రం హాని కలగలేదు.
PC:youtube
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది.ఈ ఆలయములో గర్భాలయము అంతరాలయము మరియు ముఖమండపముల కన్నా లోతులో ఉంటుంది . ఇక్కడ గర్భగృహములో ప్రతిష్ఠించబడిన శివలింగము లింగ రూపములో కాకుండా శివుడు మానవ రూపములో మహావీరుడైన వేటగాని వలె ఉన్నాడు.
PC:youtube
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
ఈ లింగము ముదురు కాఫీరంగులో ఉన్న రాతితో చేయబడిన మానుష లింగము. లింగము సుమారుగా ఐదు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు కలిగి ఉంది. లింగముపైన ముందువైపు ఉబ్బెత్తుగానూ లింగము నుండి బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా చెక్కబడిన శివుడు, అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన (స్థానకమూర్తి) రూపంలో ఉన్నాడు. స్వామి రెండు చేతులతో ఉన్నాడు.
PC:youtube
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
కుడిచేతితో ఒక గొర్రెపోతు (తలక్రిందుగా) యొక్క కాళ్ళు పట్టుకొనగా, ఎడమచేతిలో చిన్నగిన్నె (చిప్ప) ను పట్టుకొన్నాడు. ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని ఉన్నాడు. స్వామి జటాభార (జటలన్నీ పైన ముడివేసినట్లు) తలకట్టుతో, చెవులకు అనేక రింగులు ఇంకా వివిధ ఆభరణాలు ధరించి, నడుముచుట్టూ చుట్టి, మధ్యలో క్రిందకు వ్రేలాడుతున్నట్లు ఉన్న అర్ధోరుకము (నడుము నుండి మోకాళ్ళ వరకూ ఉండే వస్త్రము) ధరించి ఉన్నాడు.
PC:youtube
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
ఆ వస్త్రము మధ్యలో వ్రేలాడుతున్న మడతలు అతి స్పష్టముగా కనుపిస్తున్నాయి. ఆ వస్త్రము అతి సున్నితమైనది అన్నట్లుగా అందుండి స్వామివారి శరీరభాగములు స్పష్టముగా కనుపిస్తున్నాయి. స్వామికి యగ్నోపవీతం లేకపోవడం ఒక విశేషం. లింగపు అగ్రభాగము మరియు క్రింది పొడవైన స్తంభభాగములను విడదీస్తున్నట్లుగా ఒక లోతైన పల్లము పడిన గీత స్పష్టముగా ఉండి, మొత్తము లింగము, పురుషాంగమును పోలి ఉంది.
PC:youtube
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
ఈ లింగము, అతిప్రాచీనమైన లింగముగా గుర్తించబడింది. ఆకాలపు శైవారాధనకు ఒక ఉదాహరణగా కూడా గుర్తించబడింది. గుడిమల్లం 2009 వరకు వురావస్థు శాఖ వారి ఆధీనంలో ఉంది. పూజా పునస్కారాలు ఏవీ జరగలేదు. కనుక ప్రజలు ఎక్కువగా రాలేదు. పురావస్తు శాఖ వారి ఉద్యోగి ఒకరు దానికి సంరక్షకుడిగా వుండి అరుదుగా వచ్చే సందర్శకులకు చూపిస్తూ ఉంటారు.
PC:youtube
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
గుడిమల్లం చిన్న పల్లెటూరు. తిరుపతికి సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని పరశురామేశ్వారాలయం అని కూడా అంటారు. అంత దూరం వెళ్ళి చూడ లేని వారికి ఈ ఆలయంలోని మూల విరాట్టును అన్ని విధాల పోలిన ప్రతి రూపాన్ని చంద్రగిరి కోటలోని ప్రదర్శన శాలలో ప్రదర్శనకు పెట్టారు. అక్కడ దీన్ని చూడవచ్చు.
PC:youtube
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
ప్రపంచంలో అత్యంత పురాతన శివలింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం గ్రామంలో ఉంది. ఇది క్రీస్తుపూర్వం 1వ శతాబ్దపు కాలం నాటిదని చరిత్రకారులంటున్నారు. 1911లో గోపీనాధరావు అనే పురాతన శాస్త్రవేత్త సంవత్సరం పాటు పరిశోధించి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి చాటాడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుష అంగాన్ని పోలి ఉండే ఏడు అడుగుల ఈ శివ లింగం పై ఒక చేత్తో పశువును, మరో చేత్తో గొర్రెను పట్టుకుని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతిరూపాన్ని చెక్కారు.
PC:youtube
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
తలపాగా, దోవతి ధరించిన ఈ రుద్రుని వస్త్రధారణ రుగ్వేద కాలం నాటిదని శాస్త్రకారుల అంచనా. ప్రాచీన శైవపూజా విధానం సవివరంగా తెలిపే ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆలయ గర్భగుడి సైతం గజ పుష్పాకారంలో గంభీరంగా ఉంటుంది.
PC:youtube
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
ఆలయంలో దొరికిన శాసనాలలో దీనిని పరమేశ్వరాలయంగా పేర్కొన్నారు. ఈ లింగం చుట్టూ జరిపిన తవ్వకాలలో క్రీస్తు శకం రెండవ శతాబ్దానికి చెందిన ప్రాచీన గుడి అవశేషాలు బయట పడ్డాయి. గతంలో ఎపుడో ఉజ్జయినిలో దొరికిన రాగి నాణాలపై ఈ అంగాన్ని పోలిన బొమ్మ ఉంది. మధుర మ్యూజియంలో ఇట్లాంటి శిల్పం ఉంది.
PC:youtube
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
పురాణాలలోని కథ తన తండ్రి ప్రోద్బలంతో అతని తల్లి శిరఛ్చేదం పరశురాముడు చెబుతుంది. ఆవేదన నుంచి కోలుకోవడానికి గాను ఋషులు ఒక శివ లింగం వెతికి దానికి పూజించవలసిందిగా సూచిస్తారు. చాలాసార్లు శోధించిన తరువాత, పరశురాముడు ఈఅడవి మధ్యలో ఒక లింగాన్ని గుర్తించి అటుపై ఆలయ సమీపంలోని ఒక చెరువు తవ్వి పూజించుచుండెను.
PC:youtube
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
ప్రతి రోజు ఆచెరువు ఒక దైవిక పుష్పం పెరుగుతూ ఉండగా, దానితో ఆతను శివునికి పూజిస్తూ ఉండేవాడు. ఆ పువ్వును అడవి జంతువుల నుండి కాపాడటం కొరకు ఆతను ఒక యక్షుడుని (చిత్రసేనుడు) కాపలాగా ఉంచుతాడు. అందుకు గాను పరశురాముడు రోజూ ఆతనికి ఒక జీవి, ఆటబొమ్మలను తీసుకొని ఇచ్చేవాడు.ఒకమారు పరశురాముడు లేని సమయంలో చిత్రసేనుడు (బ్రహ్మ భక్తుడు) ఆ పుష్పంతో శివునికి పూజ చేస్తాడు.
PC:youtube
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
పరశురాముడు వచ్చేసరికి పుష్పం లేకపోవడం చూచి కోపోధ్రిక్తుడై చిత్రసేనుడు మీద దెండెత్తుతాడు. ఆ యుద్ధం 14 సంవత్సరాల పాటు కొనసాగింది, అందువల్ల ఆప్రదేశం ఒక పెద్ద గొయ్య, లేదా పల్లం లా తయారి అయింది. అందుకే ఈ ప్రదేశానికి గుడిపల్లం అని పేరు వచ్చింది అందురు. ఆయుధ్ధం ఎంతకీ ముగియక పోవడంతో పరమశివుడు వారిరువురికి ప్రత్యక్ష్యమై వారిరువురిని శాంతపరిచి, వారి భక్తికి మెచ్చి తాను రెండుగా విచ్ఛిన్నమై వారిలో ఏకమవుతాడు.
PC:youtube
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
అందుకు గాని ఇక్కడి లింగము ఒక ఆకారము పరశురాముడు (విష్ణు రూపం) ఒక చేతిలో వేటాడిన మృగముతోటి, రెండవచేతిలో ఒక కల్లుకుండ ఉండినట్లు, మరియు చిత్రసేనుడు (బ్రహ్మ) ముఖముతో, శివడు లింగ రూపముతో మలచబడెనని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఈఆలయానికి సమబంధించి మరియొక రహస్యమైన సన్నివేశం ప్రాచుర్యంలో ఉంది.
PC:youtube
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
ఈ ఆలయంలో మరో అధ్బుత ఉంది. పెరుగుతున్న సూర్యుని కిరణాలు ఉత్తరాయణము మరియు దక్షిణాయనములో రెండుసార్లు ఈ రాతి గోడలపై చెక్కిన గ్రిల్ గుండా ప్రధాన శివలింగం యొక్క నుదిటి నేరుగా వస్తాయి. ఈ శిల్పాన్ని చూసిన చాలామంది చరిత్రకారులు ఇది ఋగ్వేదకాలం నాటిదిగా చెబుతున్నారు.
PC:youtube
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
ప్రస్తుతం మధురైలో వున్న ఒక మ్యూజియంలో క్రీ.పూ.1 వ శతాబ్దానికి చెందినశిల్పం ఒకటుంది.అది ఈ లింగాకారాన్ని పోలివుందని చెబుతున్నారు. ఈ గుడిమల్లం దేవాలయాన్ని గతంలో చంద్రగిరిరాజులు పూజిస్తూ వుండేవారు.ఈ గుడిమల్లం దేవాలయంలోని ఏక శిలపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆకారాలు కనిపిస్తూవుంటాయి.ప్రతి 60 యేళ్ళకి అక్కడ స్వర్ణముఖీనది జలాలు ప్రవహిస్తూవచ్చి అక్కడి స్వామివారి పాదాలను అభిషేకిస్తూ వుంటాయని చెబుతూవుంటారు. ఈ సంఘటన 2005,డిశంబర్ 4 న చూసినట్టు కొందరు చెబుతున్నారు.
PC:youtube
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
ఈ ఆలయంలోని మరోవిశేషం ఏంటంటే
సూర్యునికిరణాలు ఇక్కడి స్వామి వారి పాదాలపై నేరుగా పడతాయి. ఈ గ్రామాన్ని మొదట్లో గుడి మల్లంగా చెప్పేవారు.దీని వెనక ఒక చారిత్రకనేపధ్యంవుంది. అదేమిటంటే తండ్రి అయిన జమదగ్ని ఆదేశానుసారం పరశురాముడు తల్లిఅయిన రేణుకాదేవిని తన గండ్రగొడ్డలితో అంతమొందిస్తాడు.
PC:youtube
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
అయితే రేణుకాదేవి పరమ శివుని దయతో తిరిగి బతుకుతుంది.ఆమె బ్రతికినా తాను తిరిగిచంపాలని కుమిలిపోతూ వుంటాడు.పరశురాముడు.ఋషులు చూసి అతనికి గుడిమల్లం శివాలయంలోని శివుణ్ణి పూజిస్తే తల్లిని చంపినదోషం సమసిపోతుందని చెబుతారు.దాంతో అక్కడికెళ్ళిన పరశు రాముడు గుడిమల్లంలో ఒక చెరువుని తవ్విస్తాడు.
PC:youtube
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
ఆ చెరువులో రోజుకి ఒక పువ్వు పూస్తూ వుంటుంది. ఆ పుష్పంతో ప్రతీరోజూ శివుణ్ణి పూజిస్తూ వుండేవాడు. ఆ పుష్పానికి కాపలాగా ఒక యక్షుణ్ణి నియమిస్తాడు పరశు రాముడు.అలా కాపలాగా వుండేందుకు అంగీకరించిన యక్షుడు రోజుకి ఒక గొర్రెను ఆహారంగా ఇస్తే తాను కాపలాగా వుంటానని యక్షుడు చెబుతాడు.
PC:youtube
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
దానికి అంగీకరించిన పరశురాముడు అలాగే చేస్తూ వుంటాడు. ఒక రోజు పరశురాముడు ఆ ఆలయానికి రావటం ఆలస్యమౌతుంది. దాంతో యక్షుడు ఆ పుష్పాన్ని కోసి తానే శివుణ్ణి పూజిస్తూవుంటాడు.తర్వాత అక్కడికి వచ్చిన పరశురాముడు చెరువులో ఆ పుష్పం కనిపించకపోవడంతో యక్షుణ్ణి అడుగుతాడు.తానే కోసి శివుణ్ణి పూజించానని చెప్పిన యక్షునిపై ఆగ్రహించిన పరశురాముడు యక్షునితో యుద్ధంచేస్తాడు.
PC:youtube
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
వారిద్దరూ చేస్తున్న ఆ భీకరయుద్ధానికి ఆ దేవాలయం భూమిలోకి 6అడుగులు కృంగిపోయిందట.ఆ గుడి పల్లానికి అంటే భూమిలోకి వెళ్ళిపోయిందిగనుక దానిని ఆ రోజు నుంచి గుడిపల్లంగా పిలిచేవారు.కాల క్రమేణా గుడిపల్లంకాస్తా గుడిమల్లంగా మారిపోయింది. ఇది గుడిపల్లం పేరువెనక చారిత్రికనేపథ్యం. మీకు కూడా ఆ గుడిని చూడాలనివుంటే ఇప్పుడే తిరుపతిదగ్గర వున్న గుడి మల్లంగ్రామానికి బయలుదేరండి.
PC:youtube
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు, దేవాలయాలు
గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయములో గర్భాలయము అంతరాలయము మరియు ముఖమండపముల కన్నా లోతులో ఉంటుంది. ఇక్కడ గర్భగృహములో ప్రతిష్ఠించబడిన శివలింగము లింగ రూపములో కాకుండా శివుడు మానవ రూపములో మహావీరుడైన వేటగాని వలె ఉన్నాడు.
PC:youtube
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
ఈ లింగము ముదురు కాఫీరంగులో ఉన్న రాతితో చేయబడిన మానుష లింగము. లింగము సుమారుగా ఐదు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు కలిగి ఉంది. లింగముపైన ముందువైపు ఉబ్బెత్తుగానూ లింగము నుండి బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా చెక్కబడిన శివుడు, అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన (స్థానకమూర్తి) రూపంలో ఉన్నాడు. స్వామి రెండు చేతులతో ఉన్నాడు.
PC:youtube
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
కుడిచేతితో ఒక గొర్రెపోతు (తలక్రిందుగా) యొక్క కాళ్ళు పట్టుకొనగా, ఎడమచేతిలో చిన్నగిన్నె (చిప్ప) ను పట్టుకొన్నాడు. ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని ఉన్నాడు. స్వామి జటాభార (జటలన్నీ పైన ముడివేసినట్లు) తలకట్టుతో, చెవులకు అనేక రింగులు ఇంకా వివిధ ఆభరణాలు ధరించి, నడుముచుట్టూ చుట్టి, మధ్యలో క్రిందకు వ్రేలాడుతున్నట్లు ఉన్న అర్ధోరుకము (నడుము నుండి మోకాళ్ళ వరకూ ఉండే వస్త్రము) ధరించి ఉన్నాడు.
PC:youtube
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
ఆ వస్త్రము మధ్యలో వ్రేలాడుతున్న మడతలు అతి స్పష్టముగా కనుపిస్తున్నాయి. ఆ వస్త్రము అతి సున్నితమైనది అన్నట్లుగా అందుండి స్వామివారి శరీరభాగములు స్పష్టముగా కనుపిస్తున్నాయి. స్వామికి యగ్నోపవీతం లేకపోవడం ఒక విశేషం.
PC:youtube
బయటపడ్డ ఆదిశివలింగం ఎక్కడో తెలుసా ?
లింగపు అగ్రభాగము మరియు క్రింది పొడవైన స్తంభభాగములను విడదీస్తున్నట్లుగా ఒక లోతైన పల్లము పడిన గీత స్పష్టముగా ఉండి, మొత్తము లింగము, పురుషాంగమును పోలి ఉంది. ఈ లింగము, అతిప్రాచీనమైన లింగముగా గుర్తించబడింది. ఆకాలపు శైవారాధనకు ఒక ఉదాహరణగా కూడా గుర్తించబడింది.
PC:youtube
ఎలా వెళ్ళాలి?
తిరుపతి నుంచి రేణిగుంట, తిరుచానూర్ మీదుగా గుడి మల్లం కు చేరవచ్చును.ఈ మార్గంలో 42నిపడుతుంది.
PC:google maps
తిరుమల వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?
వింతగా మారిన చంద్రగిరి కోట రహస్యం..రాణి మహల్ రహస్యం ? అక్కడ గుర్రాలకోసం !
ఆదోని కోట లో చక్రవ్యూహం..12 కోటల మధ్యలో ఉన్న రహస్యం మీకు తెలిస్తే షాక్ అవుతారు !