ఈ సువిశాల భారత దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. అదే విధంగా భారత దేశంలో అనేక తీర్థాలు ఉన్నాయి. ప్రతి తీర్థానికి విశిష్టమైన శక్తి ఉంటుంది. అటువంటి విశిష్ట తీర్థాల్లో ఒక తీర్థం గురించిన పూర్తి వివరాలు మీ కోసం. ఈ తీర్థం గొప్పతనం తెలుసుకున్న తక్షణం మీరు మీ జీవిత భాగస్వామి జతలో అక్కడికి వెళ్లి తప్పకుండా స్నానం చేస్తారు.
సుఖ ప్రసవం కోసం విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తారు.
అయ్యప్పను పెళ్లి చేసుకోవాలనుకొన్న దేవత ఉన్న క్షేత్రం తెలుసా
భార్యా భర్తలు
P.C: You Tube
సాధారణంగా కాపురం అన్న తర్వాత భార్యా, భర్తల మధ్య చిన్నచిన్న గొడవలు సర్వసాధారణం. అయితే ఈ గొడవలు ఒక్కొక్కసారి పెద్దవై పోయి ఆ పవిత్ర బంధాన్ని తెంచేస్తాయి. ఆ ఆలుమగలు విడాకులు కూడా తీసుకొంటారు.
గొడవలకు దూరంగా
P.C: You Tube
అందువల్లే దంపతులు ఇద్దరూ సాధ్యమైనంత వరకూ గొడవలకు దూరంగా ఉండి సర్దుకు పోవాలని చెబుతారు. ఒకవేళ గొడవలు పడినా ఆ గొడవల వల్ల ఏర్పడిన మనస్పర్థలు తొలిగిపోవడానికి ఒక తీర్థం అదే పుష్కరిణిలోని నీళ్లు సహాయం చేస్తాయని చెబుతారు.
మధ్యప్రదేశ్ లో
P.C: You Tube
ఆ పుష్కరిణి భారత దేశంలో ఎక్కడ ఉందో తెలుసుకొందామా? ఈ పవిత్ర పుష్కరిణి భారత దేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివపురి అనే గ్రామంలో ఉంది. ఈ పుష్కరిణిని బాడియా పుష్కరిణి లేదా బాడియా కుండ్ అని పిలుస్తారు.
మనస్పర్థలు
P.C: You Tube
ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే భార్యభర్తల మధ్య ఎటువంటి మనస్పర్థలు ఉన్నా వెంటనే సమసిపోతాయని చెబుతారు. అంతేకాకుండా వారి మధ్య ఎటువంటి మన:స్పర్థలు ఉన్నా వెంటనే తొలగిపోతాయని చెబుతారు.
వర్షాకాలంలో
P.C: You Tube
ఇక్కడికి వెళ్లాలంటే మీరు వర్షాకాలంలోనే వెళ్లాల్సి ఉంటుంది. వేసవి కాలంలో ఈ పుష్కరిణిలో నీరు ఉండదు. అందుకు అనుగుణంగా స్థానిక టూరిజం సంస్థలు ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులో ఉంచుతున్నాయి.