రానున్నవి దసరా సెలవులు. ఈ సెలవుల్లో ఎక్కడెక్కడికి వెళ్లాలని అలోచిస్తున్నారా? మీ కోసమే ఈ కథనం. సాధారణంగా బెంగళూరుకు దగ్గర్లో ఉన్న వీకెండ్ స్పాట్స్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది నంది బెట్ట. అయితే ఆ నందిబెట్టకు పట్టుమని 10 మైళ్ల దూరంలోనే భోగ నందీశ్వర దేవాలయం అనే అద్భుతమైన దేవాలయం ఉంది. ఇక్కడి శిల్పకళను ఎంత వర్ణించినా తక్కువే. ముఖ్యంగా ఇక్కడ నంది కొమ్ముల నుంచి ఆ శివలింగాన్ని దర్శనం చేసుకొంటే కొత్త దంపతులకు త్వరగా సంతాన యోగం కలుగుతుందని స్థానికులు నమ్మకం. అందువల్లే సుదూర ప్రాంతాల నుంచి కూడా కొత్త దంపతులు ఇక్కడికి వచ్చి దైవ దర్శనం చేసుకొని వెలుతుంటారు.
భోగనందీశ్వర దేవాలయం
P.C: You Tube
ఈ అద్భుతమైన భోగ నందీశ్వర దేవాలయం చిక్కబళాపుర జిల్లాలో ఉంది. నంది బెట్టకు వెళ్లే దారిలోనే ఈ దేవాలయం ఉంది.
సులభంగా చేరుకోవచ్చు
P.C: You Tube
అందువల్ల సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు. బెంగళూరు రైల్వేస్టేషన్ నుంచి ఇక్కడికి కేవలం 54 కిలోమీటర్లు కాగా , చిక్కబళాపురం నుంచి 6.5 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది.
నంది బెట్ట నుంచి
P.C: You Tube
ఇక నంది బెట్ట నుంచి 9.5 కిలోమీటర్లదూనరంలో ఈ భోగ నందీశ్వర దేవాలయం ఉంది. ఈ పవిత్రమైన హిందూ దేవాలయంలో పరమశివుడిని లింగ రూపంలో ఆరాధిస్తారు.
దక్షిణ భారత శైలి
P.C: You Tube
దక్షిణ భారత శైలి వాస్తు ప్రకారం ఈ దేవాలయాన్ని నిర్మించారు. బెంగళూరుకు అత్యంత దగ్గరగా ఉన్న ఈ దేవాలయాన్ని ఒక రోజులోపు చూసిరావడానికి వీలవుతుంది.
అత్యంత పురాతన దేవాలయం
P.C: You Tube
అత్యంత పురాతన దేవాలయమైన ఈ భోగనందీశ్వర దేవాలయాన్ని క్రీస్తు శకం 9వ శతబ్దంలో నోలంబ వంశానికి చెందిన రాజులు నిర్మించారు.
అనేక మంది రాజులు
P.C: You Tube
ఇక్కడ విశేషం ఏమిటంటే గంగా, చోళ, రాష్ట్రకూటులు, హొయ్సళ, విజయనగర రాజులు ఈ దేవాలయ అభివ`ద్ధికి అనేక కానులకులు అందజేశారు.
అనేక ఉపాలయాలు
P.C: You Tube
ఈ దేవాలయంలోని శిల్ప సంపదను ఎంత వర్ణించినా తక్కువే. ఈ దేవాలయం అవారణంలో అరుణాచలేశ్వర, ఉమా మహేశ్వర, భోగనందీశ్వర పేరుతో మూడు ఉపాలయాలు ఉన్నాయి.
నయన మనోహరంగా
P.C: You Tube
ఈ మూడు ఉపాలయాలే కాకుండా ఈ దేవాలయంలో అనేక చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అందమైన కళాక`తులతో చెక్కిన అనేక రాతి స్తంభాలతో కూడిన మంటపాలు నయన మనోహరంగా మనకు కనిపిస్తాయి.
దేవతా విగ్రహాలు
P.C: You Tube
ఈ రాతి స్తంభాల పై దేవతా విగ్రహాలు, పౌరాణిక పురుషులు, అనేక జంతువులు, పక్షులను అందంగా చెక్కారు. అందువల్లే అన్ని వందల రాతి స్తంభాలు ఉన్నా కూడా ఏ ఒక్కటి మరొక రాతి స్తంభం వలే కనిపించదు.
ఆనంద మంటపం
P.C: You Tube
ముఖ్యంగా ఈ దేవాలయంలో ఆనంద మంటపాన్ని చూసి తీరాల్సిందే. ఈ మంటపం అర్థనారీశ్వర దేవాలయం ముందు భాగంలో నిర్మించారు.
హెయ్సళ కాలం
P.C: You Tube
ముఖ్యంగా హొయ్సళ కాలం నాటి కళ్యాణ మంటపంలో అనేక సూక్ష్మ రాతి విగ్రహాలను మనం చూడవచ్చు. ఈ దేవాలయంలో శివుడు, పార్వతి, విష్ణు, మహాలక్ష్మి, బ్రహ్మ, సరస్వతి, సూర్య తదితరుల చిత్రాలను, శిల్పాలను మనం ఇతర మంటపాల్లో చూడవచ్చు.
మరింత సొబగు
P.C: You Tube
దేవలయం బయట ఉన్న గోడల పై కూడా అనేక చిత్రాలను మనం చూడవచ్చు. ముఖ్యంగా దేవాలయం బయటి గోడ పైఉన్న సప్తరుబుుషుల విగ్రహాలు దేవాలయానికి మరింత సొబగును తీసుకువస్తున్నాయి.
భోగ నందీశ్వరుడు
P.C: You Tube
ఈ దేవాయంలో ముఖ్యంగా చూడదగినది భోగ నందీశ్వర దేవాలయం. దీనికి ఎదురుగా పెద్ద నంది విగ్రహం ఉంది. ఈ నంది విగ్రహానికి కూడా చిన్న మంటపాన్ని నిర్మించడం విశేషం.
భోగ నందీశ్వరుడు
P.C: You Tube
ఈ దేవాయంలో ముఖ్యంగా చూడదగినది భోగ నందీశ్వర దేవాలయం. దీనికి ఎదురుగా పెద్ద నంది విగ్రహం ఉంది. ఈ నంది విగ్రహానికి కూడా చిన్న మంటపాన్ని నిర్మించడం విశేషం.
కొమ్ముల మధ్య నుంచి
P.C: You Tube
ఈ నంది విగ్రహం కొమ్మల మధ్య నుంచి ఆ శివలింగాన్ని దర్శనం చేసుకొంటే మోక్షం తథ్యమని చెబుతారు. కొత్తగా పెళ్లైన వారు ఈ దేవాలయంలోని భోగనందీశ్వర, అర్థనారీశ్వరుడిని దర్శనం చేసుకొంటే వారి కాపురం బాగుండటమే కాకుండా మంచి సంతానం కలుగుతుందని నమ్ముతారు.
సభా మంటపం
P.C: You Tube
విజయనాగర సామ్రజ్య కాలంలో ఈ భోగ నందీశ్వర దేవలయంలో సభ మంటపాన్ని నిర్మించారు. అదే విధంగా విజయ నగర కాలంలోనే ఈ దేవాలయం మధ్య ఒక కొలను కూడా నిర్మించారు.
వీండో ఆర్ట్
P.C: You Tube
దీనికి ఆ శ్రీ క`ష్ణ దేవరాయుల పేరు పెట్టారు. ఇక ఈ భోగనందీశ్వర దేవాలయంలో విండో ఆర్ట్ ఎంతో ప్రఖ్యాతి గాంచినది. దీని పై అధ్యయనం చేయడానికి విదేశీలు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.
శిల్ప కళా వైభవం
P.C: You Tube
ఈ విండోఅర్ట్ తో పాటు వసంత మంటపాన్ని శ్రీ క`ష్ణ దేవరాయుల కాలంలో నిర్మించారు. ఈ శిల్పాలను చూస్తే ఉంటే ఆనాటి శిల్పకళా వైభవం గుర్తుకు రావడం మనక పోదు.
ఇక్కడ మాత్రమే
P.C: You Tube
ముఖ్యంత అతి సూక్ష్మంగా చెక్కిన లతలు, పక్షులు, జంతువులతో కూడిన స్తంభాలు చూపరులను ముగ్దులను చేస్తుంది. ఇలాంటి స్తంభాలను మనం ఇక్కడ తప్ప మరెక్కడా చూడలేము.
పార్వతీ దేవికి కూడా
P.C: You Tube
ఇక్కడ పార్వతీ దేవికి కూడా వేరుగా చిన్న ఉపాలయం ఉంది. ఇర ఉమా మహేశ్వర దేవాలయం, వసంతమంటపం, అరుణాచలేశ్వర దేవాలయం లోని శిల్పాలను చూసి తీరాల్సిందే.
భారత దేశంలో ఏక శిలా నంది విగ్రహాలు చూశారా