Search
  • Follow NativePlanet
Share
» »మహాభారతం జరిగిన ప్రదేశాలు !

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

మహాభారతం జరిగిందని కొందరు చెబుతుంటే, మరికొందరు ఆది ఒట్టి సృష్టే అని కొట్టిపాడేస్తున్నారు. భారతదేశంలో ముఖ్యంగా సింధూ, గంగా నది పరివాహ ప్రాంతాల్లో మహాభారతం జరిగినట్లు ఇతిహాసాల్లో పేర్కొన్నారు.

By Venkatakarunasri

మహాభారతం జరిగిందని కొందరు చెబుతుంటే, మరికొందరు ఆది ఒట్టి సృష్టే అని కొట్టిపాడేస్తున్నారు. భారతదేశంలో ముఖ్యంగా సింధూ, గంగా నది పరివాహ ప్రాంతాల్లో మహాభారతం జరిగినట్లు ఇతిహాసాల్లో పేర్కొన్నారు. ఎక్కువగా మహాభారతం జరిగింది ఉత్తర భారతదేశంలోనే. దక్షిణ భారత దేశంలో చాలా తక్కువగా జరిగింది మహాభారతం. ఇందులో ఉచ్చస్థితి గా చెప్పుకోవాల్సినది మహాభారత ఆఖరి యుద్ధం. దీనినే కురుక్షేత్ర సంగ్రామం అంటారు.

మహాభారత కావ్యంలో పేర్కొన్న కొన్ని ప్రదేశాలు అదేనండి మహాభారతం జరిగినట్లు చెప్పబడే ప్రదేశాలు గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. పనిలో పనిగా శ్రీకృషుని కావ్యం(భగవద్గీత) లోని ప్రదేశాలను చూద్దాం. ఆ ప్రదేశాలు దేనికి ప్రసిద్ధి? ఎక్కడ ఉన్నాయో ఒకసారి తెలుసుకుంటే ...

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

కైకేయ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్

ఉత్తర సరిహద్దు ప్రదేశం కైకేయ ప్రదేశ్ గురించి మహాభారత కావ్యంలో వర్ణించబడింది. పూర్యం ఇది జయ్‌సెన్ రాజు రాజ్యంగా ఉండేది. ఈయన భార్య వాసుదేవుని యొక్క చెల్లలు రాధాదేవి. ఈ ప్రదేశంలో మహాభారత యుద్ధం జరిగినట్లు పేర్కొన్నారు. జయసేన్ కుమారుడు విండ్ జరాసంధునికి మరియు దుర్యోధనుడికి స్నేహితుడు. ఇతను తన చెల్లల్ని దుర్యోధనుడికి ఇచ్చి వివాహం జరపాలని అనుకున్నాడు. కానీ తన చెల్లలు కృష్ణుడిని ప్రేమించి, వివాహం చేసుకుంటుంది.

చిత్ర కృప : Trey Ratcliff

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

ఉజ్జనక్ : నైనిటాల్, ఉత్తర ప్రదేశ్

ఉజ్జనక్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నైనిటాల్ జిల్లాలోని కాశీపూర్ సమీపాన ఉన్నది. ద్రోణాచార్యుడు ఇక్కడే పాండవులకి, కౌరవులకి విలువిద్య నేర్పించాడు. ద్రోణాచార్యుని అభీష్టం మేరకు, కుంతి పుత్రుడు భీముడు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్టించాడు. దాంతో ఈ ప్రదేశానికి భీమ్ శంకర్ అన్న పేరొచ్చింది.

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

అంగదేష్(మనాలినగరి) : గొండ, ఉత్తర ప్రదేశ్

మనాలినగరి పూర్వం, పురాతన రాజ్యాలకి రాజధానిగా ఉండేది. ఇక్కడే దుర్యోధనుడు ఈ రాజ్యాన్ని కర్ణుడికి బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రదేశం శక్తిపీఠాల్లో ప్రసిద్ధికెక్కింది. సతీదేవి కుడిచేయి ఇక్కడే పడిపోయింది.

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

కౌశంబీ: ఉత్తర ప్రదేశ్

ప్రస్తుత అలహాబాద్ నగరంలో, గంగానది కి దక్షిణం వైపున మహాభారత సమయంలో వత్సదేశ్ కి రాజధానిగా కౌశంబీ నగరం ఉండేది. వీరు కౌరవుల పక్షాన ఉండి, మహాభారత యుద్ధంలో పాల్గొన్నారు.

చిత్ర కృప : Manfred Sommer

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

కాశి, ఉత్తర ప్రదేశ్

కాశి నగరం మహాభారత కాలంలో, ప్రధాన విద్యా కేంద్రంగా ఉండేది. భీష్మ పితామహుడు కాశి రాజు మీద యుద్ధం చేసి గెలిచాడు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు. వారు అంబ, అంబిక,అంబాలిక. భీష్ముడు ముగ్గురినీ విచిత్రవీర్య కిచ్చి వివాహం జరిపించాలని అనుకుంటాడు. ఇక్కడ కూడా లవ్ స్టోరీ దాపరిస్తుంది. అంబ శిశుపాలుని తమ్ముడు శల్య ని ప్రేమిస్తుంది. దీంతో విచిత్రవీర్య ని వివాహం చేసుకోనని చెబుతుంది. మిగిలిన ఇద్దరు అంబిక, అంబాలిక గతిలేక విచిత్రవీర్య ని వివాహం చేసుకుంటారు. దృతరాష్ట్రుడు అంబిక కొడుకు, పాండు అంబాలిక కొడుకు. దృతరాష్ట్రుని కుమారులను కౌరవులని, పాండురాజు కొడుకులను పాండవులని అంటారు. వీరి మధ్యనే మహాభారత యుద్ధం జరుగుతుంది.

చిత్ర కృప : Steve Browne & John Verkleir

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

ఏకచక్ర నగరి : ఆరహ్, బీహార్

మహాభారత కాలంలో ఆరహ్ ను ఏకచక్ర నగరి అనేవారు. పాండవులకు వనవాస సమయంలో కొన్ని రోజుల పాటు ఇక్కడ ఉన్నారు. వారికి ఒక బ్రాహ్మాణుడు ఆశ్రయం కల్పించాడు. బకాసురుడు అనే రక్షసుడిని భీముడు ఇక్కడే వధించాడు.

చిత్ర కృప : Nagarjun Kandukuru

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

మగధ : దక్షిణ బీహార్

ప్రస్తుత దక్షిణ బీహార్ పురాతన నామం మగధ. జరాసంధుడు ఈ రాజ్యాన్ని పాలించేవాడు. ఈ ప్రదేశంలోనే భీముడు జరాసంధున్ని కుస్తీ పోటీలో చంపుతాడు. వీికి మగధ ప్రజలు సహాయం చేస్తారు.

చిత్ర కృప : Raja Ravi Varma

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

కామాఖ్య : అస్సాం

కామాఖ్య అస్సాంలో ప్రసిద్ధి చెందిన శక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ నరకాసురుడు మహాభారత సమయంలో కామాఖ్యదేవి ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు.

చిత్ర కృప : Far Horizon India Tours

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

మణిపూర్, తూర్పు భారత దేశం

మహాభారత సమయంలో మణిపూర్ ని చిత్రవహన్ అనే రాజు పరిపాలించేవాడు. ఇతనికి చిత్రగండ అనే కూతురు ఉండేది. ఆమె అర్జునున్ని వివాహం చేసుకొని బభ్రువహన్ అనే కుమారునికి జన్మనిస్తుంది. ఇతను పెరిగి పెద్దాయాక మణిపూర్ రాజ్యాన్ని పాలిస్తాడు మరియు పాండవులకు యుద్ధంలో సహాయపడతాడు.

చిత్ర కృప : b-OBBY Bhardwaj

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

మత్స్య రాజ్యం : ఉత్తర రాజస్థాన్

మత్స్య దేశాన్ని విరాటుడు అనే రాజు పరిపాలించే వాడు. ఈ రాజ్యానికి రాజధాని విరాట్ నగర్. పాండవులు వనవాస సమయంలో సంవత్సరం పాటు ఇక్కడే నివసించారు. ఒకనాడు విరాటుని బావ, కమాండర్ అయిన కీచక కన్ను ద్రౌపది మీద పడుతుంది. ఇది గమనించిన భీముడు అతన్ని ఛంపేస్తాడు. అర్జునుని కుమారుడు అభిమన్యుడు వి రాటు ని కుమార్తె అయిన ఉత్తర ను పెళ్ళిచేసుకుంటాడు.

చిత్ర కృప : David Cooley

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

ముచ్చకండ్ తిర్థ్ : ధోల్పూర్, రాజస్థాన్

ప్రస్తుతం ఆరావళి పర్వతాలు రాజస్థాన్ రాష్ట్రంలో ఎలా ఉన్నాయో, అలాగే ధోల్పూర్ ప్రాంతంలో కూడా ప్రమాదకరమైన పర్వతాలు ఉండేవి. కాళ్యవణ్ రాజు మథుర రాజ్యాన్ని జయించిన పిమ్మట, శ్రీకృషుడిని వెంబడించాడు. అప్పుడు కృష్ణుడు ముచ్చకండ్ చేత కప్పబడిన ఈ పర్వతాలలోని గుహలో దాపెట్టుకున్నాడు.

చిత్ర కృప : Woudloper

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

పటాన్, మెహ్సన, గుజరాత్

పటాన్, గుజరాత్ రాష్ట్రంలోని మెహ్సన కి సమీపంలో ఉండేది. మహాభారత కాలంలో ఇది వాణిజ్య నగరంగా ఉండేది. వనవాస సమయంలో భారతదేశ మొత్తం సంచరిస్తున్న పాండవులు ఒకనాడు ఇక్కడకు కూడా వచ్చాడు. వారొచ్చే సమయానికి పటాన్ ను హిడింబ్వన్ అనే రాజు పలిపాలనలో ఉండేది. ఇక్కడ జరిగిన ఒకేఒక సంఘటన భీముడు డీమన్ అనబడే హిడింబ్ ను చంపి వేసి అతని చెల్లలిని వివాహం చేసుకుంటాడు.

చిత్ర కృప : Nagarjun Kandukuru

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

వర్ణవట్ : మీరట్ కి సమీపంలో, ఉత్తర ప్రదేశ్

వర్ణవట్, మహాభారత కాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మీరట్ సమీపంలోని గల పట్టణం. ఇక్కడ దుర్యోధనుడు లక్ష్ గృహ అనే నిర్మాణాన్ని పాండవులను చంపడానికి కట్టించాడు. ఇది గంగా నది ఒడ్డున ఉన్నది.

చిత్ర కృప : Ramanarayanadatta astri

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

మహేశ్వర్,మధ్యప్రదేశ్

మహీష్మతి, కార్తవీర్యార్జునుని రాజధాని. ఓరోజు కార్తవీర్యార్జునుడు వేటకై వెళ్ళి, అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరగా, మహర్షి ఆయనకు, ఆయన పరివారానికి పంచభక్ష్యాలతొ భోజనం పెడతాడు. మహర్షి ఆర్భాటానికి కారణం గ్రహించిన కార్తవీర్యార్జునుడు కామధేనువు సంతానానికి చెందిన గోవుని బలవంతంగా తీసుకొనిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న పరశురాముడు, మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్దంచేసి అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు.

చిత్ర కృప : Amit Rawat

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

మహాభారతం జరిగిన ప్రదేశాలు !

శమంత పంచకం , కురుక్షేత్ర, హర్యానా

శమంత పంచకం ప్రదేశంలో పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పాడు. అంతేకాదు మహాభారతంలో దుర్యోధనుని చంపిన చోటుగా పేర్కొనబడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X