పంచరామాలు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు, పశ్చిమ గోదావారిజిల్లాల్లో వేర్వేరు చోట్ల ఉన్న విషయం తెలిసిందే. ఈ పంచరామాలు శైవ క్షేత్రాలు. అదే విధంగా గోదావరి నదీ తీరం వెంబడి దగ్గర దగ్గరగా ఐదు కేశవ క్షేత్రాలు ఉన్నాయి. ఈ క్షేత్రాలు ఈ కలియుగానికంటే పూర్వం నుంచి ఉన్నట్లు చెబుతారు. ఈ క్షేత్రాలు. అవి వరుసగా తణుకు, మండపాక, కొఠాలపర్రు, ర్యాలి, వాకతిప్ప. ఇందులో ర్యాలీ మాత్రమే దేశ వ్యాప్తంగా పేరొందిన పుణ్యక్షేత్రం. ఈ ర్యాలి క్షేత్రం హరి హర క్షేత్రం. కాగా, మిగిలిన ప్రాంతాలన్నీ పురాణ ప్రాధాన్యత కలిగిన అక్కడ దేవాలయాలు శిథిలావస్థలోనే ఉన్నాయి. అయినా స్థానికంగ ఉన్న హిందువులు పర్వదినాల్లో ఈ పంచ కేశవాలయాలను సందర్శిస్తూ ఉంటారు. ఈ పంచ కేశవాలయాల ప్రస్తావన మనకు కొన్ని పురాణాల్లో కూడా కనిపిస్తుంది. ఆ క్షేత్రాల క్లుప్త సమాచారం మీ కోసం
తణుకు
P.C: You Tube
పురాణాల ప్రకారం తణుకు రాక్షసుల రాజైన తాకాసురిని రాజధాని. ఇక్కడ ఉన్న కేశవ ఆలయాన్ని ఆ తరకాసురుడే నిర్మించారని చెబుతారు. తరకాసురుడిని కుమారస్వామి సంహరించే ముందు ఇక్కడ కొలువై ఉన్న కేశవుడని పూజించినట్లు చెబుతారు.
కొఠాలపర్ర
P.C: You Tube
ఇక్కడ ఉన్న కేశవ మూర్తిని ప్రసన్న మహర్షి ప్రతిష్టించినట్లు చెబుతారు. కొన్ని రోజుల తర్వాత ఈ మూర్తి స్థానికంగా వచ్చిన వరదల్లో మునికి పోతుంది. అటు పై దాదాపు 250 ఏళ్లకు పాలకొల్లు ప్రాంతానికి సీతారామచార్యులు తహశిల్దారుగా వచ్చాడు. ఆయన భర్య లక్ష్మీనరసమ్మ కేశవ భక్తురాలు ఆమెకు కలలో ఈ కేశవుడు కనిపించి తను ఉన్న ప్రాంతాన్ని చెప్పాడు. ఆమె అక్కడ తవ్వించి స్వామి వారి విగ్రహాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మింపజేసిందని చెబుతారు.
ర్యాలి
P.C: You Tube
ర్యాలి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ప్రధాన ఆరాధ్య దైవం. ఇది హరిహర క్షేత్రం. అమ`తం పంచేసమయంలో మహావిష్ణువు అందమైన జగన్మోహిని రూపం ధరిస్తాడు. ఆమె అందానికి ముగ్దుడైన పరమశివుడు ఆ జగన్మోహిని చేయి పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు.
ఒకే విగ్రహంలో
P.C: You Tube
ఆ సమయంలో జగన్మోహిని కొప్పు నుంచి ఈ ర్యాలి ప్రాంతంలో ఒక పువ్వు జారి పడిపోతుంది. ఆ పువ్వు పడిన ప్రాంతంలోనే మహావిష్ణువు శ్రీ జగన్మోహిని కేశవుడిగా కొలువై ఉన్నాడు. ఇక్కడ విగ్రహంలో ముందుభాగంలో విష్ణువు నాలుగు చేతులతో ఉంటాడు. అదే విగ్రహం వెనుక భాగంలో జగన్మోహిని కొప్పుతో చూడటానికి పద్మినీ జాతి స్త్రీ వలే కనిపిస్తుంది.
వాకతిప్ప
P.C: You Tube
రామచంద్రాపురం, రావుల పాలెం గ్రామం మధ్యలో కేశవ మూర్తి ఆలయం ఉంది. పురాణ కాలంలో నారద మహర్షి ఇక్కడికి వచ్చి ప్రక`తి రమణీయతకు ముగ్దుడై ఇక్కడ కొంత కాలం పాటు ఉన్నట్లు చెబుతారు. ఆసమయంలో ఆయన కేశవుడి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు చెబుతారు.