మనం సాంకేతికంగా ఎంతో ఎత్తుకు వెళ్లి ఉండవచ్చు. అయితే కొన్నింటి విషయాల్లో ఆ సాంకేతికత మనకు అక్కరకు రాదు. ఇందుకు భారతదేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరుకు దగ్గరగా ఉన్న శివగంగా ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఈ పుణ్యక్షేత్రం అనేక రహస్యాలకు నిలయం. ఇక పర్వత శిఖరం పై ఉన్న ఈ దేవాలయంలోని ఆ రహస్యాల ఛేదనకు ఎన్నో వందల ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా కూడా విఫలమవుతున్నారు. ఇక ధార్మిక వేత్తలు మాత్రం ఇదంతా ఆ దేవుడి దయ అని చెబుతున్నారు. ఏది ఏమైనా సాంకేతికంగా మనం దూసుకుపోతూ ఇతర గ్రహాలను సైతం అందుకొంటున్న ఈ పరిస్థితుల్లో శతాబ్దాల నాటి ఆ రహస్యాన్ని ఛేదించక పోవడం మాత్రం విశేషంగానే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఆ శివగంగా పుణ్యక్షేత్రంలోని రహస్యం ఏమిటన్న విషయానికి సంబంధించిన కథనం నేటివ్ పాఠకులైన మీ కోసం...
శివగంగా
P.C: You Tube
బెంగళూరు నుంచి దాదాపు 54 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివగంగ హిందువుల పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. పర్వత శిఖరం శివలింగం ఆకారంలో ఉండటం. పర్వత శిఖరం పై నుంచి కిందికి జలపాతం పాడటం వల్ల ఈ పర్వత శిఖరాన్ని శివగంగ అనే పేరుతో పిలుస్తున్నారు.
శివగంగా
P.C: You Tube
ఈ పర్వత శిఖరం ఎత్తు 804.8 మీటర్లు. అంటే 2640 అడుగులు. దీనిని దక్షిణ కాశి అని కూడా పిలుస్తారు. ఈ పర్వత శిఖరం పై భాగంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. అందులో గంగాధరేశ్వర దేవాలయం,హున్నమదేవి దేవాలయం, నంది విగ్రహం, పాతాళగంగా తదితర ఎన్నో దేవాలయాలు ఈ పర్వత శిఖరం పై భాగంలో మనం చూడవచ్చు.
శివగంగా
P.C: You Tube
అదే విధంగా ఈ పర్వత శిఖరం పై భాగంలో ఉన్న శారదాంబ దేవాలయం చుట్టూ ఎన్నో పవిత్ర సరస్సులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ శారదాంబ దేవాలయం చుట్టూ ఉన్నా అగస్త్య తీర్థ, కన్వా తీర్థ, కపిల తీర్థ, పాతళగంగ తదితర సరస్సులోని నీటిని తల పై చల్లుకోవడం వల్ల పుణ్యం వస్తుందని నమ్ముతారు.
శివగంగా
P.C: You Tube
ఇక్కడ ఉన్నటువంటి హున్నమ దేవి దేవాలయం ఒక గుహాలయం. అదే విధంగా గవి గంగాధరేశ్వర దేవాలయం కూడా ఒక గుహాలయం. ప్రతి ఏడాది సంక్రాంతి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి గంగాధరేశ్వర, హొన్నమదేవికి వివాహ మహోత్సవం జరిపిస్తారు.
శివగంగా
P.C: You Tube
ఈ ఉత్సవాన్ని చూడటానికి కర్నాటక నుంచే కాకుండా దేశంలోని చాలా ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. చరిత్ర పరంగా చూస్తే ఈ శివగంగ ప్రాంతం హొయ్సళ రాజ్యంలో భాగంగా ఉండేది. ఆ రాజ్య రాజైన విష్ణువర్థనుడి భార్య శాంతల ఈ పర్వత శిఖరం పై నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకొందని చెబుతారు.
శివగంగా
P.C: You Tube
అందువల్లే ఈ ప్రాంతాన్ని శాంతలా డ్రాప్ అని పిలుస్తారు. ఇక ఇక్కడ జరిగే ఒక విచిత్రాన్ని చూడటానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ పర్వత శిఖరం పై ఉన్న గంగాధరేశ్వర శివలింగానికి నెయ్యిని రాస్తే అది వెన్నగా మారిపోతుంది.
శివగంగా
P.C: You Tube
ఇందుకు గల కారణాల పై ఎన్ని పరిశోధనలు జరిగినా సమస్య మాత్రం దొరకడం లేదు. ఇదిలా ఉండగా ఈ వెన్నను ఒంటికి పూసుకొంటే అనేక రోగాలు నయమవుతాయని భక్తులు నమ్ముతారు. ఇక వీకెండ్ సమయంలో బెంగళూరు వాసులు ఎక్కువ మంది ట్రెక్కింగ్ చేయడానికి ఇక్కడికి వస్తుంటారు.