తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మపురి అనేక అద్భుతాలకు నిలయం. ఈ పుణ్యక్షేత్రంలో ప్రధాన దైవమైన నరసింహుడిని క్షేత్రపాలకుడైన ఆజనేయుడు అష్టదిగ్భందన చేసి ఉంటాడు. అందువల్లే ఈ క్షేత్రం భూత, ప్రేత, పిశాచాల నుంచి బాధింపబడే వారికి ఉపశమనం కలిగిస్తుందని చాలా మంది నమ్ముతారు.
ఈ కారణం వల్లే ఈ క్షేత్ర సందర్శనకు సుదూర ప్రాంతం నుంచి కూడా వేలాది మంది భక్తులు నిత్యం వస్తుంటారు. ఇక ఇదే దేవాలయంలో అరుదుగా కనిపించే బ్రహ్మదేవుడికీ, దాదాపు కనిపించని యమధర్మరాజుకీ కూడా ఉపాలయాలు ఉన్నాయి.
అదే విధంగా ఈ ధర్మపురి పుణ్యక్షేత్రంలోని తీర్థాల్లో పుణ్య స్నానాలు చేయడానికి భక్తులు ఉవ్విళ్లూరుతుంటారు. ఈ నేపథ్యంలో ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథనాలు...
క్షేత్రపాలకుడు ఆంజనేయుడు
P.C: You Tube
పూర్వం ధర్మవర్మ అనే మహారాజు ఈ ధర్మపురి క్షేత్రంలో ఆ నరసింహుడి గురించి తపస్సు చేస్తాడు. రాజు తపస్సుకు మెచ్చిన లక్ష్మీనారసింహుడు ఆ ధర్మవర్మ కోరిక మేరకు లక్ష్మీ సమేతుడై యోగ నరసింహుడి రూపంలో ఈ ధర్మపురిలో కొలువై ఉన్నాడు. ఈ ధర్మపురి పుణ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి.
అష్టదిగ్భందనం
P.C: You Tube
మూలవిరాట్టును అష్టదిగ్భందనం చేస్తూ ఎనిమిది వైపులా ఎనిమిది ఆంజనేయ విగ్రహాలను మనం చూడవచ్చు. ఇటువంటి నిర్మాణం మనకు ఏ పుణ్యక్షేత్రంలో కూడా కనిపించదు. ఈ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల భూత, ప్రేత, పిశాచాల బారిన పడకుండా ఉండవచ్చునని భక్తులు నమ్ముతారు.
శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగం
P.C: You Tube
అందువల్లే నిత్యం ఈ క్షేత్రాన్ని వేలాది మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. శ్రీరామ చంద్రుడు వనవాస సమయంలో ఈ ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని సందర్శించాడని చెబుతారు. శ్రీరాముడు ఇక్కడ ప్రతిష్టించిన శివలింగాన్ని కూడా మనం చూడవచ్చు.
హరిహర క్షేత్రం
P.C: You Tube
రాముడు ప్రతిష్టించిన లింగం కాబట్టి ఈ ధర్మపురిలోని శివుడిని రామలింగేశ్వరుడిగా కొలుస్తాం. ఇది సైతక శిల్పం కావడం విశేషం. దీంతో ఈ ధర్మపురి హరిహర క్షేత్రంగా విరాజిల్లుతోంది. బ్రహ్మదేవుడు ఇక్కడ తన బ్రహ్మదండముతో భూమిని తవ్వి ఒక గుండాన్ని (తీర్థాన్ని) ఏర్పరుస్తాడు.
త్రిమూర్తుల క్షేత్రం
P.C: You Tube
అటు పై అందులో స్నానం చేసి నరసింహుడిని దర్శించుకొని ఆయన్ను ఆరాధిస్తాడు. అటు పై ఇక్కడే కొలువుండిపోతాడు. అందువల్లే ఇక్కడ బ్రహ్మ ఉపాలయాలన్ని కూడా చూడవచ్చు. అందువల్ల దీనిని త్రిమూర్తుల క్షేత్రం అని కూడా అంటారు.
యమధర్మరాజు
P.C: You Tube
రోజు పాపులను చూసిచూసి వారికి శిక్షలు వేసిన యమధర్మరాజుకు కూడా పాపం అంటుకొంటుంది. దీంతో విసుగు చెందిన యమధర్మరాజు నారదుడి సూచన మేరకు ఇక్కడి గోదావరిలో స్నానం చేసి నరసింహుడిని పూజిస్తాడు.
నరసింహుడి అభయం
P.C: You Tube
దీంతో యమధర్మరాజుకు దర్శనభాగ్యం కల్పించిన నారసింహుడు ఇక పై ఎటువంటి పాపాత్ముడిని నీవు శిక్షించిన నీకు ఎటువంటి పాపం అంటుకోదని వరమిస్తాడు. అంతే కాకుండా తన క్షేత్రంలో యమధర్మరాజుకు కూడా స్థానం కల్పిస్తాడు.
అప మృత్యుదోషం
P.C: You Tube
అందువల్లే ఈ ధర్మపురి క్షేత్రంలో మనం యమధర్మరాజు ఉపాలయాన్ని కూడా చూడవచ్చు. ఇక యముడి ఉపాలయం దగ్గరగా ఉన్న గండ దీపంలో నూనె సమర్పించిన వారికి అప మృత్యుదోషం ఉండదని, మృత్యు భయం ఉండదని ప్రతీతి.
యమకుండం
P.C: You Tube
యమధర్మరాజు స్నానం చేసిన ప్రదేశానికి యమకుండమని పేరు. ఇక తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడం కోసం మూడు పిడికిళ్ల ఇసుకతో సత్యవతి అనే మహిళ నిర్మించిన ఇసుక స్తంభం కూడా మనం చూడవచ్చు.
వందల ఏళ్లనాటి ఇసుక స్తంభం
P.C: You Tube
ఇది వందల ఏళ్ల పూర్వం నాటిదని చెబుతారు. ఆ సత్యవతి స్నానం చేసిన కుండాన్ని సత్యవతీ కుండంగా చెబుతారు. దంపతులు సరిగంగ స్నానాలు చేసి నరసింహుడిని దర్శిస్తే అత్యంత ఫలప్రదమని స్థానికుల నమ్మకం.