సామాన్యంగా మనం దేవుడికి పళ్లు, కొబ్బరికాయను నైవేద్యంగా ఉంచుతాము. అయితే మరికొందరు కొన్ని తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టి పూజిస్తారు. అయితే దేశంలో ఒకే ఒక దేవాయంలో మాత్రం చేపల పులుసును నైవేద్యంగా అందజేస్తున్నారు. ఆ దేవాలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశేషాలు తదితర వివరాలన్నీ మీ కోసం...
గంప సంగమేశ్వరాలయం
P.C: You Tube
సాధారణంగా మనుష్యులు పుట్టినతర్వాత సంప్రదాయాలు పుట్టాయని చెబుతారు. పురాణ కథనాలను అనుసరించి ఆ భక్త కన్నప్ప తాను తెచ్చిన వేట మాంసాన్ని ఆ పరమశివుడికి నైవేద్యంగా పెట్టిన విషయం మీకు ఇక్కడ గుర్తుకు రావచ్చు.
గంప సంగమేశ్వరాలయం
P.C: You Tube
అయితే అవి ఆటవిక రోజులు కాబట్టి అలా జరిగింది అని మీరు భావించవచ్చు. ఈ రాకెట్ యుగంలో కూడా ఆంధ్రప్రదేశ్ లోని విజయనగర జిల్లా కామరాడు లో ఒక మహిమాన్విత దేవాలయం ఉంది. దాని పేరే గుంప సంగమేశ్వర స్వామి.
ఇక్కడికి వెళితే దంపతుల మనస్పర్థలన్నీ మాయం
గంప సంగమేశ్వరాలయం
P.C: You Tube
అక్కడ ప్రతి శివరాత్రి చాలా ఉత్సాహంగా జరుపుకొంటారు. శివరాత్రి రోజు పండ్లు, పలహారాలతో చాలా నిష్టగా పూజలు చేస్తాం. అటు పై భక్తికి జాగారణ కూడా చేస్తాం. అయితే ఇక్కడ మాత్రం ఆ గంగమయ్యకు పాలు, పండ్లుతో పాటు చేపల కూరను నైవేద్యంగా సమర్పిస్తారు.
గంప సంగమేశ్వరాలయం
P.C: You Tube
ఇదే ఇక్కడి విశేషం. అంతేకాకుండా ప్రతి పండుగ సమయంలో దేవాలయాన్ని శుభ్రంచేసి పవిత్ర మంగళహారతులు ఇస్తారు. అంతేకాకుండ వడపప్పు, పానకం, పాయసం వంటి పదార్థాలతో ప్రసాదాలను కూడా చేసి పంచుతారు.
గంప సంగమేశ్వరాలయం
P.C: You Tube
అయితే ఈ దేవాలయంలో మాత్రం పవిత్రమైన పర్వదినాల్లో మాంసాహారాన్ని అందజేస్తారు. ఈ ఆచారం చాలా ఏళ్ల నుంచి వస్తున్నట్లు స్థానికులు చెబుతారు. వందల ఏళ్ల నుంచి స్థానికులు పవిత్రమైన రోజుల్లోనే కాకుండా తమ ఇంట్లో శుభకార్యాలు జరిగే సమయంలో కూడా ఇటువంటి మాంసాహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ వస్తున్నారు.
9 రోజులు 9 దుర్గ రూపాలు. కొలిస్తే కోరిన కోర్కెలన్నీ తీరుతాయంట?
గంప సంగమేశ్వరాలయం
P.C: You Tube
కేవలం స్థానికులే కాకుండా ఈ దేవాలయం విశిష్టత తెలిసిన చాలా మంది ఇదే విధంగా మాంసాహారాన్ని నైవేద్యంగా తీసుకుని వెలుతున్నారు. ఈ విధంగా చేపల కూరతో పాటు మాంసాహారాన్ని కానుకగా ఇవ్వడం వల్ల కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాడ విశ్వాసం.
గంప సంగమేశ్వరాలయం
P.C: You Tube
పంచలింగాల్లో ఒకటైన గుంప సోమేశ్వర ఆలయం పవిత్ర నాగావళి నదీతీరంలో వెలిసింది. జంఝూవతి, నాగవళి నదుల విత్ర సంగమం ఈ ఆలయ సమీపంలో దర్శించవచ్చు. ప్రక`తి రమణీయతల మధ్య ఉన్న దేవాలయం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
గంప సంగమేశ్వరాలయం
P.C: You Tube
ఈ గుంప సోమేశ్వర ఆలయాన్ని ద్వాపర యుగంలో బలరాముడు ప్రతిష్టించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. బలరాముడు ఇక్కడి కరువు పరిస్థితులను రక్షించడానికి గంగను తన ఆయుదమైన నాగలి సహాయంతో రప్పించాడు కాబట్టే దీనికి నాగావళి అని పేరు.
గంప సంగమేశ్వరాలయం
P.C: You Tube
ఆంధ్రప్రదేశ్ లో మాంసాహారాన్ని ముఖ్యంగా చేపల కూరను నైవేద్యంగా చెల్లించే ఆలయం ఇదొక్కటే. అయితే కేరళలో కొన్ని దేవాలయాల్లో మాంసాహారాన్ని నైవేద్యంగా సమర్పించే ఆచారం ఉంది. అయితే అక్కడ ప్రధాన దైవం పరమశివుడు కాకపోవడం ఇక్కడ గమనార్హం.