హస్తినాపురం అనే పేరువింటేనే చాలు మహాభారతం గుర్తుకు వస్తుంది.హస్తినాపురం మహాభారతంలోని ప్రసిద్ధమైన ప్రదేశాలలో ఒకటి. ఇది ఉత్తరభారతదేశంలోని మీరట్ జిల్లాలో వుంది. ఢిల్లీ నుంచి సుమారు ఢిల్లీనుంచి సుమారు 110కిమీ దూరంలో, మీరట్ నుంచి 37 కిమీ లు దూరంలో వుంది. పురాణకాలంనుంచి హస్తినాపురం కురువంశీకులరాజధానిగా వుంది. మహాభారతంలోని అనేక సంఘటనలు హస్తినాపురంలోనే నడిచాయి. కొన్ని గ్రంథాలప్రకారం దీనిగురించి దీని గురించి మొదటప్రస్తావన చంద్రవంశం యొక్క రాజైన భరతుని యొక్క రాజధాని అయినది.
వ్యాసంమూలంగా హస్తినాపురం గురించిన టాప్ 10 రహస్యాలగురించి సమాచారాన్ని పొందండి.
కురువంశం రాజధానియైన హస్తినాపురం గురించి మీకు తెలియని విషయాలు...
శకుంతలా మరియు దుష్యంతుల కుమారుడైన భరతుడు హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకున్నాడని మన పురాణాలు చెప్తున్నాయి. అశోక చక్రవర్తి మునిమనమడైన సంప్రాతిచక్రవర్తి పరిపాలనాకాలంలో ఇక్కడ అనేక దేవాలయాలను నిర్మించారు. ప్రస్తుతం ఆ స్థూపాలు మరియు దేవాలయాలు శితిలమైనాయి.
PC:Wikimedia
కురువంశం రాజధానియైన హస్తినాపురం గురించి మీకు తెలియని విషయాలు...
హస్తినాపురం పరిశోధనలో మహాభారతకథనానికి సంబంధించిన వస్తువులు వెలుగులోనికి రాలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ లభించిన సెరామిక్ పాత్రలు గంగానది తీరంలో స్థిరంగా వున్నాయి. ఆ వస్తువులు ఆర్యులకాలం నాటిదని గుర్తించబడినది.
PC: Wikimedia
కురువంశం రాజధానియైన హస్తినాపురం గురించి మీకు తెలియని విషయాలు...
మొఘలులు హిందూస్థాన్ ప్రవేశసమయంలో హస్తినాపురం బాబర్ చేతిలో వశంఅయిపోయింది. ఆ సమయంలో దేవాలయాలు, స్థూపాలు ఫిరంగులవల్ల ధ్వంసంచేయబడినది. ఆంగ్లేయులకాలంలో హస్తినాపురం రాంసింగ్ రాజులపరిపాలనలో వుండేది. అతని పరిపాలనాకాలంలో హస్తినాపురం చుట్టుపక్కల ప్రదేశాలలో కొన్ని దేవాలయాలు ఇంకా నిర్మించబడినది.
కురువంశం రాజధానియైన హస్తినాపురం గురించి మీకు తెలియని విషయాలు...
బులందర్ షాహర్, ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క బులందర్ షాహర్ జిల్లాలోని ఒక నగరం. అంతేకాదు ఇది ఒకానొక కాలంలో రాజధానిగా కూడా వుండినది.అక్కడి వారసత్వసంపదలు కూడా కనుగొనబడినవి. ఇక్కడ నిర్వహించిన అనేక పరిశోధనలలో పురాతననాణ్యాలు, కళాకృతులు ఇవన్నీ ప్రస్తుతం లక్నో మ్యూజియంలో సంరక్షించబడినవి.
PC:Pratima m
కురువంశం రాజధానియైన హస్తినాపురం గురించి మీకు తెలియని విషయాలు...
హస్తినాపురానికి కురువంశానికి మూలపురుషుడైన హస్తియ చేత స్థాపించబడినదని మహాభారతం వివరిస్తుంది.ఈ నగరాన్ని గజపురం, నాగపురం, బ్రహ్మస్థలం, పుంజర్ పూర్ అన్న పేర్లతో వర్ణించబడినది.
PC:Vaibhavsoni1
కురువంశం రాజధానియైన హస్తినాపురం గురించి మీకు తెలియని విషయాలు...
2001లో హస్తినాపురం జనసంఖ్య 21.247 ఇందులో పురుషులు 53%, స్త్రీలు 40%గా వున్నారు. హస్తినాపురం యొక్క అక్షరాస్యత 68% మంది వున్నారు.
PC:AK Gandhi
కురువంశం రాజధానియైన హస్తినాపురం గురించి మీకు తెలియని విషయాలు...
అత్యంత ప్రసిద్ధమైన దేవాలయాలలో శ్రీదిగంబర జైనమందిరం, కైలాసమందిరం, జంబుద్వీపం, శ్వేతాంబరజైనదేవాలయం, గురుద్వార మొదలైనవి అత్యంత ప్రసిద్ధమైన దేవాలయాలుగా వున్నాయి.
PC:Wikimedia
కురువంశం రాజధానియైన హస్తినాపురం గురించి మీకు తెలియని విషయాలు...
మధ్యయుగకాలంలో బాబర్ భారతదేశంమీద దండయాత్ర చేసెను.ఆ సమయంలో హస్తినాపురంపై కూడా దాడిచేసెను. ఈ సమయంలోనే దేవాలయాలపై ఫిరంగులగురి పెట్టారు.తర్వాత కాలంలో నయన్ సింగ్ రాజు హస్తినాపురాన్ని పరిపాలించెను. ఇతని కాలంలోనే అనేకదేవాలయాలు తిరిగి నిర్మించబడినాయి.
PC:Wikimedia
కురువంశం రాజధానియైన హస్తినాపురం గురించి మీకు తెలియని విషయాలు...
అశోకుని మునిమనమడైన సంప్రాతి చక్రవర్తి తన పరిపాలనాసమయంలో అనేకదేవాలయాలను నిర్మించెను. ఆ స్థూపాలు మరియు ఆ దేవాలయాలు శిథిలమైనాయి.
PC:Wikimedia
కురువంశం రాజధానియైన హస్తినాపురం గురించి మీకు తెలియని విషయాలు...
ఇక్కడ అనేక సందర్శనీయప్రదేశాలు వున్నాయి.ఇక్కడ పురాతనదేవాలయాలున్నాయి.అవి ఏవేవి అంటే పాండేశ్వర దేవాలయం, కర్ణదేవాలయం మరియు శ్రీదిగంబర జైనదేవాలయం, జంబూద్వీపం, కైలాసపర్వతం, శ్వేతాంబర జైన దేవాలయాలు. ఈ దేవాలయాలకి సమీపంలో గురుద్వారా మరియు హస్తినాపురం అభయారణ్యాన్ని సందర్శించవచ్చును.
PC:Pratima m
కురువంశం రాజధానియైన హస్తినాపురం గురించి మీకు తెలియని విషయాలు...
సంవత్సరం ఆఖరున అక్షయతృతీయ, దాస్ లక్షణ,కార్తీక్ మేళ, హోలీమేళ, దుర్గాపూజవంటి అనేక సాంస్కృతిక మరియు ధార్మిక వుత్సవాలను ఇక్కడ ఆచరిస్తారు. అదేవిధంగా ఇక్కడ అనేక మంది సందర్శకులు ఇక్కడకు వస్తారు.
కురువంశం రాజధానియైన హస్తినాపురం గురించి మీకు తెలియని విషయాలు...
ఢిల్లీలోని హస్తినాపురానికి సుమారు 108కిమీ ల దూరంలో, గాజీబాద్ నుండి 83 కిమీ డెహ్రాడూన్ నుంచి 169 కిమీలు, చండీఘఢ్ నుంచి 257 కిమీలు, గ్వాలియర్ నుంచి 371 కిమీ, జైపూర్ నుంచి 370కిమీ లు, కాన్పూర్ నుంచి 448 కిమీ లు దూరంలో, లక్నోనుంచి సుమారు 469కిమీ దూరంలోవున్నది. హస్తినాపురానికి సమీపంలోని రైల్వేస్టేషన్ మీరట్.