Search
  • Follow NativePlanet
Share
» »కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కాంచీపురం చీరలకు, దేవాలయాలకు ప్రసిద్ధి. కంచి పట్టణంలో పంచభూత క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన ఏకాంబరేశ్వర దేవాలయం, కంచి కామాక్షి దేవాలయం, ఆది శంకరాచార్యుడు స్థాపించిన మూలామ్నాయ కంచి శంకరమఠం ఉన్నాయి

By Venkatakarunasri

కంచి గురించి చాలా మంది కథలుకథలుగా చెపుతూవుంటారు. కథలు గురించి పక్కన పెడితే అక్కడఉన్న బల్లిని తాకితే మన మీద ఎప్పుడైనా బల్లి పడితే ఎలాంటి దోషాలూ రావుఅని కూడా అంటారు.

అసలు బల్లిని తాకడం వరకు ఒకేగానీ ఆ బల్లి ఎవరు? ఆ టెంపుల్ లో వందలకొద్దీ బల్లులు ఎందుకుంటాయి? అనే ప్రశ్నకుమాత్రం చాలా మంది దగ్గర సమాధానం వుండదు. అసలు ఆ రహస్యంఏమిటో ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కాంచీపురం, కంచి, లేదా కాంజీపురం తమిళనాడులోని కాంచీపురం జిల్లా రాజధాని. కాంచీపురం జిల్లా తమిళనాడు రాష్ట్రంలో బంగాళాఖాతం తీరంలో ఉన్న చెన్నై నగరానికి 70 కి.మీ దూరంలో ఉంది. జిల్లా రాజధాని కాంచీపురం పలార్ నది ఒడ్డున ఉంది.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కాంచీపురం చీరలకు, దేవాలయాలకు ప్రసిద్ధి. కంచి పట్టణంలో పంచభూత క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన ఏకాంబరేశ్వర దేవాలయం, కంచి కామాక్షి దేవాలయం, ఆది శంకరాచార్యుడు స్థాపించిన మూలామ్నాయ కంచి శంకర మఠం ఉన్నాయి.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కాంచీపురం జిల్లాకు ఉత్తరాన చెన్నై మరియు తిరువళ్ళూరు జిల్లాలు, పశ్చిమాన వెల్లూరు, తిరువన్నమలై, దక్షిణాన విల్లుపురం జిల్లా, తూర్పున బంగాళాఖాతం సరిహద్దులుగా ఉన్నాయి.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచి పట్టుచీరలు దక్షిణ భారతదేశం నందే కాక ఉత్తర భారతదేశంలో కూడా చాలా ప్రసిద్ధి చెందినవి. కాంచీపురం జిల్లాలో ఉన్న మహాబలిపురం అనే చారిత్రాత్మక రేవు పట్టణం పల్లవుల శిల్పకళా చాతుర్యానికి తార్కాణం. అంతేకాకుండా ఈ జిల్లాలో వేడన్ తాంగళ్ అనే పక్షుల సంరక్షణ కేంద్రం కూడా ఉంది. మహాబలిపురానికి 14 కి.మీ దూరంలో మొసళ్ళ బ్రీడింగ్ సెంటర్ ఉంది.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

పుష్పేషు జాతి పురుషేషు విష్ణు, నారీషు రంభ నగరేషు కంచి మధ్య యుగములలో ప్రసిద్ధి చెందిన నగరం కాంచీపురం. అప్పటిచైనా రాయబారి హుయాన్ సాంగ్ తన భారతయాత్రలో ఈ పట్టణాన్ని సందర్శించాడు. 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవులకు ఇది రాజధాని.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

పల్లవులు తమ పరిపాలన కాలంలో ఎన్నో దేవాలయాలు నిర్మించారు. పల్లవుల కాలంలో మహాబలిపురంలో ఉన్న ఓడ రేవు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. కంచిని పాలించిన పల్లవ మహేంద్రవర్మ గొప్పవిద్వాంసుడు మరియు సాహితీవేత్త. ఈయన పరిపాలనా కాలంలో కంచిని సందర్శించిన హుయాన్ సాంగ్ నగర చుట్టుకొలత 6 మైళ్ళు ఉన్నదని, ప్రజలు ధైర్యవంతులు మరియు దయగలవారని వర్ణించాడు. బుద్ధుడు కూడా కంచిని సందర్శించాడు.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

అప్పటి కాలంలో కాంచీపురం విద్వాంసులను తయారు చేయడంలో, విద్యాబోధనలో కాశీ అంత ప్రాముఖ్యం పొందింది. క్రీ.పూ.రెండవ శతాబ్దంలో పతంజలి వ్రాసిన మహాభాష్యాలలో కూడా కంచి యొక్క ప్రస్తావన ఉంది. మణిమెక్కళ్ అనే తమిళ కవి, పెరుమపంత్రు అనే మరో తమిళ కవి తమ సాహిత్యంలో కంచిని వర్ణించారు.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

క్రీ.శ.మూడవ శతాబ్దం నుండి తొమ్మిదో శతాబ్దం వరకు పాలించిన పల్లవరాజులు తమ రాజ్యాన్ని విస్తరించి ఉత్తరాన కృష్ణా నది నుండి దక్షిణాన కావేరి వరకు పాలించారు. పల్లవుల తరువాత కంచిని చోళులు పదవ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు పరిపాలించారు.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

ఆ తరువాత విజయ నగర రాజులు 14 నుండి 17 శతాబ్దం వరకు పరిపాలించారు. ఏకాంబరేశ్వర ఆలయంలోని 192 అడుగుల గాలి గోపురాన్ని, వెయ్యి స్తంభాల మండపాన్ని, వరదరాజ స్వామి దేవాలయంలోని శిల్పకళాచాతుర్యం విజయనగర రాజుల కాలంలో జరిగింది.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

విజయనగర రాజుల తరువాత కంచి ఆంగ్లేయుల హస్తగతం అయ్యింది. ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ వరదరాజ పెరుమాళ్ కు ఒక హారాన్ని బహుకరించాడని దానిని క్లైవ్ మకరకండి అని పిలుస్తారు. కంచి హిందువులకే కాక బౌద్ధులు, జైనులకు కూడా తీర్థ స్థలం.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

తండ్రి దేవతార్చనకు నీళ్ళు తీసుకొని రమ్మనగా ఆ కుమారుడు తెలియక తీసుకొని వచ్చిన ఉదకంలో బల్లి కనిపిస్తుంది.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

తండ్రి దానికి కోపించి కుమారున్ని బల్లిగా మారిపొమ్మని శపిస్తాడు. తరువాత కుమారుడు వేడుకొనగా ఇక్కడ బల్లిగా వెలసి, అతన్ని ముట్టుకొంటే బల్లి ఒంటి మీద పడే పాపం పోయేటట్లు ఆశీర్వదిస్తాడు. భారతదేశం నలుమూలల నుండి భక్తులు వచ్చి ఈ వెండి, బంగారు బల్లులు తాకి, తమ మీద బల్లి పడితే కలిగే దోషాన్ని నివారించుకొంటారు.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

ఈ దేవాలయ ప్రాంగణంలో ఆసందసరోవరం మరియు బంగారు తామర తటాకం ఉన్నాయి. ఆనంద సరోవరం మధ్యలో ఉన్న మండపంలో జలాంతర్భగాన అత్తి చెక్కతో చేయబడిన అత్తి దేవతా మూర్తి విగ్రహాలు ఉంటాయి.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

ప్రతి 40 సంవత్సరాలకొకసారి కోనేరులో నుంచి తీసి 40 రోజులు దర్శనానికి అనుమతిస్తారు. 1979వ సంవత్సరంలో అత్తి శ్రీవరదరాజ పెరుమాళును కోనేరు నుంచి బయటకి తీసి దర్శనానికి అనుమతించారు.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

మళ్ళీ 2019వ సంవత్సరం జూన్ నెలలో అత్తి శ్రీవరదరాజ పెరుమాళును దర్శించగలం . ఈ దేవాలయ ప్రాకారాలు పదకొండొవ శతాబ్దం తరువాత చోళ రాజులైన మెదటి కుత్తోంగ చోళ, విక్రమ చోళ తరువాత విజయనగర రాజుల చేత నిర్మించబడ్డాయి మరియు పునరుద్ధించబడ్డాయి.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

ఈ దేవాలయంలో కూడా వెయ్యి స్తంభాల మండపం ఉంది. ఇతిహాసం ప్రకారం ఇక్కడ వరదరాజస్వామిని కృత యుగములో బ్రహ్మ, త్రేతా యుగములో గజేంద్రుడు, ద్వాపరయుగములో బృహస్పతి, కలి యుగములో అనంతశేషుడు పూజించారని చెబుతారు.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

ఈ దేవాలయ మహాత్మ్యం హస్తిగిరి మహాత్మ్యంలో వివరించబడింది. ఇక్కడ మూలవిరాట్టుగా ఉన్న వరదరాజ పెరుమాళ్ విగ్రహం అత్యంత ఎత్తైన దేవతా విగ్రహాలలో రెండవది.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

ఇక్కడ దర్శించగల ఇతర దేవాలయాలు

ఏకాంబరేశ్వర దేవాలయం

కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాలలో ఒకటి. ఈ దేవాలయంలోని ప్రధాన దైవం శివుడు. ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలి గోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపలి మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

ఆలయంలో 1,008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ దేవాలయంలో ఉన్న 3,500 సంవత్సరాల వయస్సు కల మామిడి వృక్షంలోని నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచిగల పళ్ళు కాస్తాయి. సంతానంలేని దంపతులు ఈ చెట్టు క్రిందపడే పండు పట్టుకొని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం ప్రస్తుతం . ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు. ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో, దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, ఈ మామిడి వృక్షం క్రింద పార్వతీపరమేశ్వరులు, పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు. ఇక్కడే మనం తపోకామాక్షిని కూడా దర్శించవచ్చు. ఈ క్షేత్రం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

తిరునిలథింగల్ తుండం అనే మహా విష్ణువు సన్నిధి ఉంది. ఇతిహాసం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం క్రింద తపస్సు చేసిందని, శివుడు పార్వతిని పరీక్షించదలచి అగ్నిని పంపాడని, అప్పుడు పార్వతి విష్ణువును ప్రార్థించగా విష్ణువు అగ్నిని చల్లార్చడానికి శివుని తలమీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలు ప్రసరింపజేశాడని కథ.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

తరువాత శివుడు పార్వతి మీదకు గంగను ప్రవహింప జేయగా, పార్వతి గంగను ప్రార్థించి, వారిద్దరు శివుడి భార్యలని చెప్పగా గంగ పార్వతికి హాని జరపలేదు. అమ్మవారి ఆలింగనస్పర్శ చేత పులకాంకితుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థల పురాణము.. ఇక్కడ ఉన్న విష్ణువును వామనమూర్తిగా పూజిస్తారు.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కామాక్షి దేవాలయం

పార్వతిదేవి కంచి పట్టణంలో కామాక్షిగా పూజలు అందుకొంటున్న ఈ కంచి కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధమైనది. ఆదిశంకరులు ఇక్కడ ఉన్న కామాక్షి దేవికి పూజలు జరిపారు. మధుర మీనాక్షి, తిరువనైకవల్లో ఉన్న అఖిలాండేశ్వరి, కాశీలో ఉన్న విశాలాక్షి దేవాలయాలవలే ఈ కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కామాక్షి అమ్మవారు విగ్రహం యోగముద్రలో పద్మాసనముపై ఆసీనురాలై శాంతిని, సౌభ్రాతృత్వాన్ని వెల్లివిరిస్తూ ఉంటుంది. అమ్మవారు క్రింది హస్తాలతో చెరకుగడ, మరియు తామర పుష్పాన్ని మరియు చిలుకను, పై చేతులతో పాశాన్ని, అంకుశాన్ని ధరించి ఉంటుంది.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచి పట్టణంలో కామాక్షి అమ్మవారి దేవాలయం కాకుండా వేరే అమ్మవారి దేవాలయాలు లేవు. కామాక్షివిలాసం అనే ఇతిహాసం ప్రకారం ఇక్కడ అమ్మవారు శక్తి అంతా గ్రహించి మన్మధునిలో ఆవహింపజేస్తుందని, మరో ఇతిహాసం ప్రకారం రాజరాజేశ్వరి ఆసనంలో ఉండటం వల్ల ఈ అమ్మవారు సృష్టిలో ఉండే అన్ని శక్తులమీద తన ప్రభావం చూపుతుందని చెబుతారు.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కామాక్షి అమ్మవారు మామిడి చెట్టు క్రింద మట్టితో శివలింగంన్ని ప్రతిష్ఠచేసి ఈశ్వరుని పాణి గ్రహణం చేసిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు చాల ఉగ్రతతో ఉండి బలులు తీసుకొంటూ ఉంటే ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

శ్రీచక్రానికే పూజలు జరుగుతాయి.భగవత్ శ్రీఆదిశంకరాచార్యులు కామాక్షి అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం విడిచి వెళ్ళవద్దని అభ్యర్థించిన కారణంగా, ఉత్సవ కామాక్షి, ప్రాంగణంలోనే ఉన్న శ్రీఆదిశంకరాచార్యులు అనుమతి తీసుకొని, ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుంది.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొనిఉంది. ఇక్కడ ప్రతిరోజూ ప్రాతఃకాలంలో శ్రీ కామాక్షి దేవి ఉత్సవ మూర్తిని మేలుకొలిపి, ప్రాతఃకాల నైవేధ్యం సమర్పించి హారతి ఇచ్చి, కామాక్షిదేవి ఉత్సవ మూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకొని వెళ్తారు.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

ఆ తర్వాత కామాక్షి దేవికి ఎదురుగా గోపూజ చేస్తారు. గోపృష్ట భాగం అమ్మవారి వైపు ఉంచి గోపూజ చేస్తారు. గోపూజ అయిన తర్వాత అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలిగించి హారతి యిస్తారు. మనం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. శ్రీకామాక్షిదేవి ఆలయానికి ప్రాతఃకాలం 5 గంటలకే వెళ్తే గోపూజ చూడవచ్చు.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

వరదరాజస్వామి దేవాలయం

1053 సంవత్సరం చోళులు ఈ ఆలయ నిర్మాణం జరిపారని తెలుస్తోంది. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఈ దేవాలయం ఉన్న ప్రదేశాన్ని విష్ణుకంచి అని పిలుస్తారు. ఇక్కడ ఈ దేవాలయంలోనే రామానుజాచార్యులు నివసించారని చెబుతారు. ఈ దేవాలయం 23 ఎకరాల సముదాయంలో ఉంది.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

ఈ దేవాలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ బంగారు బల్లి మరియు వెండి బల్లులు ఉన్నాయి. ఈ బల్లులను తాకితే మనిషి ఒంటిమీద బల్లి పడితే కలిగే దోషం పోతుందని నమ్మకం. దేవాలయ ప్రాకారం ఉండే అన్ని పైకప్పుల మీద బల్లులు చెక్కబడి ఉంటాయి.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

ఇతిహాసం ప్రకారం ఇక్కడ ఒక ఋషి కుమారున్ని, అతని తండ్రి దేవతార్చనకు నీళ్ళు తీసుకొని రమ్మనగా ఆ కుమారుడు తెలియక తీసుకొని వచ్చిన ఉదకంలో బల్లి కనిపిస్తుంది. తండ్రి దానికి కోపించి కుమారున్ని బల్లిగా మారిపొమ్మని శపిస్తాడు.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

తరువాత కుమారుడు వేడుకొనగా ఇక్కడ బల్లిగా వెలసి, అతన్ని ముట్టుకొంటే బల్లి ఒంటి మీద పడే పాపం పోయేటట్లు ఆశీర్వదిస్తాడు. భారతదేశం నలుమూలల నుండి భక్తులు వచ్చి ఈ వెండి, బంగారు బల్లులు తాకి, తమ మీద బల్లి పడితే కలిగే దోషాన్ని నివారించుకొంటారు.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

ఈ దేవాలయ ప్రాంగణంలో ఆసందసరోవరం మరియు బంగారు తామర తటాకం ఉన్నాయి. ఆనంద సరోవరం మధ్యలో ఉన్న మండపంలో జలాంతర్భగాన అత్తి చెక్కతో చేయబడిన అత్తి దేవతా మూర్తి విగ్రహాలు ఉంటాయి. ప్రతి 40 సంవత్సరాలకొకసారి కోనేరులో నుంచి తీసి 40 రోజులు దర్శనానికి అనుమతిస్తారు.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

1979వ సంవత్సరంలో అత్తి శ్రీవరదరాజ పెరుమాళును కోనేరు నుంచి బయటకి తీసి దర్శనానికి అనుమతించారు.మళ్ళీ 2019వ సంవత్సరం జూన్ నేలలో అత్తి శ్రీవరదరాజ పెరుమాళును దర్శించగలం . ఈ దేవాలయ ప్రాకారాలు పదకొండొవ శతాబ్దం తరువాత చోళ రాజులైన మెదటి కుత్తోంగ చోళ, విక్రమ చోళ తరువాత విజయనగర రాజుల చేత నిర్మించబడ్డాయి మరియు పునరుద్ధించబడ్డాయి.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

ఈ దేవాలయంలో కూడా వెయ్యి స్తంభాల మండపం ఉంది. ఇతిహాసం ప్రకారం ఇక్కడ వరదరాజస్వామిని కృత యుగములో బ్రహ్మ, త్రేతా యుగములో గజేంద్రుడు, ద్వాపరయుగములో బృహస్పతి, కలి యుగములో అనంతశేషుడు పూజించారని చెబుతారు. ఈ దేవాలయ మహాత్మ్యం హస్తిగిరి మహాత్మ్యంలో వివరించబడింది. ఇక్కడ మూలవిరాట్టుగా ఉన్న వరదరాజ పెరుమాళ్ విగ్రహం అత్యంత ఎత్తైన దేవతా విగ్రహాలలో రెండవది.

pc: youtube

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !

ఎలా వెళ్ళాలి?

రహదారి మార్గం

హైదరాబాద్ నుండి కర్నూలు, కడప, తిరుపతి మీదుగా కంచి చేరవచ్చును. ఈ మార్గంలో 12 గంటలసమయం పడుతుంది.

విమాన మార్గం

హైదరాబాద్ నుండి చెన్నై విమాన మార్గం ద్వారా 1గంట సమయం పడుతుంది.

pc: google maps

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X