మీ పెళ్లి ఇక్కడ వేరుగా జరుగుతుంది
కాంత, కనకం వీటి పై ఆశ ఉండని పురుషుడు ఉండడు. ఇక మహిళల విషయానికి వస్తే బంగారు నగలు, వజ్రాలు, వైడ్యూర్యాలు ఎన్ని ఉన్నా ఇంకా కావాలని పరితపించడం సహజం. అయితే అందరికీ ఇది వర్తించదు. వందమందిలో ఒకరిద్దరికి తప్ప మిగిలిన వారందరికి వర్తిస్తుంది. నవ్వకండి ఇది నిజం. ఇక అసలు విషయానికి వస్తే భారత దేశం నిధులకు నిలియం. అనంత పద్మనాభ స్వామి దేవాలయం మొదలుకొని కొండలు, గుహలు ఇలా ఎన్నో ప్రాంతాల్లో అంతులేని నిధి నిక్షేపాలు దాగున్నాయి. వాటిని సొంతం చేసుకోవడం కోసం ఎన్నో ఎళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వాటిని ఇప్పటి వరకూ ఎవరూ సొంతం చేసుకోలేకపోయారు. మీరు ప్రయత్నించి సక్సెస్ అయితే మాత్రం మరో విజయ్ మాల్యాలా అందమైన మహిళలతో కలిసి ఫొటో షూట్ చేయవచ్చు. ప్రయత్నించండి.
1.కొల్లూరు మూకాంబిక దేవాలయం
కొల్లూరు మూకాంబిక దేవాలయం కర్నాటకలో ఉంది. మంగళూరు కు 120 కిలోమీటర్ల దూరంలో కొడచాద్రి అనే కొండల పై ఈ మూకాంబిక దేవాలయం ఉంది.కొన్ని లక్షల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ దేవాలయం భూ గర్భ గుహలో లక్షల కోట్ల విలువ చేసే నిధి ఉందని చెబుతున్నారు. ఈ విషయాన్ని అక్కడ పనిచేసి మానేసినసుకుమార్ శెట్టి చెబుతున్నారు.
2.శక్తి పీఠం కింద
ఆలయంలోని అమ్మవారి విగ్రహం కింద ఉన్న శక్తి పీఠం పక్కనే పాము ఆకారంలో ఒక విచిత్రమైన గుర్తు ఉంది. ఆ గుర్తు కిందే
లక్షల కోట్ల విలువచేసే నిధులు ఉన్నాయి. అయితే ఆ గుర్తును అర్థం చేసుకునేవారు ఎవ్వరూ లేక పోవడం వల్ల ఆ నిధిని బయటికి తీయలేకపోతున్నట్లు సుకుమార్ శెట్టితో పాటు
మరికొంత మంది ట్రస్టీలు చెబుతున్నారు.
3.క`ష్ణానది, ఆంధ్రప్రదేశ్
ప్రపంచంలోని అత్యంత విలువైన వజ్రాలన్నీ ఈ నదీ పరివాహక ప్రాంతంలోనే దొరికాయి. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని కొల్లూరు వద్ద ఉన్న క`ష్ణా నది తీరంలో ఉన్న వజ్రాగనిలో లక్షల కోట్ల విలువ చేసే
వజ్రాలు ఉన్నట్లు చెబుతారు.
5.ఛార్మినార్ టన్నెల్
కులీ కుతుబ్ షా చార్ మినార్ ను కట్టించిన విషయం మనకు తెలిసిందే. ఇక నగరానికి దగ్గరగా ఉన్న గోల్కొండ కోట నుంచి కొన్ని రహస్యమార్గాలను చార్ మినార్ వరకు తవ్వించాడు.
5.ఛార్మినార్ టన్నెల్
కులీ కుతుబ్ షా చార్ మినార్ ను కట్టించిన విషయం మనకు తెలిసిందే. ఇక నగరానికి దగ్గరగా ఉన్న గోల్కొండ కోట నుంచి కొన్ని రహస్యమార్గాలను చార్ మినార్ వరకు తవ్వించాడు.
6.అనుకోని ప్రమాదం జరిగినప్పుడు
అనుకోని ప్రమాదం ఎదురైప్పుడు ఈ మార్గాల ద్వారా తప్పించుకోవడానికి వీలుగా వీటి నిర్మాణం కొనసాగిందని చరిత్ర కారులు కూడా అంగీకరించారు. ఈ మార్గాలలోనే అంతులేని సంపద దాగుంది.
7.నాదిర్ షా నిధి
పర్షియా కు చెందిన నాదిర్ షా 1739 లో సుమారు 50 వేల మంది సైన్యంతో ఢిల్లీ పై దండెత్తి సుమారు 20 వేల మంది అమాయకులను చంపేశాడు. అంతేకాకుండా అప్పటి పాలకుల నుంచి అంతులేని సంపదను తీసుకుని తన స్వంత దేశానికి బయలు దేరాడు.
8.హిందూ కుష్ పర్వతాల్లో
అయితే మార్గమధ్యలో మహ్మద్ షా చంపి ఆ సంపదను హిందూ కుష్ పర్వతాల్లో దాచారని చెబుతాడు. అయితే అది ఎక్కడ ఉందో ఎవరికీ చెప్పకుండానే మహ్మద్ షాకన్నుమూసాడు. దీంతో ఆ నాదిషా సంపద ఆ చూకి ఇప్పటికీ తెలియడం లేదు.
9.సోన్ బండార్ కేవ్స్
బీహార్లోని రాజ్ గిర్ అనే పట్టణానికి సమీపంలో సోన్ బండార్ కేవ్స్ ఉన్నాయి. పూర్వం ఈ ప్రాంతం మగధ సామ్రాజ్య పాలనలో ఉండేది. ఆ రాజ్యానికి చెందిన బింబిసారుడు ఈ గుహల్లో అంతులేని సంపద దాచాడని ఆ గుహల్లో ఉన్న రాతల ద్వారా తెలుస్తుంది. తన కుమారుడి ద్వారా తన ప్రాణానికి ముప్పు ఉందని భావించిన బింబిసారుడు కొండ లోపల ఉన్న గుహలో ఆ నిధి దాచాడు.
10.ఫిరంగులు పెట్టి పేల్చినా
అయితే ఆ గుహ ఎక్కడ ఉంది దానినిఎలా తెరువాలన్న విషయం మాత్రం రహస్యంగా ఉంది. ఆఖరికి బ్రిటీష్ వారు కూడా ఫిరంగులతో ఆ గుహను నేలమట్టం చేయడానికి ప్రయత్నించి పూర్తిగా విఫలమయ్యారు.
11మీర్ ఉస్మాన్ ఆలీ నిధి
తెలంగాణాను పాలించిన ఆఖరి ముస్లీం రాజు మీర్ ఉస్మాన్ ఆలీ. 1939 లో ఓ మ్యాగజీన్ మీర్ ఉస్మాన్ ఆలీని ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తించింది. ఆయన ఆస్తి మొత్తం రూ.14 లక్షల కోట్ల రుపాయలు.
13.మొఘల్ ట్రెజర్ ఆఫ్ ఆల్వా
రాజస్థాన్ లోని ఆల్వార్ కోటకు ఎంతో చరిత్ర ఉంది. మొఘలుల పాలనలో ఇది ఎంతో వైభవంగా ఉండేది. ఈ ఆల్వార్ కోటలో జహంగీర్ లక్షల కోట్ల బంగారు నాణ్యాలు, వజ్రాలు వైడూరాలు దాచాడని చెబుతారు.
14.ఆ కప్ విలువే
ఇందులో పచ్చతో తయారు చేయబడి వజ్రాలు పొదిగిన ఒక కప్ కూడా ఉందని దీని విలువే వేల కోట్ల రుపాయలుగా ఉంటుదని చెబుతున్నారు. అయితే ఆ నిధి దాచిన భూ గహం ఎక్కడ ఉందన్న విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియదు.
15. ట్రెజర్ ఆఫ్ రాజా మాన్ సింగ్
జైపూర్ కు రాజైన ఇతను అక్బర్ కు నమ్మిన బంటు. 1530లో ఆఫ్ఘనిస్తాన్ ను అక్బర్ ఆక్రమించినప్పుడు అక్కడ స్వాధీనం చేసుకున్న అనంత సంపదను ఢిల్లీకి తరలించకుండా తన సొంత కోటైన జయ్ ఘడ్ కు తరలించిఅక్కడ దాచిపెట్టారని చెబుతారు.
16. ఎమర్జెన్సీ
అయితే ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో వచ్చిన ఎమర్జెన్సీ సమయంలో ఈ నిధిని వెతకమని అప్పటి ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే వారు అక్కడ ఏమీ దొరకలేదని తేల్చారు. మరోవైపు ఢిల్లీ నుంచి జైపూర్ కు వెళ్లే రోడ్డును కొద్ది కాలం పాటు మూసి వేశారని ఆ సమయంలో కోటలో ఉన్న సంపదను ఇందిరా గాంధీ తన ఇంటికి తరలించారనే వాదన కూడా వినిపిస్తోంది.
17.గ్రాస్వెనార్ షిప్
ఇది ఈస్ట్ ఇండియాకు చెందిన ఓ వాణిజ్య ఓడ1782 లో చెన్నై ఓడ రేవు నుంచి ఇంగ్లాండ్ కు బయలు దేరగా సౌత్ ఆఫ్రికా వద్దకు వచ్చే సరికి కనిపించకుండా పోయింది. ఈ ఓడలో 26 లక్షల బంగారు నాణ్యాలు,
1400 బంగారు కడ్డీలు, 19 పెట్టెల నిండా వజ్రాలు ఉన్నాయని చెబుతారు.
18ఆధారాలు అక్కడ ఉన్నాయి
ఇందుకు సంబంధించిన లిఖిత పూర్వక ఆధారాలు ఇప్పటికీ ఇంగ్లాండ్ లోని గ్రంధాలయంలో ఉందని చెబుతారు. అటు పై దాని శిథిలాలుకనిపించాయి కాని సొత్తు దొరకలేదు. అది ఎక్కడకు పోయిందన్న విషయం పై సమాచారం లేదు.
19.అనంత పద్మనాభ స్వామి దేవాలయం
కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఆరు నేల మాళిగలు ఉన్నాయి. అందులో ఒక గదిని 2011లో తెరవగా ఆ ఒక్క గదిలోనే 1.41 లక్షల కోట్ల విలువ చేసే నిధి దొరికింది.
20.బీ గదిలో
దాని పక్కనే ఉన్న బీ గదిలోఏ గదితో పోలిస్తే మూడు రెట్ల నిధులు ఉన్నట్లు చెబుతారు. అయితే ఆ గది తలుపుల పై నాగ బంధం ఉండటం వల్ల దీనిని తెరిచే సాహసం ఎవరూ చేయడం లేదు.