భారత దేశంలోని హిమాలయాలకు ధార్మిక గుర్తింపు ఉంది. ఇక్కడ సమస్త దేవతలూ నివశిస్తూ ఉన్నారని ఇప్పటికీ చాలా మంది హిందువుల ప్రగాడ విశ్వాసం. ముఖ్యంగా కైలాసనాధుడైన పరమశివుడు నివశించేది ఈ ప్రాంతంలోనేనని వారు చెబుతుంటారు. అటువంటి హిమాచల్ ప్రదేశ్ లో ఒక విచిత్రమైన శివలింగం ఉంది. దీనిని దర్శిస్తే భార్యా భర్తల మధ్య గొడవలు పూర్తిగా సమసి పోతాయని నమ్ముతారు. అంతేకాకుండా ఆ కుటుంబంలో ఎప్పుడూ శాంతి, సౌభాగ్యాలు విరాజిల్లుతాయని నమ్ముతారు. ఈ విచిత్రమైన శివలింగం గురించిన సమాచారం మీ కోసం....
పెళ్లికి ముందు ఆ పని కోసం ఈ ప్రాంతాలు ఉత్తమం
అంత ఎత్తులో మీ 'పక్క' పైన ఉన్నవారిని కెవ్వు మని కేక పెట్టించకమానరు
1. అర్థనారీశ్వర రూపం...
Image Source:
హిమాచల్ ప్రదేశ్ లోని కత్ గాథ్ అనే పట్టణంలో శివలింగం అర్థనారీశ్వర రూపంలో ఉంటుంది. ఒక భాగం పెద్ద ఆకారంలో మరో భాగం చిన్నగా ఉంటుంది. పెద్ద భాగాన్ని శివుడిగా, చిన్నగా ఉన్న భాగాన్ని పార్వతిగా భావిస్తారు. ఈ రెండు భాగాలు, గ్రహాల స్థితిగతులకు అనుగుణంగా కదులుతూ ఉంటాయి. అంటే ఈ రెండు భాగాలు దూరంగా పోవడం లేదా దగ్గరగా రావడం చేస్తుంటాయి.
2. ప్రపంచంలో ఇటువంటిది ఇదొక్కటే...
Image Source:
ప్రపంచంలో ఇటువంటి శివలింగం ఇదొక్కటే. అంటే శివలింగం రెండు భాగాలుగా ఉండి ఆ రెండు భాగాలు పూజింపబడటం అన్నమాట. అదే విధంగా ఈ రెండు భాగాలు వేసవి కాలంలో దూరంగా జరగడం ప్రారంభిస్తాయి. ఇక చలికాలంలో దగ్గరగా వస్తాయి.
3. ఎవరు నిర్మించారు.
Image Source:
చరిత్రను అనుసరించి ఈ దేవాలయాన్ని చాలా కాలం క్రితం సికిందర్ అనే రాజు నిర్మించారు. ఈ శివలింగాన్ని కొంతమంది స్వయంభువు అని చెప్పగా మరికొంతమంది భూమి లోపల ఉన్న ఈ రెండు శివలింగాలను సికిందర్ భూమి పైకి తీసుకువచ్చి ఖగోళ సూత్రాలకు అనుగుణంగా నిర్మింపజేశారని చెబుతారు. ఈ విషయం పై స్థానికుల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
4. ఎనిమిది అడుగులు
Image Source:
ఈ రెండు శివలింగాల్లో పెద్ద శివలింగం ఎనిమిది అడుగులు ఉండగా రెండో శివలింగం 5 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ రెండు శివలింగాలు నల్లటి రంగులో ఉంటాయి. గ్రహ స్థితులకు అనుగుణంగా చలనం కలిగిన ఈ రెండు శివలింగాలు శివరాత్రి రోజున మాత్రం ఒకటవుతాయి. ఇందుకు గల కారణాలు మాత్రం ఇప్పటి వరకూ ఎవరకూ చెప్పడం లేదు.
5. ప్రత్యేక పూజలు
Image Source:
ఇక్కడ శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలు మూడు రోజుల పాటు కొనసాగుతాయి. ముఖ్యంగా రెండు శివలింగాలు ఒక్కటిగా మారే సమయంలో ఇక్కడ వివిధ రాష్ట్రల నుంచి వేల సంఖ్యలో ఇక్కడి భక్తులు వస్తుంటారు.