సింధూలోయ నాగరికత భారతదేశంలో ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, జమ్ముకాశ్మీర్ తో పాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వెలిసింది. ఈ కాలంలో జీవించిన ప్రజలు పొడవు, ద్రవ్యరాశి మరియు కాలాలను ఖచ్చితంగా కొలవగలిగేవారని ఆధారాలు లభించినాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాలు శిధిలావస్థలో ఉన్నప్పటికీ, చరిత్రకారులు ఇక్కడ తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. ఇండియాలో సింధూలోయ నాగరికత బయటపడ్డ ప్రదేశాలు (వీటిని ఇండియాలో కెల్లా అతి ప్రాచీన ప్రదేశాలుగా పేర్కొనవచ్చు) గమనిస్తే ....
ప్రపంచంలో ఉన్న అతి ప్రాచీన నాగరికతల్లో సింధూలోయ నాగరికత ఒకటి. ఈ నాగరికత సింధూనది పరివాహ ప్రాంతాల్లో క్రీ.పూ. 2700 - క్రీ.పూ. 1750 వరకు విలసిల్లింది. ఈ నాగరికతకు చెందిన హరప్పా నగరాన్ని మొదటగా వెలికితీయటం చేత దీనిని సింధూలోయ హరప్పా నాగరికత గా పిలవబడుతున్నది. సింధూలోయ నాగరికత నదీ పరివాహ ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో లభించిన చారిత్రక ఆధారాలను బట్టి వీరు అప్పట్లోనే పట్టణ ప్రణాళికలను వేసి, పట్టణాలను అభివృద్ధి చేయటంలో సిద్దహస్తులని, పరిశుభ్రతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారని తెలుస్తుంది.
ఇండియాలో క్రీస్తుపూర్వం ప్రదేశాలు !
అలంగిర్పూర్, ఉత్తరప్రదేశ్
అలంగిర్పూర్ ప్రదేశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో ఉన్నది. దీనిని పరుశురాం- కా- ఖేరా అని పిలుస్తారు. అలంగిర్పూర్ సింధూలోయ నాగరికత కాలంలో ఒక పట్టణంగా ఉండేది. ఈ ప్రదేశం యమునా నది ఒడ్డున ఉన్నది.
చిత్ర కృప : Raveesh Vyas
ఇండియాలో క్రీస్తుపూర్వం ప్రదేశాలు !
బాబర్ కోట్, గుజరాత్
బాబర్ కోట్ గ్రామం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతానికి చెందినది. సింధూలోయ నాగరికతకు సంబంధిన ఆధారాలు ఇక్కడ బయటపడ్డాయి కనుక ఈ గ్రామం హరప్పా నాగరికత కు చెందినదిగా నిర్ధారించారు. ఈ గ్రామానికి అహ్మదాబాద్ 325 కి. మీ. దూరంలో, భావనగర్ 150 కి. మీ. దూరంలో ఉన్నది.
చిత్ర కృప : Mohitnarayanan
ఇండియాలో క్రీస్తుపూర్వం ప్రదేశాలు !
బలు, హర్యానా
బలు, హర్యానా రాష్ట్రంలోని ఫతెహబాద్ జిల్లాలో కలదు. ఈ గ్రామానికి సమీపంలో అనగా 22 కిలోమీటర్ల దూరంలో కైతల్ అనే నగరం ఉన్నది. ఇక్కడ కూడా సింధూలోయ నాగరికత జాడలు కనిపించినాయి.
చిత్ర కృప : Mohitnarayanan
ఇండియాలో క్రీస్తుపూర్వం ప్రదేశాలు !
బనవాళి, హర్యానా
బనవాళి సింధూలోయ నాగరికత కు చెందిన ప్రదేశం. ఇది హర్యానా రాష్ట్రంలోని హైసర్ జిల్లాలో ఉన్నది. బనవాళి సమీప పురాతత్వ ప్రదేశం కాలీ బంగాన్ కు 120 కిలోమీటర్ల దూరంలో, ఫతేహబాద్ కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ప్రస్తుతం "వనవాలి" గా పిలువబడే ఈ బనవాళి సరస్వతి అంది ఒడ్డున ఉన్నది.
చిత్ర కృప : haryana tourism
ఇండియాలో క్రీస్తుపూర్వం ప్రదేశాలు !
బర్గాఓన్, ఉత్తరప్రదేశ్
బర్గాఓన్ అనే పురాతత్వ ప్రదేశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరన్పూర్ జిల్లాలో ఉన్నది. ఇక్కడ లభించిన ఆధారాల వల్ల ఈ ప్రదేశం కూడా సింధూలోయ నాగరికత కాలంలో ప్రజలు నివసించినట్టుగా తెలుస్తుంది.
చిత్ర కృప : Radhi.pandit
ఇండియాలో క్రీస్తుపూర్వం ప్రదేశాలు !
బరోర్, రాజస్థాన్
బరోర్ ప్రదేశం రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీ గంగనాగర్ జిల్లాలో ఉన్నది. ఇది సింధూలోయ నాగరికత కు చెందిన ప్రదేశం.
చిత్ర కృప : Radhi.pandit
ఇండియాలో క్రీస్తుపూర్వం ప్రదేశాలు !
బెట్ ద్వారకా, గుజరాత్
బెట్ ద్వారకా కి శంఖోధర్ అని పేరు. ఇది గల్ఫ్ ఆఫ్ కచ్ ముఖద్వారం వద్ద కలదు. దీనికి సమీప పట్టణం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓఖా. ఇసుక, రాళ్లతో కప్పబడి ఉన్న బెట్ ద్వారకా, ప్రముఖ పుణ్య క్షేత్రం అయిన ద్వారకా కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ కూడా హరప్పా నాగరికత కు సంబంధించిన ఆనవాళ్ళు లభించినాయి.
చిత్ర కృప : Kuldip Pipaliya
ఇండియాలో క్రీస్తుపూర్వం ప్రదేశాలు !
భగత్రావ్ (భగత్ రావ్), గుజరాత్
భగత్రావ్ సింధూలోయ నాగరికతకు చెందిన చిన్న ప్రదేశం. గుజరాత్ రాష్ట్రంలోని ఉన్న భరూచ్ జిల్లాలో ఉన్న భగత్రావ్ ప్రదేశం సూరత్ కి 51 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. నర్మదా, తపతి నది ప్రవాహాలతో పాటు లోయల్లోని అడవికొండలను ఇక్కడ చూడవచ్చు.
చిత్ర కృప : Radhi.pandit
ఇండియాలో క్రీస్తుపూర్వం ప్రదేశాలు !
భిర్రంగా, హర్యానా
భిర్రంగా ప్రదేశం సింధూలోయ నాగరికత కు చెందిన అతి ప్రాచీన ప్రదేశం. ఈ గ్రామం క్రీ.పూ. 7570 నుండి క్రీ.పూ. 6200 మధ్యలో ఉండేదని చరిత్రకారులు చెబుతారు. ప్రస్తుతం ఈ గ్రామం ఫతేహబాద్ జిల్లాలో, న్యూఢిల్లీ కి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
చిత్ర కృప : Abhilashdvbk
ఇండియాలో క్రీస్తుపూర్వం ప్రదేశాలు !
దైమబాద్, మహారాష్ట్ర
దైమబాద్ ఆర్కియోలాజికల్ సైట్ గా ఉన్నది. దైమబాద్ మహారాష్ట్ర రాష్ట్రంలోని అహ్మద్నగర్ జిల్లాకి చెందినది. ఈ సైట్ ను చూస్తే, దక్కన్ పీఠభూమి ప్రాంతంలో కూడా సింధూలోయ నాగరికత వర్ధిల్లిందా ?? అని ఆశ్చర్యం కలగక మానదు.
చిత్ర కృప : Gpratik
ఇండియాలో క్రీస్తుపూర్వం ప్రదేశాలు !
దేశల్పార్ గుంత్లీ, గుజరాత్
దేశల్పార్ గుంత్లీ గ్రామం సింధూలోయ నాగరికత కు చెందిన ప్రదేశం. ఇది గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉన్న నఖ్త్రానా తాలూకాలో ఉన్నది. దేశల్పూర్ కి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం భుజ్.
చిత్ర కృప : Vidishaprakash
ఇండియాలో క్రీస్తుపూర్వం ప్రదేశాలు !
ధోల్ వీర, గుజరాత్
ధోల్ వీర గ్రామం గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో గల ఖాదిర్ బెట్ వద్ద ఉన్నది. ఈ గ్రామం సింధూలోయ నాగరికత కాలంలో వర్ధిల్లిన మొదటి 5 ప్రదేశాల్లో ఒకటిగా ఉన్నది. ఇక్కడికి వెళితే సమీపంలో ఉన్న కచ్ ఎడారి వన్యప్రాణుల అభయారణ్యం తప్పక సందర్శించాలి.
చిత్ర కృప : Rama's Arrow
ఇండియాలో క్రీస్తుపూర్వం ప్రదేశాలు !
ఫర్మానాఖాస్, హర్యానా
ఫర్మానాఖాస్ లేదా దక్ష్ ఖేర పురాతత్వ ప్రదేశం హర్యానా రాష్ట్రంలోని రోహ్టక్ జిల్లాలో ఉన్నది. ఈ గ్రామం దేశ రాజధాని ఢిల్లీ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ హరప్పా నాగరికత కు సంబంధించిన ఆధారాలు లభించినాయి.
చిత్ర కృప : Emmanuel DYAN
ఇండియాలో క్రీస్తుపూర్వం ప్రదేశాలు !
గోలధోరో, గుజరాత్
గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో గల బగసర తాలూకాలో గోలధోరో గ్రామం ఉన్నది. ఇది సింధూలోయ నాగరికత కు సంబంధించిన ప్రదేశం. ఈ ప్రదేశంలో నివసించే ఇల్లులు మరియు తయారుచేసిన నిర్మాణాలు తాలూకూ ఆనవాళ్ళు కనిపిస్తాయి.
చిత్ర కృప : Emmanuel DYAN
ఇండియాలో క్రీస్తుపూర్వం ప్రదేశాలు !
హులస్, ఉత్తరప్రదేశ్
హులస్ ఒకప్పుడు సింధూలోయ నాగరికతకు సంబంధించిన ప్రదేశంగా ఉండేది. ప్రస్తుతం ఈ గ్రామం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరన్పూర్ జిల్లాలో ఉన్నది. ఇక్కడ హరప్పా నాగరికతకు సంబంధించిన ఆనవాళ్ళు, నిర్మాణాలు బయటపడ్డాయి.
చిత్ర కృప : Radhi.pandit