Search
  • Follow NativePlanet
Share
» »శాతవాహనుల కాలంలో నీలగిరిగా ప్రసిద్ధి చెందిన నల్గొండ జిల్లాలో గల దర్శనీయ ప్రదేశాలు

శాతవాహనుల కాలంలో నీలగిరిగా ప్రసిద్ధి చెందిన నల్గొండ జిల్లాలో గల దర్శనీయ ప్రదేశాలు

నల్గొండ తెలంగాణరాష్ట్రంలోని ఒక మునిసిపల్ పట్టణం. ఈ పట్టణం పేరు రెండు తెలుగు పదాలు నల్ల, కొండల కలయిక, అంటే నలుపు రంగు, కొండ అని అర్ధం.

By Venkata Karunasri Nalluru

నల్గొండ జిల్లా తెలంగాణా రాష్ట్రంలో కలదు. నల్గొండకు ఒక గొప్ప చరిత్ర, సంస్కృతి గల పురాతన నగరం. నల్గొండను నీలగిరి అని కూడా పిలుస్తారు. శాతవాహనుల కాలంలో నీలగిరి అని పిలిచేవారు. కాలక్రమంలో నందికొండగా తర్వాత నల్లగొండగా మారింది. నల్గొండ జిల్లాలో కృష్ణా నది, మూసీ నది, ఆలేరు, పెద్దవాగు, దిండి, పాలేరు వంటి నదులు ప్రవహిస్తున్నాయి. ఈ జిల్లా సిమెంట్ ఉత్పాదనలో అసియాలోనే ప్రథమ స్థానంలో ఉంది.

తెలుగు పదాలు 'నల్లా' మరియు 'కొండా' అనే పదాల కలయిక వల్ల "నల్గొండ" అనే పేరు వచ్చింది. అనగా 'బ్లాక్ హిల్స్' అని అర్థం.

నల్లగొండ జిల్లాలోని ప్రముఖ వ్యక్తులలో రావి నారాయణరెడ్డి ముఖ్యులు. ఈయన 1908 జూన్ 5 న భువనగిరి మండలంలోని బొల్లేపల్లి గ్రామంలో జన్మించారు. అప్పటి నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనపై తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించారు. ప్రముఖ వైద్యులు గవ్వా చంద్రారెడ్డి నల్గొండ జిల్లాకు చెందిన వాడు. ఇక్కడ గల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దర్శనీయ పుణ్యక్షేత్రం.

1. మెట్టపల్లి

1. మెట్టపల్లి

"మెట్టపల్లి లేదా మట్టంపల్లి" కృష్ణా నది ఒడ్డున గల ఒక చిన్న గ్రామం. ఇక్కడ నరసింహ స్వామి ఆలయం చాలా ప్రాముఖ్యత గాంచినది. మొత్తం ఐదు నరసింహ క్షేత్రాలను కలిపి ఒకటిగా లెక్కించారు. ఈ ఆలయంలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ చెంచు లక్ష్మి తాయారు, శ్రీ రాజ్యలక్ష్మి తాయారు ప్రధానంగా పూజలందుకుంటారు. తంగేడ అనే రాజు చేత నిర్మించబడినది. ఆలయంలో వైకుంట ఏకాదశి, కళ్యాణ మహోత్సవం సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు. ఎక్కువగా జనవరి, మే నెలల్లో జరుపుకుంటారు.

PC: Youtube

2. నాగార్జున సాగర్ డ్యాం

2. నాగార్జున సాగర్ డ్యాం

నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జునసాగర్ డ్యాం కృష్ణ నది పైన నిర్మించబడింది. ప్రపంచంలోనే అతి పెద్ద రాతి ఆనకట్ట. 11.472 మిలియన్ క్యూబిక్ మీటర్ల భూమికి 10 ఎకరాలకు సాగునీటి సామర్థ్యాన్ని కలిగి ఉంది. డ్యాం 16 కిలోమీటర్ల పొడవుగల ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ కేంద్రంగా చెప్పవచ్చును. హరిత విప్లవంలో ఒక భాగంగా భారత ప్రభుత్వం ప్రారంభించిన మొదటి నీటిపారుదల ప్రాజెక్టుగా చెప్పవచ్చును. నీటిపారుదల సౌకర్యం జల విద్యుత్ వనరుగా ఉంది. డ్యాం చుట్టుప్రక్కల గల ఆకర్షణీయమైన రమణీయమైన పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తుంది.

PC: Youtube

3. యాదగిరి గుట్ట

3. యాదగిరి గుట్ట

నల్గొండ యాదగిరి గుట్ట నరసింహ స్వామి దేవాలయం ప్రముఖ హిందూ మతం ఆలయం. ఇక్కడ నరసింహ స్వామి కొలువై వున్నాడు. ఇక్కడ నరసింహ స్వామిని "యాదగిరి" అంటారు. నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో వున్న యాదగిరి గుట్ట పట్టణంలో వున్నది. ఇది హైదరాబాద్ నగరానికి 52కి.మీ ల దూరంలో ఉంది.

PC: Youtube

4. సురేంద్రపురిలో గల పౌరాణిక మ్యూజియం కుందా సత్యనారాయణ కళా ధామం

4. సురేంద్రపురిలో గల పౌరాణిక మ్యూజియం కుందా సత్యనారాయణ కళా ధామం

ఇది యాదగిరి గుట్టకు అతి సమీపంలో ఉంది. ఇది నూతనముగా నిర్మిచిన క్షేత్రము. ఇక్కడి కళాధామం చూడవలసినదేగాని, చెప్పనలవికాదు. ఈ కళాధామం దర్శించుటకు 250/- (డిసెంబరు 2010 నాటి రేటు) ప్రవేశరుసుము చెల్లించవలెను. ఈ కళాధామం దర్శించుటకు రెండుగంటల సమయం పడుతుంది. లోపలకు కెమేరాలను అనుమతించరు. అమ్మవారి వాహనం సింహం నోటినుండి కళాధామానికి ప్రవేశమార్గం ఏర్పాటు ఉంటుంది. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాల సూక్ష్మ రూపాలు ఉన్నాయి. ఒకే ప్రాంగణంలో సకల దేవతల దర్శన భాగ్యం కలిగించడము ఇక్కడి విశేషము.

PC: Youtube

5. నందికొండ

5. నందికొండ

నందికొండ ఒక చిన్న గ్రామం. నందికొండ నాగార్జున సాగర్ డాం వద్ద కృష్ణా నది ఒడ్డున వుంది. ఇది ఒకప్పుడు ఇక్ష్వాకు రాజవంశంలో విజయపురి నగర పరిధిలోని గ్రామం. నేడు ఈ గ్రామం అనేక బౌద్ధ ఆరామాలలో ఒకటిగా వుంది. వంటి పట్టణం స్థాపన సమయంలో త్రవ్వి ఉన్న స్తంభాలతో మందిరాలు, మఠాలు మొదలైనవి అనేక ముఖ్యమైన బౌద్ధ త్రవ్వకాల్లో మరియు నిర్మాణం యొక్క ఒక సైట్ ఉంది.

PC: Youtube

6. పానగల్ (పానగల్లు)

6. పానగల్ (పానగల్లు)

పానగల్ నల్గొండ జిల్లాలో వున్న చారిత్రక ప్రాధాన్యత గల మరొక ముఖ్యమైన గ్రామం. ఇది ప్రధాన నగరం నుండి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో వుంది. క్రీ.శ.11 వ శతాబ్దంలో ఈ గ్రామం కాకతీయ రాజవంశ రాజధాని. ఇది ఒక అత్యంత ప్రాముఖ్యత గల మత ప్రదేశంగా ప్రసిద్దిచెందినది. ఈ గ్రామంలో అనేక దేవాలయాలు వున్నాయి. ఇక్కడ చూడదగిన ఆలయాలు ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం మరియు పాచల సోమేశ్వర దేవాలయం. ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో స్తంభాల పైన మహాభారతం మరియు రామాయణంను వివరించే శిల్పాలు వున్నాయి. ఇవన్నీ క్రీ.శ. 1 వ శతాబ్దం నాటి ఇక్ష్వాకు రాజవంశం నాటి హిందూ మత దేవతల శిల్పాలకు సాక్ష్యాలుగా వున్నాయి.

PC: Avsnarayan

7. కొలన్పాకు జైన్ టెంపుల్

7. కొలన్పాకు జైన్ టెంపుల్

కొలన్పాకు జైన్ టెంపుల్ లేదా శ్రీ శ్వేతాంబర్ జైన్ మందిర్ కొలన్పాకు గ్రామంలో ఉన్న ఆలేరు మండలం దగ్గరగా గల ఒక ప్రముఖ జైన దేవాలయం. ఈ దేవాలయంలో మూడు జైన తీర్ధంకరల విగ్రహాలు వున్నాయి. అవి లార్డ్ మహావీర, లార్డ్ నేమినాథ్ మరియు లార్డ్ ఆదినాథ్. వీటితోపాటు ఈ ఆలయం ప్రక్కన 21 తీర్ధంకరుల విగ్రహాలు కలిగిన దేవాలయాలు కూడా వున్నాయి. కొలనుపాకలో జైనదేవాలయంలో బస చేయడానికి అనేక గదులు అందుబాటులో ఉన్నాయి. అలాగే నిత్యాన్నదానపథకం సదుపాయం కూడా ఇక్కడ ఉంది. హైద్రాబాద్‌ నుంచి అత్యంత సులువుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.

PC: Youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X