మరికొద్ది రోజుల్లో దసరా ఉత్సవాలు మొదలుకానున్నాయి. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా దేశంలో ని అన్ని అమ్మవారి దేవాలయాలు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయి. అయితే దసరా కోసం కొన్ని చోట్ల దేవాలయాలు, నగరాలు మరింత కాంతివంతంగా మారనున్నాయి. ఆయా ప్రాంతాల్లో జరిగే దసరా ఉత్సవాలను నేరుగా తిలకించాల్సిందేకాని వర్ణించడానికి మాటలు, అక్షరాలు చాలవు. కొన్ని చోట్ల శ్రీరాముడు రావణుడిని సంహరించినందుకు ఈ ఉత్సవాలను చేసుకొంటే మరికొన్ని చోట్ల ఆ జగన్మాతను వేడుకొంటూ ఈ పండుగను ఆచరించడం గమనార్హం. ఇలా భారత దేశంలో వివిధ ప్రాంతాల్లో దసరా ఉత్సవాలకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పర్యాటక స్థలాల గురించిన సమాచారం మీ కోసం. మరెందుకు ఆలస్యం దసరా సెలవుల్లో ఈ ఒక్క పర్యాటక పర్యాంతానికి వెళ్లడానికి సిద్ధం కావండి.
ఈ శ్రీ కృష్ణుడి దేవాలయానికి వెలితే చావు ఖచ్చితం?
ఇక్కడ హారతి ఇచ్చే సమయంలో విగ్రహం కళ్లు తెరుచుకొంటాయి.
మైసూరు దసరా
P.C: You Tube
దసరా ఉత్సవాలు అన్న తక్షణం ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది మైసూరు. జగద్విక్యాతమైన మైసూరు దసరా ఉత్సవాలను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
ఇక్కడ వివాహిత మహిళలు ఐదు రోజులు దుస్తులు ధరించక నగ్నంగా ఉంటారు.
అష్టాదశ పీఠాల్లో
P.C: You Tube
మైసూరు అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. ఇక్కడ అమ్మవారు చాముండేశ్వరిగా పూజలు అందుకుంటున్నారు. ఇక మైసూరు రాజ ప్రసాదంలో జరిగే దసరా ఉత్సవాలు చూడటానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తారు.
వడయార్లు
P.C: You Tube
మైసూరు ప్యాలెస్ లో మొదట విజయదశమి వేడుకలు క్రీస్తుశకం 1610లో రాజా వడయార్ తొలిసారిగా నిర్వహించారు. ఇక క్రీస్తుశకం 1805లో క`ష్ణరాజ ఒడయార్-3 హయాంలో దసరా సందర్భంగా ప్రత్యేక దర్బార్ నిర్వహించే సంప్రదాయం మొదలయ్యింది.
ఏనుగులు
P.C: You Tube
ఇక విజయదశమి రోజు రాచనగరి మైసూర్ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంద.ి రాచనగరి వీధుల్లో ఏనుగుల రాజసంతో సాగిపోతుంటాయి. అంబారీ పై అమ్మవారిని ఊరేగిస్తారు.
జంబూసవారీ
P.C: You Tube
ఈ అంబారి పై ఉన్న అమ్మవారిని చూడటానికి లక్షల సంఖ్యలో భక్తులు ఎదురు చూస్తుంటారు. దీనినే జంభూస్వారీ అని పిలుస్తారు. రాజభవనం దగ్గర మొదలయ్యే ఊరేగింపు బన్ని మంటపం వరకూ సుమారు నాలుగన్నర కిలోమీటర్ల మేర కొనసాగుతుంది.
ఎగ్జిబిషన్
P.C: You Tube
ఇక దసరా సందర్భంగా ప్యాలెస్ ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. డిసెంబర్ వరకూ కొనసాగే ఈ ఉత్సవాలుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు హాజరవుతారు.
ప్రతి ఇంటా
P.C: You Tube
ప్రతి ఇంటా దుర్గాదేవి ఆరాధనాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వీధుల్లోకి వచ్చి చూస్తే శరన్నవరాత్రి వైభవం కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. కాళీదేవి మంటపాలు, కిక్కిరిసిన కూడళ్లలో వినసొంపైన సంగీత కచేరీలు, కనుల విందైన ప్రదర్శనలతో పండగ వాతావరణం నెలకొంటుంది.
ప్రత్యేక పూజలు
P.C: You Tube
ప్రత్యేక పూజలు, ఉత్సవమూర్తులు, ఊరేగింపులు అలౌకిక ఆనందాన్ని పంచుతాయి. హౌరాబ్రిడ్జ్ పై నడక, హుగ్లీనది పై నౌకావిహారం, నగరంలో ట్రామ్ సర్వీసులో ప్రయాణం విహారంలో అదనపు వినోదాన్ని అందిస్తాయి.
అద్భుత కట్టడాలు
P.C: You Tube
ఇక ఈ మహానగరంలో ఎన్నో అద్భుత కట్టడాలు, పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. విక్టోరియా మెమోరీ హాల్చ మార్బుల్ ప్యాలెస్, బొటానికల్ గార్డెన్, ఎకో టూరిజం పార్క్, రామక`ష్ణ మటం, ఇస్కాన్ దేవాలయం ఇలా ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.
దసరా ఉత్సవాలు
P.C: You Tube
అటు దసరా ఉత్సవాలను చూసినట్టు ఉంటుంది, ఇటు పర్యాటక ప్రాంతాలను చూసినట్టు ఉంటుందని భావించేవారు తప్పకుండా దసరా సెలవుల్లో కొల్ కతాకు వెలుతారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు ట్రావెల్స్ వారు ఎన్నో పర్యాటక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఇక్కడ కాకులు తిన్న ఆహారమే భక్తులకు ప్రసాదం
కులుశేఖర పట్టిణం, తమిళనాడు
P.C: You Tube
తమిళనాడు తీర ప్రాంత గ్రామం కులశేఖరపట్టిణం. పాండ్యారాజు కులశేఖరుడి కాలంలో ఇది రేవు పట్టణంగా ఉండేది. అప్పట్లో రాజ్యానికి అవసరమైన బంగారు నాణ్యాలు తయారయ్యేవి. ప్రస్తుతం దసరా ఉత్సవాలకు ఈ కులుశేఖర పట్టిణం పెట్టింది పేరు.
సముద్ర తీరం
P.C: You Tube
ఇక్కడి సముద్ర తీరంలో కొలువై ఉన్న ముత్తురమ్మన్ దేవి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఊరు జనాభా 30వేలును దాటదు. అయితే దసరా వచ్చిందంటే దాదాపు 20 లక్షల మంది పర్యాటకులు ముతరమ్మన్ ఆలయానికి వస్తారు.
చండికా వేషం
P.C: You Tube
ముఖ్యంగా చండిక వేషం కట్టి చిందులు తొక్కుతారు. మండుతున్న కుండలను చేత ధరించి నర్తిస్తూ అమ్మవారికి హారతి నిస్తారు. కులశేఖరపట్టిణం వెళ్లాలంటే ముందుగా తిరునెల్వేలి జంక్షన్ వెళ్లాలి, అక్కడి నుంచి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. హైదరాబాద్ నుంచి నేరుగా విమానంలో మధురై వెళ్లి అక్కడి నుంచి కులశేఖర పట్టిణం చేరుకోవచ్చు.
కుల్లు
P.C: You Tube
దేవతలు నివసించే రాష్ట్రంగా పేరుగాంచిన హిమాచల్ ప్రదేశ్ లో దసరా ఉత్సవాలు విభిన్నంగా సాగుతాయి. విజయదశమినాడు శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. 17వ శతాబ్దంలో కుల్లు రాజ్యం క్షేమం కోరి అయోధ్య నుంచి రాముడి విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టించారని చెబుతారు.
అప్పటి నుంచి
P.C: You Tube
అప్పటి నుంచి ఇక్కడ పరిస్థితులు చక్కబడ్డాయని భక్తుల నమ్మకం. ఈ దసరా సమయంలో చుట్టు పక్కల ఉన్న గ్రామాల్లోని ఉత్సవ విగ్రహాలను కుల్లు తీసుకువస్తారు. ఇక మనాలిలో ఉన్న హిడింబి ఆలయం నుంచి హిడింబి, ఘటోత్కచ ఉత్సవ విగ్రహాలు కూడా దసరా సమయానికి ఇక్కడికి చేరుకొంటాయి.
లంకా దహనం
P.C: You Tube
ఘనంగా రథోత్సవం జరుపుతారు. హిమచల్ ప్రదేశ్ సంప్రదయా నాట్యాలు, సంగీత కార్యక్రమాలు అలరిస్తాయి. ప్రపంచంలో అన్ని చోట్ల దసరా రోజున రావణ దహనం జరిగితే కుల్లులో మాత్రం బియాస్ నది ఒడ్డున ఎండు గడ్డి, చెట్ల పొదలకు నిప్పుపెట్టి లంకా దహనం నిర్వహిస్తారు
బస్తర్ దసరా
P.C: You Tube
దండకారణ్యంలోని బస్తర్ లో జరిగే దసరా ఉత్సవాలు కూడా చాలా ప్రఖ్యాతి గాంచినవి. ఇక్కడ శ్రీరాముడు దాదాపు 14 సంవత్సరాలు వనవాసం చేశాడని చెబుతారు. ఇక్కడ ఉన్న దంతేశ్వరీ దేవాలయంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.
వీఐపీలు కూడా
P.C: You Tube
కోయల ఆటల పాటలతో ఈ ప్రాంతం కొత్త శోభను సంతరించుకొంటుంది. ఈ దసరాను చూడటానికి దేశంలోని చాలా మంది వీఐపీలు ఇక్కడకు వెలుతుంటారు. అందువల్లే మిగిలిన సమయంలో పలచాగా ఉండే పర్యాటకుల సంఖ్య దసరా సమయంలో ఎక్కువగా ఉంటుంది.
కోట దసరా
P.C: You Tube
రాజస్థాన్ లోని చంబల్ నదీ తీరంలో ఉన్న కోట లో దసరా ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. భారత దేశంలోని మిగిలి ప్రాంతాలతో పోలిస్తే కోట లో జరిగే దసరా ఉత్సవాలు విభిన్నంగా ఉంటాయి.
75 అడుగుల కంటే ఎత్తు
P.C: You Tube
దాదాపు 75 అడుగుల కంటే ఎత్తుగా ఉన్న రావణ, కుంభకర్ణ విగ్రహాలను చెడు పై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఇక్కడ తగబెడుతారు. వీటిని బానాసంచాతో నింపిపెడుతారు. ఇక్కడకు వచ్చే పర్యాటకలు రంగు రంగు దుస్తులు ధరిస్తారు.