ప్రళయం తర్వాత జీవ బీజాలు ఉన్న కుంభం భూమిని మొదట తాకిన ప్రదేశం కుంభకోణం. తళనాడులోని కుంభకోణం ఆలయాల నిలయం. ఒకొక్క ఆలయానికి ఒక్కొక్క కథనం ఉంటుంది. ఈ కథనాలన్నీ మన పురాణాల్లో ఎక్కడో ఒకచోట కనిపిస్తాయి. అటు వంటి ఆలయమే కురుంబైరం పిళ్లయార్.
ఈ వినాయకుడిని మొదట వరాహ వినాయకుడని పిలిచేవారు. హిరణ్యాక్షుడిని సంహరించి భూ దేవిని రక్షించిన వరాహ స్వామి ఈ వినాయకుడిని ప్రతిష్టించి పూజించడం వల్ల ఆ పేరు వచ్చిందని చెబుతారు.
ఈ వినాయకుడిని పూజించడం వల్ల మన జీవితంలో కష్టాలు ఉండవని ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయని స్థానిక భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో వరాహ వినాయకుడు కురుంబైరం పిళ్లయార్ గా ఎందుకు మారాడన్న విషయానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కథనం మీ కోసం...
హిరణ్యాక్షుడు
P.C: You Tube
హిరణ్యాక్షుడు భూదేవిని పాతాళ లోకంలో దాచడం తెలిసిన విషయమే. ఆ భూదేవిని రక్షించడానికి ఈ మహావిష్ణువు వరాహ రూపం దాల్చి అక్కడివెళ్లి హిరణ్యాక్షుడతో జరిగిన భీకర యుద్ధంలో శ్రీమన్నారయణుడు గెలిచి భూదేవిని రక్షించాడని మన పురాణాలు చెబుతాయి.
వరాహస్వామి
P.C: You Tube
అయితే ఈ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఆ మహావిష్ణువు విఘ్నవినాయకుడిని ఇక్కడ ప్రతిష్టించి పూజించాడని చెబుతారు. అందువల్లే ఈ వినాయకుడికి వరాహ వినాయకుడనే పేరు వచ్చినట్లు స్థలపురాణ కథనం.
పురాణ కథనం ప్రకారం
P.C: You Tube
ఇదిలా ఉండగా ఈ వినాయకుడికి అటు పై కుబైరమ్ పిళ్లయార్ అనే పేరు స్థిరపడిపోయింది. తమిళంలో కరుంబు అంటే చెరుకు పిళ్లయార్ అంటే వినాయకుడు. ఇక ఈయనకు ఈ పేరు రావడానికి గల కారణానికి సంబంధించిన ఒక కథనం ప్రచారంలో ఉంది.
చెరుకు పండించేవారు
P.C: You Tube
పూర్వం ఈ ప్రాంతంలో ఎక్కువగా చెరుకు పండించేవారు. అటు పై ఆ చెరుకు నుంచి రసం తీసి బెల్లాన్ని కూడా తయారు చేసేవారు. ఈ క్రమంలో ఒక రైతు ఒకసారి తాను పండించిన చెరుకు పంటను తీసుకునిఈ దేవాలయం ముందు నుంచి వెలుతున్నాడు.
రాత్రి సమయం
P.C: You Tube
ఇంతలో పొద్దు మునిగింది. దీంతో తన బండిని దేవాలయం ముందు ఆపి రాత్రికి అక్కడ విశ్రాంతి తోసుకోవాలనుకొన్నాడు. తన వెంట వచ్చిన పరివారానికి కూడా ఈ విషయం చెప్పి అందరికీ రాత్రి బస దేవాలయంలోనే ఏర్పాటు చేసుకున్నారు.
వినాయకుడు చిన్న బాలుడి రూపంలో
P.C: You Tube
సరిగ్గా తెల్లవారుజామున ఓ వినాయకుడు చిన్న బాలుడి వేశంలో అక్కడికి వచ్చి తనకు ఓ చెరుకు ముక్క ఇవ్వాల్సిందిగా రైతును అడిగాడు. అయితే రైతు తాను ఇవ్వనని కోసంతో చెప్పడమే కాకుండా అక్కడి నుంచి వెళ్లిపొమ్మని గదమాయించాడు.
చెరుకు పిప్పి
P.C: You Tube
పొద్దున లేచి చూసే సమయానికి ఆ చెరుకు మొత్తం పిప్పిగా మారిపోయింది. దీంతో రైతు తెల్లవారుజామున వచ్చిన వాడు సామాన్యుడైన బాలుడు కాదని సాక్షాత్తు వినాయకుడే ఆ రూపంలో వచ్చాడని తెలుసుకొంటాడు.
చెరుకు రైతు
P.C: You Tube
దీంతో తన తప్పును మన్నించమని వేడుకొంటాడు. వెంటనే చెరుకు మాములు రూపానికి వస్తుంది. అటు పై రైతు ప్రతి ఏడాది తాను పండించిన పంటలో కొంత భాగాన్ని ఈ దేవాలయంలోని వినాయకుడికి కానుకగా ఇచ్చేవాడు.
అందువల్లే ఆ పేరు
P.C: You Tube
ఆ సంప్రదాయం ఇప్పటికీ అలాగే కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికీ ఈ ప్రాంత రైతులు తమ పొలాల్లో కోతలు ముగిసిన తర్వాత వెంటనే ఇక్కడికి వచ్చి వినాయకుడికి అందులో కొంతభాగాన్ని ఇచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అందువల్లే ఈ వినాయకుడిని కుబైరమ్ పిళ్లయార్ అనే పేరు వచ్చింది.