మన దేశంలో ప్రత్యేకమైన ప్రదేశాలు ఇప్పటికీ రహస్యంగానే వున్నాయి.వీటిలో కొన్ని మన పురాణాలలో మరియు చారిత్రకకథలకు సంబంధించి వున్నాయి.వాటి రహస్యాలను చేధించటానికి అనేకమంది అనేక ప్రయత్నాలు చేసారుకూడా ఈ రహస్యాలను చేధించనేలేదు. అదేవిధంగా అనేక మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు.అటువంటి రహస్యమైన స్థలాలలో శ్రీకృష్ణుని దేవాలయం ఒకటి.
మనం దేవాలయాలకు ఉదయం, రాత్రి కూడా ఆ భగవంతుని దర్శించుటకు వెళ్తాము. అయితే దేవాలయాలకు రాత్రిసమయాలలో ఒక జీవి కూడా అక్కడ వుండదంట.ఎందుకు అనే ప్రశ్న రావటం సాధారణం. అక్కడి రహస్యాలను మీరు వింటే ఆశ్చర్యంకలగటంలో అనుమానమే లేదు.
ఈ శ్రీ కృష్ణదేవాలయంలో రాత్రి సమయాలలో ఏమవుతుందో తెలుసా?
అత్యంత రహస్యాలను కలిగివున్న ప్రదేశాలలో శ్రీ కృష్ణ దేవాలయం ఒకటి. ఆ రహస్యమైన దేవాలయంలో నిధివన్ కూడా ఒకటి.ఈ ప్రదేశం రహస్యం ద్వాపరయుగంలోని రాధాకృష్ణులకు సంబంధించినది. అసలికి ఈ నిధీవన్ ఏమిటి? ఆ నిధీవన్ లో వున్న ప్రదేశానికి రాధాకృష్ణులకు సంబంధించినది ఏమిటి? అనే దానిని గురించి తెలుసుకోండి.
ఈ శ్రీ కృష్ణదేవాలయంలో రాత్రి సమయాలలో ఏమవుతుందో తెలుసా?
మన పురాణాల ప్రకారం, రాధా-కృష్ణులు ప్రేమాయణం గురించి సామాన్యంగా మనకందరికీ తెలీదు. ఆశ్చర్యం ఏమిటంటే రాధాకృష్ణులు ఇప్పటికి ఆ నిధీవన్ లో వుంటారంట. ఇటువంటి రహస్యమయమైన ప్రదేశం ఉత్తర ప్రదేశ్ లోని మథురజిల్లాలో బృందావన్ అనే వూరిలో వుంది.
ఈ శ్రీ కృష్ణదేవాలయంలో రాత్రి సమయాలలో ఏమవుతుందో తెలుసా?
ఇక్కడున్న నిధీవన్ లో రాత్రిసమయాలలో శ్రీ కృష్ణుడు రాధను చేరుటకు వస్తాడు అని, అంతే కాదు గోపికల జతకి నృత్యాన్ని కూడా చేస్తాడు అని అక్కడి జనాల నమ్మకం. సూర్యాస్తమయం అనంతరం దేవాలయం ద్వారాలు, నిధివన్ ప్రదేశం యొక్క ముఖ్య ద్వారాలు అన్నీ మూసి వేస్తారు.
ఈ శ్రీ కృష్ణదేవాలయంలో రాత్రి సమయాలలో ఏమవుతుందో తెలుసా?
ఇక్కడి విశేషం ఏమంటే, ఈ ప్రదేశంలో రాత్రి సమయంలో కేవలం మనుష్యులే కాదు, చిన్న ప్రాణి-పాక్షులు కూడా ఆ ప్రదేశానికి వెళ్ళనేవెళ్ళవు.సాధారణంగా వుదయంపూట కోతులతో కళకళలాడుతూవుండే దేవాలయం,సాయంత్రమైతే ఎటువంటి జంతువులూ వుండవు.
ఈ శ్రీ కృష్ణదేవాలయంలో రాత్రి సమయాలలో ఏమవుతుందో తెలుసా?
ఆ ప్రదేశాన్ని శ్రీ కృష్ణుని ఏకాంత ప్రదేశమని గుర్తించటం జరిగింది. అతని ఏకాంతానికి భంగంకాకూడదని ఆ వనం యొక్క చుట్టుపక్కల కృష్ణుడి సేవకులు మనుషులరూపంలో కాపలాకాస్తుంటారని,ఈ ప్రదేశానికి సామాన్యమానవులు ప్రవేశిస్తే మరణం సంభవిస్తుందని నమ్ముతారు.
ఈ శ్రీ కృష్ణదేవాలయంలో రాత్రి సమయాలలో ఏమవుతుందో తెలుసా?
.కొంతమంది ఆ వనంలో ఏమవుతుంది అని తెలుసుకోటానికి వెళ్ళిన వారు మరణాన్ని పొందారు ఇంకా కొందరు బుద్ధిమాంధ్యులుగా మిగిలినారు. ఆ విధంగా అనేకమంది ఈ ప్రదేశానికి వచ్చి పరిశోధనలు చేయాలని అనుకునికూడా స్థానికులు అనుమతిని ఇవ్వరు.
ఈ శ్రీ కృష్ణదేవాలయంలో రాత్రి సమయాలలో ఏమవుతుందో తెలుసా?
ఈ వనం యొక్క చుట్టుపక్కల వుండే జనాలు కూడా రాత్రి సమయంలో, అడవి దిశలో అన్ని కిటికీలు మూసివేయబడతాయి.ఆ ప్రదేశంలో ఏదైనా ఒక ఇంటిద్వారం కూడా ఆ వనానికి ఎదురుముఖంగా నిర్మాణం చేయబడదు.
ఈ శ్రీ కృష్ణదేవాలయంలో రాత్రి సమయాలలో ఏమవుతుందో తెలుసా?
ఈ నిధీవనానికి పక్కనేవున్న ఇంటివాళ్ళకి రాత్రిసమయాలలో వేణువు మధురమైన శబ్దం, కాళ్ళగజ్జెల శబ్దాలు వినిపిస్తాయని అక్కడి స్థానికులు చెప్తారు.ఈ నిధీవన్ లో వున్న స్వామి హరిదాసుడు అనే కృష్ణుని భక్తుడు రాధ-కృష్ణులను ఉద్దేశించి తపస్సుచేసెనంట.
ఈ శ్రీ కృష్ణదేవాలయంలో రాత్రి సమయాలలో ఏమవుతుందో తెలుసా?
అతని తపస్సుకి మెచ్చిన రాధ-కృష్ణులు ప్రత్యక్షమై హరిదాసును కరుణించెరంట.దాని గుర్తుగా హరిదాస్ రాధ-కృష్ణులకి ఒక దేవాలయాన్ని నిర్మాణంచేసెను.దానినే రంగమహల్ అని పిలుస్తారని పురాణాలు చెప్తాయి.
ఈ శ్రీ కృష్ణదేవాలయంలో రాత్రి సమయాలలో ఏమవుతుందో తెలుసా?
ఈ దేవాలయానికి ప్రతి రాత్రి రాధ-కృష్ణులు ఏకాంతంగా కాలంగడపటానికి వస్తారంట.అదేవిధంగా దేవాలయం ద్వారాన్ని మూసేముందే రాధ-కృష్ణులు నిద్రపోయే ముందే, అలంకరించబడిన ఒక వెండి గ్లాసు నిండా పాలు, పళ్ళు రుద్దుకోవటానికి 2 వేపకడ్డీలు,రాధ అలంకరించుకోవటానికి చీర, గాజులను పెట్టి ఆ దేవాలయానికి బీగం వేసి వస్తారు.
ఈ శ్రీ కృష్ణదేవాలయంలో రాత్రి సమయాలలో ఏమవుతుందో తెలుసా?
మరుదినం వుదయం ఆ దేవాలయం తెరిచిన అనంతరం అక్కడ అంతా అస్థవ్యస్థమైవుంటుంది. అక్కడ పెట్టన పాలు వుండదు, రాగి చెంబులోని సగం నీరు వుండదు.అదేవిధంగా చెక్కిన వేప కడ్డీలు ముక్కలుముక్కలుగా పడివుంటాయి.
ఈ శ్రీ కృష్ణదేవాలయంలో రాత్రి సమయాలలో ఏమవుతుందో తెలుసా?
అక్కడున్న తీపి పదార్ధాలు సగం ఖాళీ అవుతాయి. రాధ ఆభరణాలన్నీ అస్థవ్యస్థమౌతాయి. ఇదంతా ఎలా జరుగుతాయి అనే ప్రశ్నకు సమాధానం రహస్యంగానే వుంది. ఇటీవల ఈ రహస్యాన్ని చేధించే క్రమంలో ఒక ప్రముఖ ఛానల్ వాళ్ళు ప్రయత్నం చేసారు.
ఈ శ్రీ కృష్ణదేవాలయంలో రాత్రి సమయాలలో ఏమవుతుందో తెలుసా?
ఆ ఛానల్ వారి ప్రకారం రాత్రి ఆ దేవాలయానికున్న 2ద్వారాలను మూసి, ఆ వనానికి వుండే ప్రధాన ద్వారాన్ని మూస్తారు. దేవాలయనిర్వాహకులు, చానల్ వారికి దేవాలయం వనానికి ప్రవేశం లేనికారణంగా కెమెరా జతకు అక్కడే కాపలా కాస్తుండటంవల్ల వేణువు శబ్దాలు, గజ్జెల శబ్దాలు వారికి వినపడదు.
ఈ శ్రీ కృష్ణదేవాలయంలో రాత్రి సమయాలలో ఏమవుతుందో తెలుసా?
అయితే దేవాలయపూజారి దేవాలయం ద్వారాన్ని తీసినతర్వాత లోపల మొదట చెప్పినట్లు అస్తవ్యస్తంగా వుంటుందంట. దానిని చూసిన ఛానల్ వాళ్ళు ఆశ్చర్యపడ్డారని చెప్పబడినది. ఈ నిధీవన్ లో వున్న చెట్లుకూడా గోపికలలాగా మార్పుచెంది శ్రీకృష్ణుని జతలో వుంటారని చెప్పబడినది.
ఈ శ్రీ కృష్ణదేవాలయంలో రాత్రి సమయాలలో ఏమవుతుందో తెలుసా?
ఆ చెట్లు పొద్దునజామున యథాస్థితిలో మార్పుచెందుతుందని నమ్మబడినది. ఈ వనంలో ఒక చెరువు కూడా వుంది.దీనిని "విశాఖ కుండ"అని కూడా పిలుస్తారు.కృష్ణుని జతలో నృత్యంచేసే సందర్భంలో విశాఖ అనే గోపికకు దాహంఅయ్యిందంట.
ఈ శ్రీ కృష్ణదేవాలయంలో రాత్రి సమయాలలో ఏమవుతుందో తెలుసా?
అప్పుడు శ్రీకృష్ణుడు ఆ వేణువు నుంచి బావిని సృష్టించెనంట.అందువలన ఈ చెరువును విశాఖకొండ అని పిలవబడుతుంది.ఈ స్థలానికి ఇప్పటికీ కృష్ణుడు వస్తుంటాడా? గోపికుల జతకు ఇప్పటికి నృత్యం చేస్తుంటాడనే అనేక ప్రశ్నలకు జవాబులు ఇప్పటికీ రహస్యంగానే వున్నాయి.