ఒకప్పుడు మనదేశాన్ని గోల్డెన్ బర్డ్ అని పిలిచేవారు. ఎందుకంటే, వందల ఏళ్లుగా ఇక్కడి విలువైన ముడి పదార్థాలు, ఖరీదైన వజ్రాలను పుష్కలంగా కనుగొన్నారు.
అద్భుతమైన అలంకరణలతో రాజులు, రాణులు పెద్ద రాజభవనాలలో నివసించారు.
ఒకప్పటి రాజ నివాసాలు.. ఇప్పుడు విలాసవంతమైన విడిది కేంద్రాలు
వారి రాజ్యాలను ఆడంబరమైన మైదానాల నుండి పరిపాలించారు. ఇప్పుడు కొన్ని రాజభవనాలు మాత్రమే భారతదేశ పాలనలు, యుద్ధాలు, స్వాతంత్య్రం తర్వాత అనేక మార్పులను కలిగి ఉన్నాయి. వాటి నిజమైన యజమానులు వాటిని విలాసవంతమైన హోటల్లుగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ భవనాలు విలాసవంతమైన చారిత్రక సంపదతోపాటు అద్భుతమైన నిర్మాణ శైలితో చూపరులను ఆకర్షిస్తున్నాయి. అయితే, ఇది సామాన్యులకు అందని ద్రాక్షగా.. సంపన్నులకు స్టేటస్ సింబల్గా గుర్తింపు పొందాయి. అలాంటి ఒకప్పటి రాజ నివాసాలు, ఇప్పుడు విలాసవంతమైన విడిది కేంద్రాలయ్యాయి. ఆ రాజభవనాలను ఒకసారి చూసొద్దాం.
ఉమైద్ భవన్ ప్యాలెస్, జోధ్పూర్
మొత్తం 26 ఎకరాలలో విస్తరించి ఉన్న ఉమైద్ భవన్ ప్యాలెస్ రాజస్థాన్లోని జోధ్పూర్లో ఎత్తయిన ప్రదేశంలో కొలువు దీరింది. ఇది 347 గదులతో సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తుంది. దీనిని 1928 నుంచి 1943 మధ్య నిర్మించబడింది. ప్రస్తుతం, ఇది నగరంలోని పూర్వపు రాజ కుటుంబానికి నివాసంగా కూడా వినియోగించబడుతోంది. ఈ ప్యాలెస్ యొక్క నిర్మాణశైలి క్లాసికల్ రివైవల్, ఇండో-సార్సెనిక్, వెస్ట్రన్ ఆర్ట్ల కలయికగా దర్శనమిస్తుంది. అంతటి విశిష్టత ఉంది కనుకనే ఇక్కడ ఒక రాత్రి బస చేయడానికి పన్ను మినహాయించి యాబై వేల రూపాయలకంటే ఎక్కువ మొత్తంలో ఉంటుంది.
జెహన్ నుమా ప్యాలెస్, భోపాల్
భోపాల్లోని జెహన్ నుమా ప్యాలెస్ స్పా, స్విమ్మింగ్ పూల్, స్ట్రీమ్ బాత్, ఫిట్నెస్ సెంటర్, ఫైన్ డైనింగ్ స్పేస్తో లగ్జరీ వసతిని అందిస్తుంది. ఇది ఇటాలియన్ రెసిడెన్స్, బ్రిటిష్ కలోనియల్ మరియు క్లాసిక్ గ్రీక్ ఆర్కిటెక్చర్తో చూపరులను ఆకట్టుకుంటుంది. అందుకే, ఇక్కడ బస చేయడానికి అయ్యే ఖర్చు ఒక రాత్రికి ఆరు వేల రూపాయలకంటే ఎక్కువగా ఉంటుంది.
రాంబాగ్ ప్యాలెస్, జైపూర్
సంపన్నమైన వాస్తుశైలితో జైపూర్లోని రాంబాగ్ ప్యాలెస్ మహారాజా సవాయి మాన్ సింగ్ II మరియు మహారాణి గాయత్రి నివాసంగా ఉంది. ఈ ప్యాలెస్లో ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు, ఒక కేఫ్, స్పా, రిట్రీట్ మరియు వెల్నెస్ సెంటర్ ఉన్నాయి. ఇది 1835లో నిర్మించబడింది. ఇక్కడ ఒక రాత్రి విడిది చేసేందుకు ధర రూ. 38,500 నుండి ప్రారంభమవుతుంది.
తాజ్ ఫలక్నుమా ప్యాలెస్, హైదరాబాద్
హైదరాబాద్ నుండి 2,000 అడుగుల ఎత్తులో 32 ఎకరాలలో విస్తరించి ఉన్న తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ నిజాం నివాసం. అతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అని పుకార్లు వచ్చాయి. ఇది నగరంలోనే ఉత్కంఠభరితమైన వీక్షణను అందిస్తుంది. ఈ ప్యాలెస్ తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు అద్భుతంగా కనిపిస్తుంది. అతివిశాలమైన 60 గదులు ఇక్కడ సందర్శకులను ఆకర్షిస్తాయి. ఈ ప్యాలెస్లో ఒక రాత్రికి గదిని బుక్ చేసుకునే ధర రూ. 40,000 నుండి ప్రారంభమవుతుంది.
లక్ష్మీ విలాస్ ప్యాలెస్, భరత్పూర్
ఆగ్రా-జైపూర్ హైవేలో ఉన్న రాచరిక సౌకర్యాలు మరియు పీరియడ్ డెకర్తో కూడిన లక్ష్మీ విలాస్ ప్యాలెస్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి సందడి చేయొచ్చు. అంతేకాదు, ఇక్కడి సాంస్కృతిక వారసత్వం గురించి తెలుసుకోవచ్చు. చంద్రుని వెన్నెల కాంతులతో మిరుమెట్లుగొలిపే నక్షత్రాల అందాలను చూసేందుకు ఈ ప్యాలెస్ అనువైన ఎంపిక. ఇక్కడ ఒక రాత్రికి గదిని బుక్ చేసుకునే ధర రూ.6,000 కంటే ఎక్కువగా ఉంటుంది.
ఉదయ్ బిలాస్ ప్యాలెస్, దుంగార్పూర్
ఉదయ్ బిలాస్ ప్యాలెస్ 19వ శతాబ్దపు మధ్యకాలం నాటిది. ఏక్ తంబియా మహల్తోపాటు ఒక అందమైన సరస్సు అద్భుతంగా నిర్మించబడింది. ఇది రాజపుత్ర శిల్పకళను ప్రతిబంబించే స్తంభాలు మరియు గోడలను కలిగి ఉంది. ఈ భవనంలో 23 గదులు, స్కై డైనింగ్ ఏరియాతో పాటు ఒక కొలను కూడా ఉంది.
లగ్జరీ అనుభవంతోపాటు నుండి సాంస్కృతిక వారసత్వం చరిత్రను ఈ ప్యాలెస్ల అడుగుపెట్టడం ద్వారా మూటగట్టుకోవచ్చు. ఇక్కడ ఒక రాత్రి బస చేయడానికి అయ్యే ఖర్చు రూ.7,000 కంటే ఎక్కువగా ఉంటుంది.