రాఘవేంద్రస్వామి మంత్రాలయంలో కొలువుదీరడానికి ముందు పన్నెండేళ్లు తపస్సు చేసిన స్థలం ఇదే. ఇక్కడ రాఘవేంద్రస్వామి హనుమంతుడిని దర్శించుకొన్నాడని చెబుతారు. అటువంటి పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివరాలు మీ కోసం...
ఎక్కడ ఉంది?
P.C: You Tube
రాఘవేంద్రస్వామి 12 ఏళ్లు తపస్సు చేసిన ప్రాంతం రాయచూర్ లోని గాంధాల్ గ్రామంలోనే. ఇక్కడ రాఘవేంద్రస్వామి పంచముఖ ఆంజనేయుడి దర్శనాన్ని పొందాడని చెబుతారు.
పంచముఖి ఆంజనేయ
P.C: You Tube
ఇక్కడ ఇప్పటికీ మనం పంచముఖ ఆంజనేయస్వామిని చూడవచ్చు. హనుమ, హయగ్రీవ, వరాహ, నరసింహ, గరుడ ముఖాలను ఆంజనేయస్వామి కలిగి ఉంటాడు.
పన్నెండు ఏళ్లపాటు
P.C: You Tube
శ్రీ రాఘవేంద్రస్వామి పన్నెండేళ్ల కాలం పాటు తపస్సు చేసిన ప్రాంతం ఈ గ్రామంలో ఒక చిన్న గుట్ట పైన ఉంది. ఈ గుట్ట పై ఉన్న రాళ్లు సహజ సిద్ధంగా ఏర్పడిన శిల్పాలవలే కనిపించడం విశేషం. ఇందులోనే ఒక శిల్పం పంచముఖ ఆంజనేయస్వామి వలే కనిపిస్తుంది.
గుట్ట పై భాగంలో
P.C: You Tube
మీరు ఒకసారి గుట్ట పై భాగానికి చేరుకొంటే అక్కడ ఒక గుహలోపల ఒక గర్భగుడి కనిపిస్తుంది. గుహలోనికి వెలితే ఇది ఒక పవిత్రమైన స్థలంగా మీకు గోచరిస్తుంది. అందువల్లే గురురాఘవేంద్రుడు ఈ గుహను తన తపస్సుకు ఎంచుకొనడంలో అశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే ఈ స్థలం అంత ప్రశాంతంగా ఉంటుంది.
పంచముఖి క్షేత్రం
P.C: You Tube
పంచముఖి ఆంజనేయస్వామి రాఘవేంద్రుడికి దర్శనమిచ్చిన ఈ ప్రాంతాన్ని మంచముఖి క్షేత్రం అని పిలుస్తారు. ఇది ఒక ప్రముఖ ధార్మిక క్షేత్రం. ఈ క్షేత్రంలో పంచముఖి ఆంజనేయుడికి నిత్యం పూజలు జరుగుతాయి.
గుహ
P.C: You Tube
గుహలోపల ఒక బండ పై భాగంలో మనం పంచముఖి ఆంజనేయుడిని చూడవచ్చు. ఈ ప్రతిమకే నిత్యం పూజలు జరుగుతాయి. పూర్వం ఇక్కడ అనంతాచార్యులవారు ఇక్కడ శివుడు, గణపతి, నాగ దేవవతల విగ్రహాలను ప్రతిష్టించారని చెబుతారు.
పాదరక్షలు
P.C: You Tube
ఇక్కడి ఆంజనేయుడికి భక్తులు ప్రతి ఏడాది పాదరక్షలు అందజేస్తారు. ఆంజనేయుడు ఈ పాదరక్షలను వేసుకొని తిరుగుతాడని భక్తుల నమ్మకం. ఇక్కడ ఒక పొడవైన రాతి బండ ఉంది. దీని పైనే ఆంజనేయుడు విశ్రాంతి తీసుకొంటాడని ప్రతీతి.
గ్రామదేవత ఎరుకులమ్మ
P.C: You Tube
ఇక్కడకి కూతవేటు దూరంలో గ్రామదేవత ఎరుకులమ్మ దేవాలయం ఉంది. ఈమెను స్వయంభువుగా భావిస్తారు. బాలారిష్టాలతో బాధపడుతున్న పిల్లలకు ఇక్కడ తాయత్తులు కూడా అందజేస్తారు.
మంత్రాలయానికి దగ్గర్లో
P.C: You Tube
మంత్రాలయానికి రాయచూరుకు మధ్య ఈ పుణ్యక్షేత్రం ఉంది. మంత్రాలయం నుంచి కేవలం 30 నిమిషాల ప్రయాణంతో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. సాధారణంగా మంత్రాలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రాన్ని తప్పకుండా సందర్శిస్తుంటారు.