తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా నాలుగు పర్వతాల మధ్య ఉంది. అవి వరుసగా ఉత్తరాన నగరమలై, దక్షిణాన జరుగుమలై, పశ్చిమాన కంజమలై, తూర్పున గూడు మలై. ఈ నాలుగు పర్వతాల నడుమన
ఉన్న ఒక చిన్న గుట్టపైన ఉన్న పురతాతన దేవాలయాన్ని ఇటీవల తెరిచారు. అక్కడ బయల్పడిన వస్తువులను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ మీ కోసం...
పురాతన పెరుమాల్ దేవాలయం
P.C: You Tube
తమిళనాడులోని సేలం జిల్లా నవకురిచ్చి గ్రామంలో ఉన్న ఆలయాన్ని కొన్ని దశాబ్దాలుగా మూసివేశారు. ఈ ఆలయాన్ని ఇటీవలే గ్రామస్తులు తిరిగి తెరిచారు.
పురాతన పెరుమాల్ దేవాలయం
P.C: You Tube
అయితే దేవాలయంలో కొన్ని వాస్తు దోషాలు ఉన్నాయని కొంతమంది పండితులు తెలిపారు. ఆజనేయస్వామి ఉండాల్సిన స్థలంలో వేరే దేవాతల విగ్రహాలు ఉన్నాయని పండితులు వాదించారు.
పురాతన పెరుమాల్ దేవాలయం
P.C: You Tube
వాస్తు దోషం స్వామి విగ్రహాన్ని దోష నివారనార్థం పున: ప్రతిష్టించాలని పండితులు నిర్ణయించారు. ఇందుకు చాలా వాదోపదాలు జరిగాయి. పెద్ద పెద్ద పండితుల అభప్రాయాలను తీసుకున్నారు.
పురాతన పెరుమాల్ దేవాలయం
P.C: You Tube
అనంతరం దేవతామూర్తుల ప్రతిమలను పున: ప్రతిష్టాపన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవాలయ ప్రాంగణంలో విగ్రహప్రతిష్టాపన కోసం తవ్వే సమయంలో ఒక రహస్య మార్గం కనిపించింది.
పురాతన పెరుమాల్ దేవాలయం
P.C: You Tube
దీంతో ఆశ్చర్యానికి గురైన గ్రామస్తులు ఆ రహస్యమార్గంలోనికి వెళ్లి పరిశీలించగా అక్కడ వారికి వందల ఏళ్ల చరిత్ర కలిగిన పెరుమాల్ విగ్రహం కనిపించింది.
పురాతన పెరుమాల్ దేవాలయం
P.C: You Tube
ఈ విషయం ఎంత రహస్యంగా ఉంచాలన్నా దాగలేదు. చివరికి పురావస్తుశాఖ అధికారుల చెవిన పడింది. వారు ఈ రహస్యాన్ని తెలుసుకునేందుకు ఆలయాన్ని సందర్శించారు.
పురాతన పెరుమాల్ దేవాలయం
P.C: You Tube
ఈ విగ్రహాన్ని పురావస్తుశాఖ అధికారులు అనేక రకాలుగా పరిశీలించారు. చివరికి కార్బన్ డేటింగ్ పరీక్ష అనంతరం ఈ విగ్రహాలు పదహారవ శతాబ్దానికి చెందినవని గుర్తించారు.
పురాతన పెరుమాల్ దేవాలయం
P.C: You Tube
అటు పై ఈ విగ్రహాన్ని తాము స్వాధీనం చేసుకొంటామని ప్రతిపాదించారు. అయితే ఇందుకు స్థానికులు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు.
పురాతన పెరుమాల్ దేవాలయం
P.C: You Tube
స్థానికులు, పురావస్తుశాఖ అధికారులను ఎదురించి పెరుమాల్ విగ్రహాన్ని ఇదే గుడిలో ప్రతిష్టాపన చేయాలని నిర్ణయించారు. ఈ విషయమై చాలా పోరాటమే చేశారు.
పురాతన పెరుమాల్ దేవాలయం
P.C: You Tube
ఎట్టకేలకు ఆ అత్యంత అరుదైన పురాతన విగ్రహాన్ని అదే రహస్య గుహలో ప్రతిష్టాపన చేశారు. ఈ విగ్రహాన్ని చూడటానికి ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తున్నారు.