యుగాంతం అన్న విషయం ఎప్పటికీ బ్రహ్మ పదార్థమే. అది ఎప్పుడు ఎలా వస్తుందన్న విషయం పై అనేక కథలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే కథావస్తువు ఆధారంగా అనేక నవలలు, సినిమాలు కూడా రూపుదిద్దుకొన్నాయి. ఇదిలా ఉండగా ఈ యుగాంతాన్ని ముందుకుగా తెలిపే కొన్ని పుణ్యక్షేత్రాలు మన భారత దేశం నలుమూలలా వ్యాపించి ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్న యాగండి పుణ్యక్షేత్రం కూడా ఒకటి. అంతే కాకుండా ఈ యాగంటిలో ఉన్న పుష్కరిణిలో ఎల్లప్పుడూ ఒకే పరిమాణంలో నీరు ఉండే పుష్కరిణి కూడా ఉంది. అదే విధంగా ఈ పుణ్యక్షేత్రంలో కాకులు కూడా కనిపించవు. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ క్షేత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...
వరద భయం వద్దు ఆ అయ్యప్పను ఇలా దర్శించుకొందాం
కొంగు బంగారం ఈ ఒంటి కన్ను ఆంజనేయస్వామి
యాగంటి దేవలయం
P.C: You Tube
యాగంటి దేవాలయం కర్నూలు జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇక్కడ ఉన్న నందీశ్వరుడికి దేశవ్యాప్తంగా ప్రాచూర్యం ఉంది.
పరుశరాముడు, యక్షుడి తగువు తీర్చడానికే శివుడు పురుషాంగ రూపంలో వెలిశాడా?
ఉమా మహేశ్వరుడు
P.C: You Tube
యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమా మహేశ్వరుడిని లింగం ఉంది. మొదట ఈ ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాలని భావించారు.
అతీత శక్తులున్న ఈ విభిన్న శివలింగాలను దర్శనం చేసుకొన్నారా
వేంకటేశ్వరుడు
P.C: You Tube
అయితే విగ్రహం తయారీ సమయంలో ఆ విగ్రహంలో కొంత భాగం ఆగమశాస్త్రలకు విరుద్ధంగా చెక్కబడింది. దీంతో లోపభూయిస్టమైన సదరు శ్రీ వేంకటేశ్వర విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి పక్కనే కొండ పైన సహజ సిద్ధంగా ఉన్న గుహలో ఇప్పటికీ దర్శించుకోవచ్చు.
స్వయంభువు
P.C: You Tube
ఇక స్వయంభువుగా ఆ చుట్టు పక్కల వెలిసిన ఉమా మహేశ్వర స్వామిని ఇక్కడకు తీసుకు వచ్చి ప్రతిష్టించారని చెబుతారు. ఇదిలా ఉండగా యాగంటిలో మనకు కాకులు కనిపించవు.
అగస్త్య మహాముని
P.C: You Tube
దీనికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని అగస్త్య మహర్షి సందర్శిస్తాడు. ఇక్కడ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్టిస్తే బాగుంటుందని భావించాడు.
చేతి బొటన వేలుకి
P.C: You Tube
ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ ఉండగా చేతి బొటన వేలుకి గాయమయ్యింది. తన సంకల్పంలో లోపమేమైనా ఉందనే సందేహంతో వేంకటేశ్వరస్వామి గురించి తపస్సు చేయడం ప్రారంభిస్తాడు.
కాకులు కనిపించవు.
P.C: You Tube
ఆ సమయంలో అక్కడి కాకులు అగస్త్య మహాముని తపస్సును భంగం కలిగిస్తాయి. దీంతో అగస్త్య మహాముని ఆ ప్రాంతంలో కాకులు సంచరించకుండా శాపించాడు. ఇక్కడ ఆలయంలో దీపం వెలిగిస్తే శనిదోషం నుంచి విముక్తి కలుగుతుందని చెబుతారు.
పుష్కరిణి నుంచి
P.C: You Tube
అందువల్లే యాగంటి పుణ్యక్షేత్రంలో కాకులు కనిపించవని చెబుతారు. ఇక్కడున్న పుష్కరిణిలో నీరు నంది నుంచి వస్తూ ఉంటుంది.
ఎక్కడి నుంచి వస్తుంది
P.C: You Tube
అయితే ఆ నీరు ఎక్కడ నుంచి వస్తుంది ఎక్కడికి వెలుతుందన్న విషయానికి సంబంధించి పరిశోధనలు జరిగినా ఫలితం మాత్రం కనిపించడం లేదు.
అగస్త్యుడు స్నానం చేయడం వల్ల
P.C: You Tube
ఇక ఈ కోనేరులో అగస్త్యుడు స్నానం చేసినందువల్ల ఈ పుష్కరిణిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఏ కాలంలోనైనా ఈ పుష్కరిణిలో నీరు ఒకే మట్టంలో ఉండటం ఇక్కడ విశేషం.
ఔషద గుణాలు
P.C: You Tube
ఇందులోని నీటికి ఔషద గుణాలున్నాయని, ఇందులో స్నానం చేస్తే సర్వ రోగాలు నయమౌతాయని నమ్ముతారు. పుష్కరిణి నుంచి ఆలయంలోకి వెళ్లడానికి మెట్ల మార్గం ఉంది.
ఐదు అంతస్తులు
P.C: You Tube
ప్రధాన ఆలయంలోని గోపురం ఐదు అంతస్తులను కలిగి ఉంటుంది. దీనిని దాటగానే రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళం ఉన్నాయి.
అర్థనారీశ్వరుడిగా
P.C: You Tube
గర్భాలయంలో లింగ రూపం పై ఉమా మహేశ్వరుల రూపం కనిపిస్తుంది. ఇక్కడ పరమశివుడు అర్థనారీశ్వరుడిగా విగ్రహ రూపంలో కొలువై ఉన్నాడు.
సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు
P.C: You Tube
యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు మనలను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. వేంకటేశ్వరస్వామి గుహలో అగస్త్య మహాముని కలియుగ దైవమైన వేంకటేశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్టింపజేశాడు.
సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు
P.C: You Tube
యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు మనలను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. వేంకటేశ్వరస్వామి గుహలో అగస్త్య మహాముని కలియుగ దైవమైన వేంకటేశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్టింపజేశాడు.
శంకర గుహ
P.C: You Tube
ఇక ఆ పక్కనే ఉన్న ఇంకో గుహలో బ్రహ్మం గారు కొంత కాలం తపస్సుచేసి శిష్యులకు జ్జానోపదేశం చేశారని భక్తులు నమ్ముతారు. దీనిని శంకరగుహ, రోకళ్ల గుహ అని కూడా పిలుస్తారు.
బసవన్న విగ్రహం
P.C: You Tube
యాగంటిలో అన్నింటికంటే ముఖ్యంగా చూడదగినది ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలిసిన బసవన్న విగ్రమం. ఈ బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది.
విగ్రహం పెరుగుతూ ఉంది
P.C: You Tube
దీనిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపింస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ బసవన్న విగ్రహం అంతకూ పెరుగుతోంది.
వీరబ్రహ్మం గారు
P.C: You Tube
ఈ విషయాన్ని పోతులూరు వీరబ్రహ్మం గారు తన కాలజ్జానంలో ఎప్పుడో చెప్పారు. అంతేకాకుండా కలియుగాంతం సమయంలో యాగంటి బసవన్న లేచి రంకేస్తాడని బ్రహ్మంగారు తన కాలజ్జానంలో తెలిపారు.
పురావస్తు శాఖ అధికారులు కూడా
P.C: You Tube
ఇదిలా ఉండగా యాగంటి బసవన్న విగ్రహం పరిమానంలో పెరుగుతోందన్న విషయాన్ని పురావస్తు శాఖ అధికారులు కూడా కూడా నిర్థారించారు. అయితే ఇందుకు గల కారణాలు మాత్రం చెప్పలేకపోతున్నారు.
ఇలా వెళ్లవచ్చు
P.C: You Tube
యాగంటిలో వసతి సౌకర్యాలు లేవు. యాగంటికి దగ్గరగా ఉన్న బనగానపల్లిలో వసతులు ఉన్నాయి. ఈ క్షేత్రం కర్నూలు నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుంచి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది.
ఇక్కడ ప్రసాదం ఆ నీటిలో వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తుంది, చర్మవ్యాధులకు