ఈర్ష్య ఒక నిజాన్ని దాచేస్తే స్వార్థం దాన్ని కాజేసింది. కాలం ఈ రెండింటిని కాజేసి భవిష్యత్తుకి శూన్యాన్ని మిగిల్చింది.
కొన్ని వేల ఏళ్ళనాటి భారతీయపురాతనశాస్త్రమే ఆ నిజం.ఆ శాస్త్రానికి ప్రతిఫలం మనిషికి లభించే వందల ఏళ్ల ఆయువు.
ఈ శాస్త్రాన్ని ఉపయోగించి చేసిన ఒక విగ్రహం మనిషికి వంద ఏళ్ల పైన ఆయువునిఇస్తుందంటే మీరు నమ్మగలరా?
కానీ ఇది పచ్చి నిజమని ప్రపంచవెలుగు చూసిన కొన్ని ఆధారాలు చెపుతున్నాయి.
ఈ ఆధారాలు మన దేశంలోనో,ప్రక్కదేశంలోనో లేవు. ప్రపంచదేశాలను అతి రహస్యంగా తన మూడోకంటితో గమనించే సి.ఐ.ఎసంస్థ దగ్గర వున్నాయి.
అసలేమిటి ఆ శాస్త్రం.
శాస్త్రం ఆధారంగా చేసిన విగ్రహం మనిషికి వందల ఏళ్ల ఆయువు ఎలా ఇస్తుంది.
మన దేశానికి చెందిన ఆ సంపద అమెరికా వారి నిఘాసంస్థఐన సి.ఐ.ఏ వారి దగ్గరకు ఎలా వెళ్ళాయి?
ఈ విషయాలు తెలుసుకోవాలంటే గడచిన కాలాన్ని త్రావ్వాల్సిందే.
చదవబోయే ఈ విషయాలను తెలుసుకోవటానికి టిబెట్,నేపాల్ సరిహద్దుల్లోని దవళగిరి అనే పర్వతప్రాంతంలోని మంతాంగ్ అనే ఒక బౌద్ధక్షేత్రానికి వెళ్ళాలి.
150 ఏళ్ళు బ్రతికించగల విగ్రహం
కొన్ని వేల సంల క్రితం మనఋషులు,యోగులు ఆ ప్రాంతాన్ని మనుధామం అని పిలిచేవారు. ఈ విషయాన్ని మన వారు మరిచిపోయి కొన్ని శతాబ్దాలుఅయిపోయాయి.
150 ఏళ్ళు బ్రతికించగల విగ్రహం
అయితే ఇప్పటికీ ఆ ప్రాంతప్రజలు దుర్గామాతను,హనుమంతులవారిని అమిత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.ఇక మహర్నవమినాడు భగవాన్ విశ్వకర్మలవారిని పూజించటం వారి ఆనవాయితీగా వస్తూంది.
150 ఏళ్ళు బ్రతికించగల విగ్రహం
ఈ ఆనవాయితీకి కొన్నివేల సంవత్సరాల చరిత్రకలదని పురాణాలు చెపుతున్నాయి.మన ప్రాచీన ఋగ్వేదంలో చెప్పినదానిప్రకారం దేవశిల్పి విశ్వ కర్మ వంశానికి చెందిన సానగ, సనాతన అనబడు పంచబ్రహ్మర్షులుండేవారు.వీరే మన సనాతన వైజ్ఞానికనాగరికతకి ఆద్యులు.
150 ఏళ్ళు బ్రతికించగల విగ్రహం
వారినే మను,మయ,తష్ట,శిల్పి,విశ్వజ్ఞబ్రహ్మలని కూడా పిలుస్తారు.ఈ ఐదుగురు ఒక్కొక్క శాస్త్రానికి ఆద్యులుగా ప్రసిద్ధికెక్కారు.మను బ్రహ్మ వ్యవసాయనాగరికతలకు ఆద్యులు.
150 ఏళ్ళు బ్రతికించగల విగ్రహం
ఆయన వంశీకులు మొత్తం వ్యవసాయ క్షేత్రాన్ని లిఖించారు.మయ బ్రహ్మ మరియు ఆ వంశీయులు కాష్టశిల్ప, వాస్తు నిర్మాణ, యంత్రనిర్మాణాదివిద్యలకు ఆద్యులు.
150 ఏళ్ళు బ్రతికించగల విగ్రహం
త్వష్టబ్రహ్మ మరియు వారి వంశీకులు వాస్తుశిల్పమురసాయన శాస్త్రాలలో ఆద్యులు. శిల్పి బ్రహ్మ శిలాశిల్పమురసాయన శాస్త్ర విద్యలలో గొప్పవారు.విశ్వజ్ఞ బ్రహ్మ మరియు ఆయన వంశీయులు జ్యోతిర్విద్యలో, స్వర్ణశిల్పాలలో, రసాయనాది విద్యల్లోను ప్రావీణ్యులు.
150 ఏళ్ళు బ్రతికించగల విగ్రహం
వీరిలో త్వష్టబ్రహ్మకు లోహాలగురించి,రసాయనాల గురించి పూర్తి అవగాహనవుండటంతో వాటి ఆధారంతో కొన్ని పంచలోహ,త్రిలోహ విగ్రహాలను తయారుచేసి వాటి వాటిని తగిన రీతిలో అభిషేకించి ఆ అభిషేకజలాన్ని మనిషిస్వీకరించటం వలన కలిగే లాభాలగురించి వివరించారు.
150 ఏళ్ళు బ్రతికించగల విగ్రహం
ఆయన తదనంతరం ఆయన వంశీయులు ఈ శాస్త్రాన్ని అవపోసనబట్టి దాన్నిమరుసటి తరాలవారికి అందించారుఅందువల్లనే పూర్వం ఋషులు, మునులు, మహాపురుషులు ఇటువంటి విగ్రహాలకు అభిషేకంఆరాధన చేసినతర్వాత వచ్చిన జలాన్ని తీర్థంగా స్వీకరించేవారు.
150 ఏళ్ళు బ్రతికించగల విగ్రహం
అందువల్ల వారు కొన్ని వందల సంలపాటు ఎటువంటి అనారోగ్యాలకు గురవ్వకుండా జీవించేవారు.కాలగమనంలో కొత్త మతాలు, కొత్త సిద్ధాంతాలు పుట్టుకురావటం ఇతరరాజ్యాలపై దండెత్తి ఆ విద్యాసంపదలను నాశనంచేయటంతో ఆ మహత్తరవిద్య భావి తరాలకు దూరం అయింది.
150 ఏళ్ళు బ్రతికించగల విగ్రహం
అయితే ఆ కాలంలో తయారుచేసిన కొన్ని విగ్రహాలు వున్నా అవి ఎక్కడున్నాయో అన్న సంగతి ఇంకా తెలియని ఒక మిస్టరీగానే వుండి పోయింది.అయితే విశ్వకర్మ వంశీకుడైన త్వష్టబ్రహ్మ ఇప్పుడున్న మంతాంగ్ ప్రాంతంలోనే నివసించినట్లు అక్కడి వారు చెబుతున్నారు.
150 ఏళ్ళు బ్రతికించగల విగ్రహం
ఆ వంశీయులు తయారుచేసిన ఒక బొమ్మరహస్యమే ఈ వ్యాసానికి మూలాంశం.అది 1951చైనా, టిబెట్ ప్రాంత ఆక్రమణకు పూనుకున్న సం. 1959నాటికి ఎర్రసైన్యం టిబెట్ ప్రాంతాన్ని దాదాపు ఆక్రమించుకుంది.
150 ఏళ్ళు బ్రతికించగల విగ్రహం
ఆ సమయంలో టిబెట్ లోని బౌద్ధ సన్యాసులంతా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతుండగా,సరిహద్దుప్రాంతంలోని మంతాంగ్ లోని సన్యాసులు కూడా ఆ ప్రాంతంవదిలి వెళ్ళిపోసాగారు. ఆ సమయంలో అక్కడి పరిస్థితులను గమనించటానికి వచ్చిన సి.ఐ.ఏ సంస్థకు చెందిన గూడాచారి అక్కడి బౌద్ధాసన్యాసులు తప్పించుకోటానికి సహాయంజేసారట.
150 ఏళ్ళు బ్రతికించగల విగ్రహం
అతని సహాయానికి ప్రత్యుపకారంగా ఒక సన్యాసి తన చేతిలో వున్న బరువైన చెక్కపెట్టెను ఇచ్చి అందులోని విగ్రహమహత్యమును గూర్చి చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఆ పెట్టెకు అన్నిమూలలా లోహపుతాపడాలు వున్నాయి.
150 ఏళ్ళు బ్రతికించగల విగ్రహం
అందులో విష్ణుమూర్తి శయనించివున్న పంచలోహ విగ్రహం ఒకటి వుంది.దానినే కల్పరసాయన విగ్రహం అని కూడా అంటారు.ఆ విగ్రహం ముత్యపు చూర్ణంతో మెరుగుపెట్టినట్టు తళతళమెరిసిపోతుందంట.
150 ఏళ్ళు బ్రతికించగల విగ్రహం
ఆ విగ్రహాన్ని ఒక రాగిపాత్రలో నీళ్ళు పోసి 9 రోజులపాటు ఆ నీటిలో వుంచినతరువాత 3రోజుల పాటు ఆ నీటిని సేవిస్తే అలా సేవించినవ్యక్తి 100నుండి 150సం ల పాటు జీవించగలరట.సి.ఐ.ఏ
వాళ్ళు ఈ విషయాన్ని రికార్డ్ చేసి ఆ పెట్టెని ఎస్.టి.ముష్టాంగ్ - 0183అనే కోడ్ నెంఅలాట్ చేసి దానిపై పరిశోధనలు మొదలుపెట్టారు.
150 ఏళ్ళు బ్రతికించగల విగ్రహం
ఆ విగ్రహాన్నికార్బన్ డేటింగ్ కోసం ల్యాబ్ కి పంపిస్తే అది తయారుచేసి సుమారు 25000సంలు అయ్యిందని తేలిందట. ఈ లెక్కచూసి ఖంగుతిన్న పరిశోధకులు ఈ విషయాన్ని నమ్మలేక వేరే ల్యాబ్ లలో కార్బన్ డేటింగ్ చేయించగా అన్నింటిలోనూ అదేసమయం తేలిందట.
150 ఏళ్ళు బ్రతికించగల విగ్రహం
నేటి టెక్నాలజీప్రకారం నాగరికత పుట్టి 5సంలే అవుతుందని అలాంటిది అన్ని సంల ముందు ఇలాంటి విగ్రహంఎలా తయారుచేసారనేది వారి తలలు పట్టుకునేలా చేసింది.ఆ విగ్రహబరువు 7గ్రాములుండగా ఆవిగ్రహం ప్రక్కనేఒకచెక్కపై ప్రాచీనలిపిలో కొన్ని మాటలు రాసివున్నాయట.
150 ఏళ్ళు బ్రతికించగల విగ్రహం
ఆ లిపిని డీకోడ్ చేయగా దానర్థం కల్పరసాయనామృత విగ్రహం అని తేలిందట.ఈ విషయాలపై ఆశ్చర్యపోయిన ఆ సంస్థవారు అప్పటి డైరక్టరైన జాన్ ఆధ్వర్యంలో ఆ సన్యాసిచెప్పిన మాటలు నిజమాకాదాతేల్చుకోవటానికి 1960-61మధ్యకాలంలో కొందరి వ్యక్తులకు ఆ విగ్రహంవుంచిన రాగిపాత్రలోని నీటిని త్రాగించారట.
150 ఏళ్ళు బ్రతికించగల విగ్రహం
ఆ నీటిని త్రాగిన వారు 5గురు తప్ప,మిగిలినవారందరూ 110నుంచి 140ఏళ్లవరకు బ్రతికారట.వారిలో చనిపోయిన ఐదుగురిలో నలుగురు రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోగాఒకరు వియాత్నాంయుద్ధంలో చనిపోయారు. పరీక్షలు నిర్వహించినతర్వాత సి.ఐ.ఎవారు ఆ పెట్టెను భద్రపరచగా 1966లో జరిగిన సి.ఐ.ఎ ఆడిట్ రిపోర్ట్ లో కోడ్ నెంఎస్ టి ముష్టాంగ్,0183అనే బాక్స్ భద్రంగానే వుందికానీ అందులోని విగ్రహం, చెక్క లేఖనం అదృశ్యమైనట్లు తేలింది.
150 ఏళ్ళు బ్రతికించగల విగ్రహం
అప్పుడు వాటి గురించి సి.ఐ.ఎ వారు తీవ్రంగా అన్వేషించగా ఒక ల్యాబ్ లో ఆ చెక్కలేఖనం దొరికిందికానీ విగ్రహం మాత్రం ఇంతవరకూ దొరకలేదు.ఈ విధంగా ఒక మహావిజ్ఞాన సంపాదకు సాక్ష్యం ఏమైందో ఎక్కడుందో అన్నవిషయం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కొంత మంది కుతంత్రం మనవారి అలసత్వం వెరసి మనచరిత్రకు చెదలుపట్టి అనంతవిద్యా సంపద కనుమరుగై పోయింది.