భారత దేశంలో దైవ దర్శనం సర్వ సాధారణం. ముఖ్యంగా హిందూ మతంలో దైవ దర్శనం కోసం దేవాలయాలకు వెలుతారు. అయితే కొన్ని దేవాలయాలు మంత్ర, తంత్రాల పై నమ్మకం ఉన్నవారికి, ఆ
విద్యను నేర్చుకునేవారిని విశేషంగా ఆకర్షిస్తాయి. ఈ మంత్ర తంత్రాలకు సంబంధించిన వివరాలు మన పురాణాల్లో, వేదాల్లో కూడా వివరించారు. అటువంటి మంత్ర తంత్రాలకు ప్రాచూర్యం చెందిన కొన్నిదేవాలయాల వివరాలు మీ కోసం...
వైద్యనాథ మందిరం, హిమాచల్ ప్రదేశ్
P.C: You Tube
హిమాచాల్ ప్రదేశ్ లోని వైద్యనాథ మందిరంలో ప్రధాన దైవం శివుడు. ఇక్కడ నిత్యం అఘోరాలు పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా శివలింగాన్ని అభిషేకం చేసిన నీటికి అతీత శక్తులు వస్తాయని ఇక్కడి వారు భావిస్తుంటారు.
ఏకలింగ మందిరం, రాజస్థాన్
P.C: You Tube
ఇక్కడ కూడా శివుడినే ఆరాధిస్తారు. ఈ దేవాలయం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఉంది. ఇక్కడ శివుడికి నాలుగు ముఖాలు ఉంటాయి. దీనిని నల్లని రంగు గ్రానైట్ తో నిర్మించారు.
వేతాల్ మందిరం ఒడిషా
P.C: You Tube
8వ శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయం ఒడిషాలోని భువనేశ్వర్ లో ఉంది. ఇక్కడ ప్రధాన దైవం చాముండి మాత. కాళీమాతకు ప్రతి రూపంగా ఈ దేవతను కొలుస్తారు. ఇక్కడ ప్రతి నిత్యం అఘెరాలు తాంత్రిక
పూజలు నిర్వహిస్తారు.
కామాఖ్యా దేవాలయం, అస్సాం
P.C: You Tube
శక్తిపీఠాల్లో ఒకటైన ఈ కామాఖ్య దేవాలయం తాంత్రి విధి విధానాలకు చాలా ప్రాచూర్యం చెందినది. ఇక్కడ సతీదేవి యోని పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారికి రుతుస్రావం జరుగుతుందని నమ్ముతారు.
కాళీఘాట్, కొలకత్తా
P.C: You Tube
కొలకత్తాలోని కాలీఘాట్ తాంత్రిక పూజలకు చాలా ఫేమస్. అందువల్లే ఇక్కడ ఏడాదిలో ఏ సమయంలో చూసినా అఘోరాలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. పురాణాల ప్రకారం ఇక్కడ అమ్మవారి వేళ్లుపడ్డాయని చెబుతారు.
జ్వాలాముఖి దేవాలయం, హిమాచల్ ప్రదేశ్
P.C: You Tube
జ్వాలాముఖిలో ప్రతి నిత్యం ఒక జ్వల ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. కొన్ని వందల ఏళ్లుగా ఈ జ్వాల వెలుగుతూ ఉన్నట్లు చెబుతారు. ఇక్కడ ఉన్న ఒక తీర్థంలో నీరు చూడటానికి చాలా వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే తాకితే మాములుగా చల్లగానే ఉంటాయి.
కాలభైరవ మందిరం, మధ్యప్రదేశ్
P.C: You Tube
మధ్యప్రదేశ్ లో కాలభైరవ మందిరం ఉంది. ఇక్కడ తాంత్రిక విద్యలు నిత్యం జరగుతూ ఉంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అఘెరాలు ఇక్కడికి వస్తుంటారు.
ఖజురహో మందిరం, మధ్యప్రదేశ్
P.C: You Tube
మధ్యప్రదేశ్ లోని ఖజురహో దేవాలయం శిల్పకళాక`తికే కాకుండా తాంత్రిక విద్యలకు ప్రాచూర్యం చెందినది. అందువల్లే ఇక్కడికి తాంత్రిక విద్యను అభ్యసించేవారు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.
బాలాజీ మందిర రాజస్థాన
P.C: You Tube
మెహందిపుర బాలాజీ మందిరంలో ప్రధాన దైవం ఆ ఆంజనేయుడు. ఇక్కడ దెయ్యం ఒంటి పై వస్తే పాలదోలుతారని నమ్ముతారు. అందుకే నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.
ముంబాదేవి మందిరం, ముంబై
P.C: You Tube
మంత్ర, తంత్ర శక్తులను నేర్పించే దేవాలయాల్లో ముంబైలోని ముంబాదేవి దేవాలయం ముందు ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి 8 చేతులు ఉంటాయి. నిత్యం అఘోరాలు వస్తుంటారు.
అరుదైన 'సబ్బురాయి' తో నిర్మించిన దేవాలయాలు ఈ జంట నగరాల్లో