జగదల్పూర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్టర్ జిల్లా యొక్క పాలనా కేంద్రంగా ఉంది. జగదల్పూర్ పచ్చని పర్వతాలు,పచ్చని చెట్లు,లోతైన లోయలు,దట్టమైన అడవులు, ప్రవాహాలు, జలపాతాలు, గుహలు, సహజ పార్కులు, అద్భుత కట్టడాలు, గొప్ప సహజ వనరులు, అతిశయమైన పండగ వాతావరణం కలిగి ఆనందకరమైన ఏకాంతానికి ప్రసిద్ధి చెందింది.
జగదల్పూర్ లో చూడవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ చెప్పుకోవలసిన కొన్ని పర్యాటక ప్రదేశాలు కంగర్ ధారా, మండ్వా జలపాతం, బస్తర్ ప్యాలెస్, డల్పత్ సాగర్ సరస్సు, చిత్రకూట్ జలపాతం, కైలాస గుహలు, కంగర్ ఘటి న్యాషనల్ పార్క్ మరియు మొదలగునవి.
జగదల్పూర్ హోటళ్ళ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
బస్తర్ ప్యాలెస్
జగదల్పూర్ లో బస్టర్ ప్యాలెస్ మరొక చారిత్రాత్మక ప్రదేశంగా చెప్పవచ్చు. బస్టర్ కింగ్డమ్ హెడ్ క్వార్టర్స్ ఉంది. బస్టర్ సామ్రాజ్యం రాజధానిగా బర్సుర్ నుండి జగదల్పూర్ గా మారినప్పుడు బస్టర్ రాష్ట్రం యొక్క పాలకులు నిర్మించారు. ప్రస్తుతం బస్టర్ రాయల్ కుటుంబం అక్కడ నివసిస్తున్నారు.
Photo Courtesy: Kumar Chitrang
చిత్రధార జలపాతాలు
ఛత్తీస్గఢ్ యొక్క రాష్ట్ర మధ్యలో ఉన్న చిత్రధార జలపాతాలు రాష్ట్రంలో ఉత్తమ సందర్శనా మరియు వారాంతంలో సెలవు గమ్యంగా ఉంటుంది. ఇక్కడకు దేశం మరియు రాష్ట్రమునకు చెందిన పర్యాటకులు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇక్కడకు కుటుంబాలు మరియు స్నేహితులు బయటి ప్రదేశాల్లో ఆస్వాదించడానికి మరియు కొండ పైనుంచి వేగంగా జలాలు క్రిందికి ఉధృతంగా వచ్చే ప్రవాహాన్ని వీక్షించడానికి వస్తూ ఉంటారు. అంతేకాక ఇది ఉత్తమ పిక్నిక్ ప్రదేశాలలో ఒకటిగా మారింది. సరస్సు,దట్టమైన అడవులు మరియు సహజమైన జలాలు ఈ స్థలంనకు సహజ అందంను కలిగిస్తాయి. ఛత్తీస్గఢ్ లో మొదటి ఎకో పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఈ స్థలం ర్యాంక్ పొందింది.
Photo Courtesy: Kumar Chitrang
దల్పత్ సాగర్ లేక్
దల్పత్ సాగర్ లేక్ ఛత్తీస్గఢ్ లోని అతిపెద్ద కృత్రిమ సరస్సులలో ఒకటిగా ఉంది. దల్పత్ సాగర్ మధ్యలో ఉన్న ద్వీపంలో ఒక పాత ఆలయం ఉంది. ఆలయంలో స్థానిక దేవత ఉంటుంది. ద్వీపంను చేరుకోవటానికి తెడ్డు పడవ లేదా చేపలు పట్టే పడవ ఉంటుంది. ద్వీపంలో నిలబడి పరిసరాలను ఆస్వాదించవచ్చు. ఇక్కడకు వస్తే అద్భుతమైన అనుభవం కలుగుతుంది. ద్వీపంలో కొబ్బరి చెట్లు,ఒక లైట్ టవర్ మరియు సంగీత ఫౌంటెన్ ఉన్నాయి. ద్వీపంలో కూర్చుని వీక్షణ మరియు సూర్యాస్తమయంను చూసి ఆనందించవచ్చు. సంగీత ఫౌంటెన్ ద్వీపం యొక్క అందంను పెంచుతుంది. ఈ ప్రదేశం అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.
Photo Courtesy: Kumar Chitrang
చిత్రకూట్ జలపాతం
నయాగరా జలపాతం చూడాలంటే న్యూయార్క్ వెళ్ళాల్సిందే. పాస్పోర్ట్ లేదు, వీసా లేదు ఎలా ?? అంత అవసరం లేదు అచ్చంగా నయాగరా కాకపోయినా దాదాపు అలాగే ఉండే చిత్రకూట్ జలపాతాన్ని చూస్తే... ఇంచుమించు నయాగరా జలపాతాన్ని చూసిన అనుభూతి మీ సొంతం అవుతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నయాగరా అంత వెడల్పు లేకపోయినా, ఈ జలపాతం మాత్రం చూపరులను కట్టిపడేస్తుంది. దేశంలోనే దట్టమైన అడవుల గుండా వెళ్తుంటే, అక్కడి లోయలు, గుట్టలు చేతులు చాచి మిమ్మల్ని ఆహ్వానిస్తాయి. ఈ జలపాతం జగదల్పూర్ సమీపంలో ఇంద్రావతి నదిపై ఉన్నది. నది జలాలు దట్టమైన వృక్షాల గుండా ప్రవహించడం మరియు సుమారు 95 అడుగుల ఎత్తు నుండి క్రిందికి పడే సెలయేళ్ళు పర్యాటకులను ఆకర్షిస్తాయి. వర్షాకాలంలో నది పూర్తిగా ప్రవహిస్తున్నప్పుడు మొత్తం జలపాతమంతా కళకళలాడుతూ హోరెత్తిస్తుంది. ఆ వేగం, ఝరి చూస్తుంటే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోవాల్సిందే. ప్రవాహం దిగువకు వెళ్తుంటే నది మరింతగా విస్తరించి కనపడుతుంది. మీకు వీలైతే మాత్రం పున్నమి రోజునే ఈ జలపాతాన్ని చూడండి. జలపాతం పక్కనే ఓ కొండ చరియమీద పర్యాటక శాఖవారు ఓ చిన్న కుటీరాన్ని ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి చూసేందుకు దృశ్యం బాగుంటుంది.
Photo Courtesy: ASIM CHAUDHURI
కైలాష్ గుహలు
కైలాష్ గుహలు మికుల్వాడ సమీపంలో కంగేర్ వాలీ నేషనల్ పార్క్ ప్రాంతంలో ఉన్నాయి. 1993 వ సంవత్సరంలో కనుగొనబడిన ఈ గుహలు దాదాపు 250 మీటర్ల పొడవు మరియు నేల స్థాయి కంటే 40 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఇది అద్భుతమైన దృష్టిని అందించే స్టాలక్టైట్ మరియు స్తలగ్మితే వంటి నిర్మాణాలు ఉంటాయి. గుహ ఒక ఇరుకైన ప్రారంభం ద్వారా వెళ్ళితే గుహ చివరిలో శివలింగ ఆకారంలో ఒక భారీ సాలగ్రామం ఉంటుంది. గుహలోంచి పొడుచుకుని వచ్చినట్లు కనిపించే సిలిండర్ ఆకారాల నుంచి విచిత్రమైన సంగీత ధ్వనులు వస్తుంటాయి. ఈ ప్రాంతానికే అవి ఆకర్షణగా ఉంటాయి. కొన్ని వందలమంది వీటిపై పరిశోధనలు చేసినా, ఏమీ కనిపెట్టలేక ఊరుకుండిపోయారు.
Photo Courtesy: Kumar Chitrang
ఇంద్రావతి నేషనల్ పార్క్
ఇంద్రావతి నది సమీపంలో ఈ నేషనల్ పార్క్ ఉండుట వలన దీనికి ఇంద్రావతి నేషనల్ పార్క్ అని పేరు వచ్చింది. దీనిని ఛత్తీస్గఢ్ యొక్క అత్యుత్తమ మరియు అత్యంత వన్యప్రాణుల ఉద్యానవనాలలో ఒకటిగా భావిస్తారు. ఈ పార్క్ జంతువులు, పక్షులు మరియు సరీసృపాల విస్తృతశ్రేణి జాతులకు ప్రసిద్ధిచెందింది. ఇది ఛత్తీస్గఢ్ యొక్క గిరిజన రాష్ట్రంలో మాత్రమే టైగర్ రిజర్వ్ గా ఉంది. పార్క్ లో ప్రధాన ఆకర్షణ అరుదైన అడవి గేదె మరియు చిత్తడి లేడి ఉన్నాయి. పార్క్ అడవిలో శాకాహార జంతువుల మేత కొరకు గడ్డి భూములను కలిగి ఉంది. ఇక్కడకు వచ్చిన వన్యప్రాణి ప్రియులను ఆకర్షిస్తుంది. ఉద్యానవనాన్ని సందర్శించడానికి ఉత్తమ సీజన్ డిసెంబర్ నుండి జూన్ నెల వరకు ఉంటుంది.
Photo Courtesy: Sequoia Hughes
కంగేర్ ఘటి నేషనల్ పార్క్
జగదల్పూర్ కి సమీపంలోని కంగేర్ ఘటి నేషనల్ పార్కు ఛత్తీస్గడ్ లోని అత్యంత ప్రసిద్ధ జాతీయ పార్కులలో ఒకటి. ఇది జగదల్పూర్ నుండి సులువుగా అందుబాటులో ఉంటుంది. దీనికి వాయువ్యం నుండి ఆగ్నేయం వైపు మధ్యలో ప్రవహించే కంగేర్ నది పేరు పెట్టబడింది. కంగర్వ్యాలీ నేషనల్ పార్క్ పర్యటన దాదాపు ప్రతి ఒక్క పర్యాటకుడికి తిరుగులేని సంతృప్తిని, అత్యంత సహజమైన అనుభూతులను మిగులుస్తుంది. ఇక్కడ పూర్తి వైవిధ్యభరితమైన మొక్కలు, పూలు, జలపాతాలు, గుహలు, లోయలు అన్నీ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రకృతివాదులు, శాస్తవ్రేత్తలు ప్రతి సంవత్సరం తమ పరిశోధనల నిమిత్తం ఇక్కడికి వస్తుంటారు.
Photo Courtesy: Benh LIEU SONG
కోతుమ్సర్ గుహలు
కొతుమ్సర్ గుహలు భారతదేశంలో మొట్టమొదటి, ప్రపంచంలో రెండవ అతిపొడవైన సహజ గుహల స్థానాన్ని పొందాయి. ఇది భూగర్భంలో ఉండడం వల్ల, లోపల దట్టమైన చీకటి ఉంటుంది. స్టాలగ్మైట్లు, స్టాలస్టైట్లకు కోతుమ్సర్ గుహలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. వీటిగుండా వెళ్తుంటే కలిగే అనుభవాన్ని జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేం. ఇరుకైన మెట్లగుండా ఈ గుహలోకి ప్రవేశించాలి, సందర్శకులు అద్భుతమైన ధ్వనిని కలిగి ఉన్న ప్రధాన హాలులోకి వెళ్ళడానికి పొడవైన, ఇరుకైన గదుల గుండా చేరుకోవచ్చు. దీనిని సంబంధించిన బోలెడన్ని గిరిజన కధలు ఉన్నాయి, వీటిని గుపంపాల్ లేదా కుతంసర్ గుహలు అనికూడా అంటారు. ఈ గుహలను సందర్శించేటప్పుడు ఓ గైడ్ సాయం తీసుకోవడం మంచిది.
Photo Courtesy: Kumar Chitrang
తామ్ర ఘూమర్ జలపాతాలు
తామ్ర ఘూమర్ జలపాతాలు చిత్రకూట్ జలపాతానికి చాలా దగ్గరలో ఉంది. ఇది 100 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుతో ఇటీవల కనిపెట్టిన జలపాతం, ఇది సాధారణంగా వర్షాకాలంలో ఏర్పడుతుంది. ఈ ప్రాంత సహజ అందం దట్టమైన అటవీ ప్రదేశాలు, లోతైన లోయలు, అద్భుతమైన కొండలు ఈ ప్రాంత అందాన్ని మరింత జోడించాయి, వీటితో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ జలపాతాలు ఏకాంత ప్రదేశంలో ఉన్నప్పటికీ అనేకమంది పర్యాటకులు విహారానికి, సహజ అద్భుతాలను ఆనందించడానికి వారి కుటుంబాలు, స్నేహితులతో కలిసి వస్తారు. ఇది నిజంగా ఛత్తీస్గడ్ లోని ఉత్తమ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రదేశం పర్వతారోహణకు లేదా అందమైన డ్రైవ్ ను అన్వేషించడానికి ఉత్తమ మార్గం.
Photo Courtesy: Chilpi
తీర్థఘర్ జలపాతాలు
తీర్థఘర్ జలపాతాలు కంగేర్ వాలీ నేషనల్ పార్క్ లో పేరుగాంచిన పర్యావరణ పర్యాటక ప్రదేశం. ఈ అందమైన తీర్థఘర్ జలపాతం ఛత్తీస్గడ్ లోని అత్యంత అద్భుతమైన జలపాతాలలో ఒకటి. ఈ ప్రదేశం ఒక సరస్సులో ఉద్భవించిన ముగబహర్ నదిపై 100 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు నుండి అద్భుతమైన వేగంతో నీరు కిందకు పడుతుంది. వివిధ సెలయేరుల గుండా ప్రవహించే ఈ నీరు, దారిలో అనేక దారులను దాటుకుంటూ, చివరికి ఈ జలపాతం కనువిందు చేయడంతో ముగిస్తుంది. తీర్థఘర్ జలపాతం కూడా శివపార్వతులకు అంకితం చేసిన ఆలయ లక్షణాలు కల ఒక ప్రధాన ఆధ్యాత్మిక ప్రదేశం. తీర్థఘర్ జలపాత అద్భుత దృశ్యాన్ని అలాగే ఈ ఆలయం వద్ద ప్రార్ధనలు చేయడానికి ప్రతి ఏటా ఈ రాష్ట్రంలోనివారు, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి వేలమంది పర్యాటకులు, భక్తులు ఇక్కడికి వస్తారు.
Photo Courtesy: Aashishsainik
కంగేర్ ధారా
కంగేర్ ధారా, జగ్దల్పూర్ కంగేర్ వాలీ జాతీయ పార్క్ లోపల ఉంది. కంగేర్ ధార చేరుకోవడానికి, ఈ పార్క్ ప్రవేశ ద్వారం వద్ద ఉన జిల్లా అటవీ కార్యాలయం నుండి టికెట్, వర్తించే అనుమతి పొందాలి. శీతాకాలం నుండి వేసవి వరకు ఈ పార్కును సందర్శించడం ఉత్తమం, కంగేర్ వాలీ లో ఉన్న కంగేర్ ధార జలపాతం, నిజానికి అక్కడ ఎత్తుపల్లాల రాళ్ళు ఉండడం వల్ల కనేర్ నది చే ఉద్భవించింది. భూవిజ్ఞాన శాస్త్రజ్ఞులు ఈ ప్రాంతాన్ని ఒక అవక్షేపణ భూభాగంగా సూచించారు, తరువాత ఈ ప్రాంతం అగ్నిశిలలు చొరబడిన కారణంగా మడతలు పడిన నిర్మాణాన్ని పొందింది.
Photo Courtesy: Kumar Chitrang
మండవ జలపాతాలు
మండవ జలపాతాలు 70 అడుగుల ఎత్తు నుండి ప్రవహిస్తూ, దశలవారీగా ప్రవహించే ఈ సెలయేరు మండవ జలపాతం అనే అందమైన కొనను తయారుచేసింది. ఈ జలపాతం నుండి సేకరించిన నీరు ఒక చిన్న రిజర్వాయర్ లో ఉంది, దిగువ భాగంలో ప్రవహించే కంగేర్ నది తిరత్గడ్, కంగేర్-ధార అనే రెండు ఇతర జలపాతాలకు ఏర్పాటుచేసింది. ఇది చదునైన ఎత్తు, ప్రక్కనే సమాంతర శిలల కారణంగా మంచి దృశ్యాన్ని అందిస్తుంది.
Photo Courtesy: Kumar Chitrang
జగదల్పూర్ ఎలా వెళ్ళాలి
వాయు మార్గం
దీనికి సమీపంలో ఉన్న విమానాశ్రయం రాయ్ పూర్ విమానాశ్రయం. ఇక్కడి నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమానా సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఈ విమానాశ్రయం జగదల్పూర్ నుంచి సుమారుగా 288 కి. మీ. దూరంలో ఉంది.
రైలు మార్గం
జగదల్పూర్ లో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు, ముఖ్య పట్టణాలకు చక్కటి రైల్వే మార్గం కలదు. ఈ స్టేషన్ ప్యాసింజర్ ,ఎక్స్ప్రెస్ రైళ్లతో రద్దీగా ఉంటుంది.
రోడ్డు మార్గం
ఈ ప్రదేశం రాష్ట్ర రాజధాని అయిన రాయ్ పూర్ నుంచి చక్కటి రోడ్డు వ్యవస్థ కలిగి ఉంది. రాయ్ పూర్ నుంచే కాక వైజాగ్, విజయనగరం తదితర ప్రాంతాలనుంచి కూడా బస్సులు తిరుగుతుంటాయి. అంతేనా అక్కడి రోడ్డు రవాణా సంస్థ కూడా జగదల్పూర్ ప్రాంతానికి ప్రత్యేక బస్సులను కూడా ఇక్కడికి నడుపుతుంది.
Photo Courtesy: Smeet Chowdhury