మలైకోటై ఉచి పిల్లయర్ రాతికోట పై ఉన్న ఆలయం, ఇక్కడ వినాయక విగ్రహం ఉంది. ఈ ఆలయం 7వ శతాబ్దంలో నిర్మించిన ఒక పురాతన ఆలయం. ఈ ఆలయం 83 మీటర్ల పొడవుతో, మదురై నాయకులతో పూర్తిచేయబడింది. రాతి కోటపై ఉన్న ఈ ఆలయాల నిర్మాణం అద్భుతమైనది, ఇది భారతదేశ పురావస్తు శాఖవారిచే...
వెక్కలియమ్మన్ ఆలయం ట్రిచీ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న వోరైయుర్ వద్ద ఉంది. చోళుల ప్రాంతంగా ఉన్న ఈ ఆలయం ఒక ప్రధాన యాత్రా స్థలం. ఇక్కడ ప్రాధాన దేవత విగ్రహం మీద పైకప్పు ఉండకపోవడం ఈ ఆలయ ప్రధాన లక్షణం. దీనికి కారణం వెక్కలియమ్మన్ తన భక్తులతో ఈ భూమిమీద ఉన్న ప్రతి...
కావేరి నది ఒడ్డున ఉన్న గుణశీలం విష్ణు ఆలయం విష్ణు మూర్తి కి చెందినది. ఈ ఆలయం 48 రోజులలో మానసిక వికలాంగులను నయం చేస్తుందని నమ్ముతారు, అయితే ఆ సమయంలో వారిని ఇక్కడ వదలి వెళ్ళాలి. ఈ ఆలయ ప్రధాన దేవత ప్రసన్న వెంకటాచలపతి. విఖానసర్ సన్నిధి ఈ ఆలయం ప్రాంగణంలో కనిపిస్తుంది....
ట్రిచీ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో వయలూర్ మురుగన్ దేవాలయం వుంది. ఈ దేవాలయం మురుగన్ దేవుడి కోసం నిర్మించినది. ఈ దేవాలయాన్ని 1200 ఏళ్ళ క్రితం చోళ రాజుల పాలనలో నిర్మించారు. ఈ దేవాలయాన్ని ఆది వయలూర్, కుమారా వయలూరు, వన్ని వయలూరు, అగ్నీశ్వరం లాంటి ఇతర పేర్లతో కూడా...
ముక్కొంబు ఆనకట్టను కావేరి, కొల్లాడం నదులపై నిర్మించారు. ఈ డ్యాం ఇక్కడికి 18 కిలోమీటర్ల దూరంలో వుంది. నగరానికి దగ్గరగా వుండడం వల్ల ఇది ప్రసిద్ధ విహార కేంద్రంగా మారింది. ఒక అమ్యూస్మేంట్ పార్క్, పిల్లల పార్కు, ఫిషింగ్, క్రీడల్లాంటి ఇతర ఆకర్షణలు కూడా ఇక్కడ వున్నాయి....
కావేరి నది మీద నిర్మించిన కళ్ళనై డ్యాం ను గ్రాండ్ ఆనికట్ అని కూడా పిలుస్తారు. ఈ డ్యాం 146.70 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి వుంది. దీన్ని చోళ రాజు కరికాలన్ 1 వ శతాబ్దంలో నిర్మించాడు – దీన్ని ఈనాటికీ ప్రపంచంలోని అతి పురాతన నీటి యాజమాన్య వ్యవస్థగా...
ట్రిచీ లోని ప్రసిద్ధ చర్చిల్లో సెయింట్ జోసెఫ్స్ చర్చి ఒకటి. 1792 లో నిర్మించిన ఈ చర్చి భారత దేశంలోనే పురాతనమైన వాటిలో ఒకటి. బ్రిటిష్ వారి ఆర్ధిక సహాయం తో స్క్వార్ట్జ్ దీన్ని నిర్మించాడు. ఈ చర్చి ద్వారా బ్రిటిష్ వారు క్రైస్తవాన్ని ప్రచారం చేసారు.
నగరం మధ్యన...