వైశాలి నగరానికి ఎంతో బలమైన చరిత్ర కలదు. వైశాలి నగరం ఒక అందమైన నగరం. దాని చుట్టూ అనేక అరటి, మామిడి తోటలు, వరిపొలాలు వుంటాయి. అక్కడకల బౌద్ధ ప్రదేశాల కారణంగా అది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం అయింది.
పర్యాటకుల మదిలో వైశాలి నగరం ఎల్లపుడూ గుర్తుంది పోతుంది. దీని చరిత్ర చెప్పాలంటే, ఈ నగర మూలాలు రామాయణ, మహాభారతలలో వున్నాయి. దీని పేరు విశాల్ రాజు పేరుతో పెట్టారు. మహావీరుడు పుట్టాక ముందే, ఈ నగరం లిచ్చావి రాజ్యానికి రాజధానిగా వుండేది.
బుద్ధుడు, ఈ ప్రదేశం లో బోధనలు చేయటం, మహావీరుడు ఇక్కడ జన్మించటంతో ఈ నగరం అనేక విధాలుగా ప్రాముఖ్యత సంతరించుకొంది. బుద్ధుడికి జ్ఞానోదయం అయిన వంద ఏళ్లకు వైశాలి రెండవ బౌద్ధ సమావేశాలు నిర్వహించింది. సుమారు క్రి. పూ.6 వ శతాబ్దంలోనే ఇక్కడ ఎన్నికైన ప్రతినిధుల మండలి వుండటంచే, చాలా మంది చరిత్రకారులు ఈ నగరాన్ని ప్రపంచంలోనే మొదటి రిపబ్లిక్ గా గుర్తించారు. ఈ నగరం వాణిజ్య కు కూడా పేరు పడింది. ఇక్కడ ఒక ఇటుక స్తూప పక్కన నిర్మించిన అతి పెద్ద స్థంభం బుద్ధుడి చివరి ప్రసంగాన్ని రాబోయే అతని నిర్వానాన్ని చాటుతుంది. మతం, సంస్కృతి, పురావస్తు అంశాలలో వైశాలి టూరిజం అతి గొప్పదిగా చెప్పబడుతుంది.
వైశాలి పర్యటనలో ప్రధానంగా, అశోక స్థంభం, బుద్ధ స్తూపం, కుందల్పూర్, రాజ్ విశాల్ ఘర్, కరొనతిఒన్ ట్యాంక్ , బుద్ధి మాయి, రామ్చౌర, వైశాలి మ్యూజియం, వరల్డ్ పీస్ పగోడా, మొదలైనవి చూడాలి.
వైశాలి అక్కడ జరిగే మహావీరుడి జన్మదినం, వైశాలి మహోత్సవ కు పేరు గాంచింది. ఈ ఉత్సవం, వైశాలికి 35 కి.మీ.ల దూరంలోకల సోనెపూర్ లో జరుపుతారు. ఇంకా ఇక్కడ మధుబని పెయింటింగ్ లు, స్టోన్ శిల్పాలు, స్థానిక చేతి కళల వస్తువులు కలవు. ఈ వస్తువులను అందరూ తప్పక చూసి, కొనుగోలు చేసి ఆనందిస్తారు. ఇండ్లలో చేసిన బొమ్మలు, లక్క గాజులు అధికంగా వుంటాయి.
అందమైన బుట్టలు, చాపలు, చేతితో గడ్డి తో అల్లి తయారు చేయటం ఇక్కడి ప్రత్యేకత. రుచికరమైన పండ్ల రసాలు కూడా వుంటాయి. వైశాలి, రోడ్డు, రైలు, వాయు మార్గాలలో చేరవచ్చు. నేటికి ఈ నగర చారిత్రక వారసత్వం పర్యాటకులు చూసి ఆనందించవచ్చు. వైశాలి పర్యటన అక్టోబర్ నుండి మార్చ్ వరకు సౌకర్యవంతంగా చేయవచ్చు. వైశాలి కి 35 కి.మీ.ల దూరంలో ముజఫాపూర్ కలదు.