గోపురి గ్రామంలో విశ్వశాంతి స్తూపం దగ్గరలో కల గీతై మందిరం అందమైన దేవాలయం. ఇది 1980 లో ఆచార్య వినోభాభావేచే ప్రారంభించబడిన ప్రసిద్ధ ఆకర్షణ.రాళ్ళతో నిర్మించిన ఈ దేవాలయం ఒక ప్రత్యేకమైన వాస్తు నైపుణ్యం కలిగి వుంది. ఆవు ఆకారంలో నిలువుగా పేర్చిన రాళ్ళపై భగవద్గీత లోని పద్దేనిమిది అధ్యాయాలు చెక్కారు. ఈ దేవాలయంలో ఏ దేవతా విగ్రహం గానీ, పైకప్పు గానీ లేకపోవడం ఇక్కడి ప్రత్యెక ఆకర్షణ. ఈ దేవాలయ ప్రాంగణంలో, అందమైన చిన్న పార్క్ ఉంది. శాంతి కుటీరంలో జమునలాల్ బజాజ్, ఆచార్య వినోబాభావే, మహాత్మాగాంధీల జీవితాల గురించి తెలిపే ప్రదర్సనశాల నిర్వహిస్తున్నారు.