Madhu AS       Mar 06, 2023

భాగ్యనగరం చారిత్రక నిర్మాణాలకు నిలయం. అలనాటి రాచరికపు పాలనకు నిలువెత్తు  సాక్ష్యం.

అలాంటి అద్భుత రాతి నిర్మాణపు సౌధమే గోల్కొండ కోట. ఆ కోటలో దాగిన  నమ్మశక్యం కానీ ఓ 10 విశేషాలు మీకోసం...

అల‌నాటి న‌వాబుల పాల‌న‌కు నిలువెత్తు సాక్ష్యం ఈ గోల్కొండ కొట‌.  భాగ్య‌న‌గ‌ర‌పు శివార్ల‌లో ఉండి.. నేడు న‌గ‌రంలో భాగ‌మైపోయిన అద్భుత నిర్మాణ‌మిది.

కాక‌తీయుల కాలంలో మ‌ట్టితో ఓ చిన్న నిర్మాణం చేశారు. ఇప్పుడు ఆ దేవ‌త‌కే  మ‌నం తొలిబోనం స‌మ‌ర్పిస్తున్నాం. గొల్ల‌కొండ‌గా పిలిచే ఈ నిర్మాణం కాల‌క్ర‌మంలో గోల్కొండ‌గా మారింది.

Title 1

ఈ కోట అనేక ముస్లిం రాజుల‌నుంచి 15వ శ‌తాబ్దంలో కుతుబ్‌షాహీల ఆధీనంలోకి  వెళ్లింది. అప్పుడే గోల్కొండ రూపురేఖ‌లు పూర్తిగా మారిపోయాయి.

120 మీట‌ర్ల ఎత్తులో న‌ల్ల‌రాతి కొండ‌పై అద్భుత‌మైన‌..  శ‌త్రుదుర్భేధ్య‌మైన కోట‌గా అవ‌త‌రించింది ఈ గోల్కొండ‌.

గ‌డ‌చిన ఐదు వంద‌ల ఏళ్ల‌లో ఎన్నో విప‌త్తులు.. మ‌రెన్నో ఉప‌ద్ర‌వాల‌ను  త‌ట్టుకుని నేటికీ ఠీవిగా నిలుబ‌డింది ఈ చారిత్ర‌క నిర్మాణం.

కోట‌లోకి శత్రువులు వ‌స్తే.. పైన ఉన్న‌వారికి స‌మాచారం క్ష‌ణాల్లో  చేర‌వేసేలా ధ్వ‌నిశాస్త్రం ఆధారంగా ఓ అద్భుత‌మైన క‌ట్ట‌డం నిర్మించారు.

ఖిల్లా లోప‌ల నాలుగు సింహ ద్వారాలు.. అనేక రాజ‌మందిరాలు.. ఆల‌యాలు..  మ‌సీదుల‌ను ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తాయి.

గోల్కొండ కోట నిర్మాణం ఓ అద్భుతం.. అల‌నాటి ఆర్కిటెక్చ‌ర్ ఇంజ‌నీరింగ్,  నిర్మాణ విలువ‌లు చూస్తే ఎవ్వ‌రికైనా మ‌తిపోవాల్సిందే.

రామ‌దాసును తానీషా ప్ర‌భువు ఈ కోట‌లోని కారాగారంలో బంధించాడు.

గోల్కొండను సంద‌ర్శించేందుకు వ‌చ్చే ప‌ర్యాట‌కులు రామ‌దాసు చెర‌సాల‌ను చూడ‌కుండా వెళ్ల‌లేరు.