వాల్మీకి జాతీయ పార్కు 880 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి వుంది. ఇది పశ్చిమ చంపారన్ లోని శివాలిక్ శ్రేణుల చివరి అంచున నెలకొని వుంది. ఈ జాతీయ పార్కు మౌలికంగా పులుల లాంటి అంతరించిపోతున్న వన్య ప్రాణులకు నిలయం. ఈ అభయారణ్యం పూర్తిగా దట్టమైన పచ్చదనంతో కప్పబడి...
పంచానంద్, సోనాహ, గండక్ అనే మూడు నదుల పవిత్ర సంగమమే పశ్చిమ చంపారన్ లో వాయవ్య భాగాన వున్న త్రివేణీ నది ఒడ్డు. ప్రతి ఏటా మకర సంక్రాంతి పర్వ దినం సందర్భంగా ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది, దీన్ని పవిత్ర నదుల్లో స్నాన ఉత్సవంగా పిలుస్తారు – ఈ సమయంలో ఎంతో మంది...
2300 ఏళ్ళ నాటి అశోక స్థ౦భాలు ఇప్పటికీ నిలిచి వున్నాయి. ఈ స్థంభాలు 35 అడుగుల ఎత్తు వుంటాయి. వీటి భారీ పరిమాణం, అత్యున్నత నిర్మాణం మౌర్యుల కాలం నాటి నిర్మాణ కౌశలానికి సంకేతంగా నిలవడం వీటి ప్రత్యేకత.
బావన్ 52 శిధిలమైన కోటలకు ప్రసిద్ది చెందింది. బావన్ అంటే 52, అయితే ఘర్ అంటే కోట అని అర్ధం – దీన్నే తిరపన్ బాజార్ అంటారు. ఈ గ్రామానికి ఉత్తరాన కొద్ది దూరంలో 52 కోటలు, 53 బాజార్ల అవశేషాలు వుండగా, వాయవ్యంలో పెద్ద ఆనకట్టల శిధిలాలు వున్నాయి.
భిక్నా తోహారీ అందమైన పరిసరాల మధ్య నెలకొని వుంది. ఈ ప్రదేశం మంచుతో కప్పబడిన హిమాలయాలు, ప్రత్యేకంగా అన్నపూర్ణా శిఖరం అందమైన దృశ్యాన్ని కళ్ళకు కడుతుంది. ఈ ప్రాంతానికి ఒకసారి ఐదో కింగ్ జార్జి వేటకు వచ్చాడని చెప్తారు కనుక ప్రసిద్ది చెందింది.
పశ్చిమ చంపారన్ కి, నేపాల్ సరిహద్దులకి మధ్య సుమేశ్వర్ కొండల మీద చారిత్రిక సుమేశ్వర్ కోట వుంది. ఒక ఎత్తైన శిఖరం అంచున వున్న ఈ కోట ప్రస్తుతం శిధిలావస్థ లో వుంది. కానీ దీని అవశేషాలన్నీ చక్కగా వుండి పర్యాటకులకు ఆనందం కలిగిస్తాయి. హిమాలయాలలోని ధవళగిరి, గోసాయిథన్, గౌరీ...
1937 లో అఖిల భారత గాంధీ సేవా సంఘం వార్షిక సమావేశం బృందావన్ లోనే జరిగింది. ఈ సమావేశానికి మహాత్మా గాంధీ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, శ్రీ జె బి కృపలానీ వంటి ఉద్దండులు హాజరయ్యారు. అప్పటినుంచి గాంధీ గారు స్థాపించిన ఒక ప్రాధమిక పాఠశాల ఇక్కడ నడుస్తోంది.
పశ్చిమ చంపారన్ లో బెట్టియా పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో వున్న సరైయా మాన్ అనే ప్రశాంతమైన సరస్సు ఇక్కడి ప్రాకృతిక పర్యాటకం లో భాగం. సరైయా మాన్ చాలా వలస పక్షులకు విడిది కల్పిస్తూ చూడడానికి చాలా బాగుంటుంది.
బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లా తనదైన...
భారత స్వాతంత్ర్య సంగ్రామ సందర్భంగా భీతీహరావా ఆశ్రమానికి చాలా ప్రాముఖ్యం వుంది. ఇక్కడి నుంచే జాతిపిత మహాత్మా గాంధీ తన సుప్రసిద్ధ ‘చంపారన్ సత్యాగ్రహం’ ఇక్కడి నుంచే ప్రారంభించారు.
నందన్ ఘర్ లారియా బ్లాక్ లో వుండగా, చంకీ ఘర్ నర్కటియాగంజ్ బ్లాక్ లో వుంది. ఈ ప్రాంతంలో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే నంద వంశం, ప్రసిద్ధ ఆర్ధిక వేత్త చాణక్యుడి అవశేషాలు వున్న రెండు పెద్ద దిబ్బలు.